Multi Millet Masala Khichdi Recipe: రోజూ ఒకేలా బియ్యం వంటలు తినడం వల్ల బోర్ అనిపిస్తుంటుంది. అలాంటి సమయంలో ఆరోగ్యకరంగా, రుచికరంగా ఉండే ఒక మంచి ప్రత్యామ్నాయం మల్టీ మిల్లెట్ మసాలా కిచిడీ. చిరుధాన్యాలతో తయారయ్యే ఈ వంటకం శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చిరుధాన్యాలు అంటే కొర్రలు, జొన్నలు, సాన్వా (బార్న్యార్డ్ మిల్లెట్), బజ్రా వంటి ధాన్యాలు. వీటిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫిట్గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఈ మల్టీ మిల్లెట్ మసాలా కిచిడీని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
* కావలసిన పదార్థాలు
– ¼ కప్ ఫాక్స్టైల్ మిల్లెట్
– ¼ కప్ బజ్రా
– ¼ కప్ జోవర్
– ¼ కప్ సాన్వా (బార్న్యార్డ్ మిల్లెట్)
– ¼ కప్పు మూంగ్ పప్పు
– ¼ కప్పు మసూర్ పప్పు
– ½ కప్పు అర్హార్ పప్పు
– ½ స్పూన్ పసుపు
– రుచికి ఉప్పు
– 7 కప్పుల నీరు
* టెంపరింగ్ కోసం
– 3 టేబుల్ స్పూన్ల నెయ్యి,
– 2 ఎండు మిరపకాయలు,
– ½ టీస్పూన్ ఇంగువ,
– 2 టీస్పూన్ల ఆవాలు,
– 2 టీస్పూన్ల జీలకర్ర,
– కొన్ని కరివేపాకు ఆకులు,
– ½ కప్పు ఉల్లిపాయ (తరిగినది),
– 2 టీస్పూన్ల అల్లం (తరిగినది),
– 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి
– (తరిగినది), 1 పచ్చి మిరపకాయ (తరిగినది),
– ½ టీస్పూన్ పసుపు
– కారం, రుచికి సరిపడా ఉప్పు,
– 1 కప్పు టమోటా (తరిగినది),
– అవసరమైనంత నీరు
– చిటికెడు కసూరి మెంతి,
– అర నిమ్మకాయ,
– కొద్దిగా కొత్తిమీర ఆకులు
తయారీ విధానం:
ముందుగా అన్ని చిరుధాన్యాలను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి నీరు పోయాలి. తరువాత పెసలు, మసూర్ పప్పు, కంది పప్పు వేసి పసుపు, ఉప్పు కలిపి బాగా ఉడికించాలి. ఇక, మరోవైపు ఒక బాణలిలో నెయ్యి వేడి చేసి ఎండు మిరపకాయలు, ఇంగువ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, అల్లం వేసి లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తరువాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, కారం, పసుపు వేసి కలపాలి. టమోటా వేసి మసాలా మెత్తబడే వరకు ఉడికించాలి. ఈ తాలింపును ముందుగా ఉడికించిన మిల్లెట్ కిచిడీలో వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీరతో అలంకరించి, కొద్దిగా నిమ్మరసం పిండితే రుచికరమైన మల్టీ మిల్లెట్ మసాలా కిచిడీ సిద్ధమవుతుంది. ఈ ఆరోగ్యకరమైన వంటకం వేడివేడిగా తింటే రుచి రెట్టింపు అవుతుంది. ఒకసారి ట్రై చేస్తే మళ్లీ మళ్లీ చేయాలనిపించేంత రుచిగా ఉంటుంది!
