Health: 24 గంటలు పండ్లు, నీటితోనే గడిపేస్తున్నారా.. జాగ్రత్త
- 24 గంటలు పండ్లు.. నీటితోనే గడిపేస్తున్నారా..!
- ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం
- పోషకాల లోపం
- డీహైడ్రేషన్ సమస్యలు రోగనిరోధక శక్తిని బలహీనపరిచి.. ఇన్ఫెక్షన్ల ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కోసారి బిజీ బిజీ పనుల వల్ల తినడానికి సమయం ఉండదు. ఈ క్రమంలో.. పండ్లు, నీళ్లతోనే గడిపేస్తాం. అలాంటప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. పోషకాల లోపం, డీహైడ్రేషన్ సమస్యలు ఏర్పడుతాయి. పండ్లలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు.. ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలలో అసమతుల్యతను కలిగిస్తాయి. అదే.. నీటిలో అవసరమైన ఖనిజాలు ఉండవు.. అందువల్ల అదే పనిగా ఎప్పటికి నీరు తాగడం వల్ల ఖనిజ లోపానికి దారితీస్తుంది. దీంతో.. కళ్లు తిరగడం, తలనొప్పి, అలసట, కండరాలు తిమ్మిర్లు వస్తాయి. అంతేకాకుండా.. శరీరం రక్తంలో చక్కెర స్థాయిలలో వేగంగా తగ్గుదలని చూపిస్తుంది. ఇది హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది. ఇలానే ఆహారం తీసుకుంటే.. పోషకాహారలోపానికి కూడా గురి కావచ్చు. రోగనిరోధక శక్తిని బలహీనపరిచి.. ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది.
iPhone 16 : తొలగించగల బ్యాటరీని అభివృద్ధి చేస్తోన్న ఆపిల్..
Also Read
- Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
- Ragi Vadiyalu: అమ్మమ్మల కాలం నాటి టేస్ట్.. హెల్తీ రాగి వడియాలను సింపుల్గా ఇలా చేసుకోండి!
- Phool Gobi Yakhni Recipe : ఘుమఘుమలాడే కాశ్మీరీ వంటకం.. పూల్ గోబీ యఖ్నీ తయారీ విధానం..!
- Ragi Pakoda: ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.. రాగి పిండితో కరకరలాడే స్నాక్స్ను సింపుల్గా ఇలా చేసుకోండి!
ఇలా పండ్లు, నీటిని అధికంగా తినడం ద్వారా.. శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. శారీరకంగా.. బరువు తగ్గడం, జుట్టు రాలడం మరియు చర్మ సమస్యలకు దారితీస్తుంది. దీర్ఘకాలిక పోషకాహార లోపం వల్ల అవయవాలు దెబ్బతింటాయని.. రక్తహీనత, ఎముకల సాంద్రత తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. అవసరమై పోషకాల ఆహారం లేకపోవడం వల్ల మానసికంగా ఆందోళన, నిరాశకు దారితీస్తుంది. అంతేకాకుండా.. శరీరం సరిగ్గా పనిచేయదు.. దీంతో.. బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
ICC Final : ఐసీసీ ఫైనల్స్లో భారత్ ప్రదర్శన.. ఆస్ట్రేలియా రికార్డు సమం
అంతేకాకుండా.. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఎదుగుదల మందగించడం, రోగనిరోధక శక్తి బలహీనపడడం, బోలు ఎముకల వ్యాధి, హృదయ సంబంధ వ్యాధుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం బారిన పడుతారని వైద్యులు తెలిపారు. మానవ శరీరం సరైన పోషకాహారం లేకుండా చాలా వారాల పాటు జీవించగలదు. పోషకాహారం లేనప్పుడు.. శక్తి కోసం నిల్వ చేసిన కొవ్వును శరీరం ఉపయోగిస్తుంది. కాలేయం నిల్వ చేసిన గ్లైకోజెన్ను శక్తి కోసం గ్లూకోజ్గా మారుస్తుందని వైద్యులు పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ.. అవసరమైన పోషకాలు లేకుండా, శరీరం వేగంగా క్షీణిస్తుందని డాక్టర్ నారంగ్ తెలిపారు. దీంతో.. శరీరం బరువు తగ్గడం, అలసట వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా.. శరీరంలో అవయవాలు దెబ్బతింటాయి. జుట్టు రాలడం, రోగనిరోధక పనితీరు తగ్గుతుంది. సుదీర్ఘమైన ఆకలితో తీవ్రమైన పోషకాహార లోపం, అవయవ వైఫల్యం వల్ల మరణానికి కూడా దారితీయవచ్చు.
What happens to the body when it lives only on fruits and water for 24 hours?
తాజావార్తలు
-
RAPO23 : కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత : రామ్ పోతినేని
-
Jailer 2 : ‘జైలర్ 2’ సెట్లో విషాదం.. విద్యుత్ షాక్తో యువ కార్మికుడు మృతి!
-
Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ ’45’ స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
-
Gold and Silver Rates: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. నేడు తులం ఎంతంటే?
-
Sharwanand : ‘జార్జ్ కృష్ణ’ కోసం మిస్ ఇండియా.. వైట్ల హిట్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!