Stroke: వాయుకాలుష్యం, పక్షవాతం మధ్య సంబంధం.. పరిశోధకులు ఏం చెప్పారంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stroke: వాయుకాలుష్యం, స్రోక్ మధ్య సంబంధాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా స్వల్పకాలిక వాయు కాలుష్యానికి గురికావడం వల్ల కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని ఒక అధ్యయనం తెలిపింది. న్యూరాలజీ జర్నల్ లో ఈ పరిశోధన వివరాలను ప్రచురించారు. స్వల్పకాలికంగా వాయుకాలుష్యానికి గురైన ఐదు రోజుల వ్యవధిలోనే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని తేల్చింది.
స్ట్రోక్ వల్ల మెదడు దెబ్బతినడంతో పాటు దీర్ఘకాలిక వైకల్యం, మరణాలకు కారణమవుతుంది. ఒక్కోసారి పక్షవాతం వల్ల శరీరంలో ఒక వైపు భాగాలు పనిచేయకుండా పోతాయి. గతంలో దీర్ఘకాలిక వాయుకాలుష్యం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని తేల్చిందని అమ్మాన్ లోని జోర్డాన్ యూనివర్సిటీ ప్రధాన రచయిత అహ్మద్ తౌబాసి చెప్పారు. అయితే స్వల్పకాలికంగా వాయుకాలుష్యం ఎలాంటి వ్రభావం చూపిస్తుందో అని పరిశోధిస్తే.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని, స్వల్పకాలిక వాయుకాలుష్యం కూడా కేవలం 5 రోజుల్లో స్ట్రోక్ కి కారణమవుతుందని తేలిందని వెల్లడించారు.
Also Read
- Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. "రాజ్మా రైస్"తో హై ప్రోటీన్ లంచ్.!
- Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్లో కాలా చనా పులావ్.. టేస్ట్తో పాటు ప్రోటీన్ డబుల్.!
- Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
- Bed Bugs: మీ పరుపుల్లో నల్లులు నిద్ర పోతున్నాయా? పైసా ఖర్చు లేకుండా నల్లులకు ఇలా శాశ్వతంగా చెక్ పెట్టండి!
Read Also: Salaar: సలార్ బ్లాక్ బస్టర్ హిట్.. కెజిఎఫ్ కు మించి ఉంది.. థియేటర్ లో అరుపులే
110 అధ్యయనాల్లో 18 మిలియన్లకు పైగా స్ట్రోక్ కేసుల్ని పరిశీలించారు. ఈ పరిశోధనలో నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి వాయు కాలుష్యాల ప్రభావాన్ని విశ్లేషించారు. 1 మైక్రాన్, PM2.5, PM10, PM1 వంటి పరిమాణాలు ఉన్న వాయుకాలుష్య రేణువుల్ని పరిశీలించారు. PM2.5 కాలుష్య రేణువుల వాహనాలు, పవర్ ప్లాంట్లు, ఇతర ఇంధనాలు కాల్చడం వల్ల వెలువడుతుంది. అధిక సాంద్రత కలిగిన కాలుష్యం స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.
నైట్రోజన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం 28 శాతం, ఓజోన్ స్థాయిలు వల్ల 5 శాతం పెరిగినట్లు పరిశోధకులు తెలిపారు. కార్బన్ మోనాక్సైడ్ 26 శాతం, సల్ఫర్ డయాక్సైడ్ 15 శాతం స్ట్రోక్ ప్రమాదం ఉందని తెలిపారు. PM1 అధిక సాంద్రత వల్ల 9 శాతం, PM2.5 కాలుష్యం వల్ల 15 శాతం, PM10 వల్ల 14 శాతం స్ట్రోక్ ప్రమాదం ఉన్నట్లు తేలింది. అయితే 60 శాతం నైట్రోజన్ డయాక్సడ్ సాంద్రత ఉంటే 33 శాతం స్ట్రోక్స్ మరణాలకు దారి తీస్తుందని, సల్ఫర్ డయాక్సైడ్ వల్ల 60 శాతం, పీఎ 2.5 వల్ల 9 శాతం, పీఎం 10 వల్ల 2 శాతం వల్ల స్ట్రోక్ రిలేటెడ్ మరణాలు సంభవించే అవకాశం ఉందని తేలింది.
తాజావార్తలు
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!