WHO Chikungunya Alert: 20 ఏళ్ల తర్వాత ముప్పుగా చికున్గున్యా.. లక్షణాలు, నివారణ మార్గాలు ఇవే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chikungunya Resurgence After 20 Years: దాదాపు 20 సంవత్సరాల తర్వాత.. చికున్గున్యా ప్రమాదం మరోసారి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిపై హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటివరకు 119 దేశాలలో చికున్గున్యా కనుగొన్నారని తెలిపింది దీని కారణంగా దాదాపు 5.6 బిలియన్ల మంది ప్రమాదంలో ఉన్నారని వెల్లడించింది. 20 సంవత్సరాల క్రితం వైరస్లో కనిపించిన అదే ఉత్పరివర్తనలు మళ్లీ కనిపించాయని నిపుణులు అంటున్నారు. దోమల ద్వారా సంక్రమించే ఈ వ్యాధి ప్రభావం భారత్పై పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అసలు దీని లక్షణాలు ఏంటి? నివారణ మార్గాల గురించి పూర్తిగా తెలుసుకుందాం…
READ MORE: NISAR: నాసా అహంకారాన్ని అణిచివేసిన ఇస్రో.. ఇందుకు సాక్ష్యంగా ‘‘నిసార్ శాటిలైట్’’
Also Read
- Summer Special: మామిడితో ఈ మ్యాజిక్ ట్రై చేశారా..? ఒక్క స్పూన్ తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు!
- Healthy Jackfruit Tacos : హెల్తీ మినీ జాక్ఫ్రూట్ టాకోస్.. టేస్టీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి.!
- Ragi Egg Dosa: బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఈ దోశ తింటే చాలు!
- Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే 'రాగి కుడుములు' చేసేయండి ఇలా..!
చికెన్గున్యా లక్షణాలు ఇవే..
ఉన్నట్టుండి, హఠాత్తుగా 102 డిగ్రీల కన్నా ఎక్కువ తీవ్రతతో జ్వరం వస్తుంది. అనంతరం తీవ్రమైన కీళ్లు, కండరాల నొప్పులు మొదలవుతాయి. చిన్న కీళ్లు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. ప్రధానంగా చేతులు, మణికట్టు, కాళ్లు, మడమలు, భుజాల్లో నొప్పి ఉంటుంది. ఆ బాధ వర్ణనాతీతం. తీవ్ర జ్వరం, నొప్పులతో మనిషి అంగుళం కూడా కదల్లేడు. అడుగు తీసి అడుగు వేయటమే కష్టంగా ఉంటుంది. నొప్పులు ఉదయం పూట మరింత ఎక్కువగానూ ఉంటాయి. కొందరికి చర్మం మీద దద్దు, దురద కూడా ఉండొచ్చు. చాలామందిలో నల్లటి మచ్చలు వస్తాయి. ఇవి ముఖ్యంగా ముక్కు మీద కనిపిస్తుంటాయి. జ్వరం ఒకట్రెండు రోజుల్లో తగ్గుతుంది గానీ నొప్పులు ఎక్కువకాలం కొనసాగుతాయి. గన్యా వైరస్ గల దోమ కుట్టాక కొందరికి రెండు రోజుల్లోనే లక్షణాలు బయటపడొచ్చు. కొందరికి 12 రోజుల తర్వాత కనిపించొచ్చు.
READ MORE: Shruti Haasan: నేను ఆయన కూతుర్ని కాదు.. అందుకే కూలీ ఒప్పుకున్నా!
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జ్వరం వచ్చిన తొలిరోజుల్లో డెంగీ, గన్యా ఒకేలా ఉంటాయి కాబట్టి నొప్పి మందులు వాడకపోవటమే మంచిది. పారాసిటమాల్ మాత్రలు వేసుకుంటే చాలు. గన్యా నిర్ధరణ అయ్యాక ఐబూప్రొఫెన్, డైక్లోఫెనాక్ వంటి ఎన్ఎస్ఏఐడీ రకం నొప్పి మందులు వాడుకోవచ్చు. ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూసుకోవటం ముఖ్యం. తగినంత నీరు, ద్రవాలు తీసుకోవాలి. బాగా విశ్రాంతి తీసుకోవాలి. నొప్పులు మరీ అంతగా వేధిస్తే ట్రెమడాల్ ఉపయోగపడుతుంది. వైరస్ వారం వరకూ రక్తంలో ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తిని తగ్గించే స్టిరాయిడ్ల వంటి మందులేవీ ఇవ్వరు. కొందరిలో వారం, రెండు వారాలు దాటినా నొప్పులు తగ్గకపోవచ్చు. కొందరు ఏమాత్రం నడవలేరు. ఇలాంటివారికి తక్కువ మోతాదు స్టిరాయిడ్లు, హైడ్రాక్సీక్లోరోక్విన్ సల్ఫేట్ ఉపశమనం కలిగిస్తాయి.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!