Corona virus: : 20 కి పైగా దేశాల్లో కరోనా వ్యాప్తి.. వైరస్ మళ్ళీ బలపడిందా?
- భారత్తో సహా 20కి పైగా దేశాల్లో కరోనా కేసులు
- రోజు రోజుకూ పెరుగుతున్న రోగుల సంఖ్య
- మళ్లీ ఈ వైరస్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?
- ఈసారి కోవిడ్ మరింత ప్రమాదకరంగా మారిందా?
- ప్రజల్లో ఉత్పన్నమవుతున్న ఇలాంటి ప్రశ్నలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంతో సహా 20 కి పైగా దేశాలలో కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మళ్లీ ఈ వైరస్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? గత రెండు-మూడు సంవత్సరాల కంటే ఈసారి కోవిడ్ మరింత ప్రమాదకరంగా మారిందా? వైరస్లో ఏదైనా ప్రమాదకరమైన మ్యుటేషన్ జరిగిందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
READ MORE: IMD Warning: పలు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!
Also Read
- Early Pregnancy Diet: గర్భంతో ఉన్న వారు బొప్పాయి, పైనాపిల్ తినకూడదు ఎందుకు..? కారణం ఇదే..
- Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
- Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
- Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. 'నేరేడుపండు జ్యూస్' ఇంట్లోనే చేసేయండి ఇలా.!
ఈసారి కరోనా నమూనాను పరిశీలిస్తే.. JN.1, BA.2.86 కేసులు పెరుగుతున్నాయి. ఈ వేరియంట్లు వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇప్పటివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా ICMR నుంచి ఈ వేరియంట్లు మునుపటి వాటి కంటే ప్రమాదకరమైనవని నిర్ధారించలేదు. అయితే ఈ వేరియంట్లు అంత ప్రమాదకరమైనవి కానప్పుడు… కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? అనే ప్రశ్న అందరి మదిలో ఉంది.
అయితే.. వైద్య నిపుణులు దీనికి సమాధానం ఇచ్చారు. “ప్రస్తుతం వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. తేమ, వర్షం, ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. దీనివల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ప్రజలకు దగ్గు, జలుబు, తేలికపాటి జ్వరం వంటి సమస్యలు బయటపడుతున్నాయి. ఫ్లూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించినప్పుడు.. సమీపంలో ఉన్న ఏదైనా ఇతర వైరస్ కూడా వ్యాపిస్తుంది. కోవిడ్ పూర్తిగా తగ్గుముఖం పడ్డలేదు. అక్కడక్కడా ఇంకా ఉండటం.. ఈ వేరియంట్లలో మార్పుల కారణంగా కేసులు పెరుగుతున్నాయి. ప్రజల్లో రోగనిరోధక శక్తి తగ్గడం కరోనా వ్యాప్తికి కారణం.” అని నిపుణులు చెబుతున్నారు.
కాగా.. మన దేశంలో మళ్లీ కొవిడ్ కేసులు కలకలం రేపుతున్నాయి. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకలాంటి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ కీలక సూచనలు చేశారు. కరోనా కొత్త వేరియంట్ల పట్ల భయాందోళనలు అవసరం లేదన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రభుత్వం, ఇతర ఏజెన్సీలు ప్రస్తుత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయని తెలిపారు. తన అభిప్రాయం ప్రకారం ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం అవసరమని పేర్కొన్నారు. ఎవరైనా క్యాన్సర్ రోగులు, రోగనిరోధక శక్తి సంబంధిత సమస్యలు ఉన్నవారైతే.. ఎలాంటి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాష’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!