Corona virus: : 20 కి పైగా దేశాల్లో కరోనా వ్యాప్తి.. వైరస్ మళ్ళీ బలపడిందా?
- భారత్తో సహా 20కి పైగా దేశాల్లో కరోనా కేసులు
- రోజు రోజుకూ పెరుగుతున్న రోగుల సంఖ్య
- మళ్లీ ఈ వైరస్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?
- ఈసారి కోవిడ్ మరింత ప్రమాదకరంగా మారిందా?
- ప్రజల్లో ఉత్పన్నమవుతున్న ఇలాంటి ప్రశ్నలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంతో సహా 20 కి పైగా దేశాలలో కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మళ్లీ ఈ వైరస్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? గత రెండు-మూడు సంవత్సరాల కంటే ఈసారి కోవిడ్ మరింత ప్రమాదకరంగా మారిందా? వైరస్లో ఏదైనా ప్రమాదకరమైన మ్యుటేషన్ జరిగిందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
READ MORE: IMD Warning: పలు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!
Also Read
- Health Tips : రాత్రి పిండి.. ఉదయం రొట్టె..? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
- Ragi Vadiyalu: అమ్మమ్మల కాలం నాటి టేస్ట్.. హెల్తీ రాగి వడియాలను సింపుల్గా ఇలా చేసుకోండి!
- Health Tips : పార్టీ చేసుకున్న మరుసటి రోజే జిమ్కు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!
- Ragi Pakoda: ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.. రాగి పిండితో కరకరలాడే స్నాక్స్ను సింపుల్గా ఇలా చేసుకోండి!
ఈసారి కరోనా నమూనాను పరిశీలిస్తే.. JN.1, BA.2.86 కేసులు పెరుగుతున్నాయి. ఈ వేరియంట్లు వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇప్పటివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా ICMR నుంచి ఈ వేరియంట్లు మునుపటి వాటి కంటే ప్రమాదకరమైనవని నిర్ధారించలేదు. అయితే ఈ వేరియంట్లు అంత ప్రమాదకరమైనవి కానప్పుడు… కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? అనే ప్రశ్న అందరి మదిలో ఉంది.
అయితే.. వైద్య నిపుణులు దీనికి సమాధానం ఇచ్చారు. “ప్రస్తుతం వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. తేమ, వర్షం, ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. దీనివల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ప్రజలకు దగ్గు, జలుబు, తేలికపాటి జ్వరం వంటి సమస్యలు బయటపడుతున్నాయి. ఫ్లూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించినప్పుడు.. సమీపంలో ఉన్న ఏదైనా ఇతర వైరస్ కూడా వ్యాపిస్తుంది. కోవిడ్ పూర్తిగా తగ్గుముఖం పడ్డలేదు. అక్కడక్కడా ఇంకా ఉండటం.. ఈ వేరియంట్లలో మార్పుల కారణంగా కేసులు పెరుగుతున్నాయి. ప్రజల్లో రోగనిరోధక శక్తి తగ్గడం కరోనా వ్యాప్తికి కారణం.” అని నిపుణులు చెబుతున్నారు.
కాగా.. మన దేశంలో మళ్లీ కొవిడ్ కేసులు కలకలం రేపుతున్నాయి. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకలాంటి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ కీలక సూచనలు చేశారు. కరోనా కొత్త వేరియంట్ల పట్ల భయాందోళనలు అవసరం లేదన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రభుత్వం, ఇతర ఏజెన్సీలు ప్రస్తుత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయని తెలిపారు. తన అభిప్రాయం ప్రకారం ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం అవసరమని పేర్కొన్నారు. ఎవరైనా క్యాన్సర్ రోగులు, రోగనిరోధక శక్తి సంబంధిత సమస్యలు ఉన్నవారైతే.. ఎలాంటి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
Siddaramaiah: “హిజాబ్”కు అనుమతి, “కాషాయ కండువాల”కు నో పర్మిషన్..
-
Keralam: గవర్నర్ను కలిసిన సతీశన్.. 18న సీఎంగా ప్రమాణస్వీకారం
-
TG Intermediate: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో కీలక మార్పులు.. ఇక ఫస్ట్ ఇయర్లో ప్రాక్టికల్స్..
-
Boycott Peddi: మెగా పవర్ స్టార్కు సింగిల్ స్క్రీన్ల షాక్.. ‘పెద్ది’ని బహిష్కరించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
-
Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!