MHSRB: గుడ్ న్యూస్.. తెలంగాణలో 3334 జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్..
- తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ఎంహెచ్ఎస్ఆర్బీ బోర్డు గుడ్ న్యూస్..
- పూర్తి సమాచారం కోసం https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MHSRB: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. ఈ క్రమంలో వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవు సిద్దమైంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్నర్స్) పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) తాజా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్/డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద 1576 స్టాఫ్ నర్సు పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కింద 332, ఎంఎన్జె క్యాన్సర్ హాస్పిటల్లో 80, ఆయుష్లో 61, ఐపిఎంలో ఒక స్టాఫ్ నర్సు, మొత్తం 2050 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm ఈ లింక్పై క్లిక్ చేయండి. తాజాగా, 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో 1088, వైద్య విధాన పరిషత్లో 183, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 13 పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 5 చివరి తేదీగా ప్రకటించారు.
Read also: MLA Madhavaram: ప్రజలను సంక్షేమ పథకాల నుండి దారి మళ్లించేందుకు హైడ్రా కూల్చివేతలు..
Also Read
- RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
- Government Jobs 2026: టెన్త్ అర్హతతోనే 23,757 పోస్టులు.. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. పూర్తి వివరాలు..
- One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ముఖ్యమైన సమాచారం:
అర్హతలు: తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో నమోదైన వివరాలతో పాటు జనరల్ నర్సింగ్, మిడ్వైఫరీ (GNM) లేదా B.Sc (నర్సింగ్)లో ఉత్తీర్ణత.
వయోపరిమితి: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు. గరిష్ఠ వయోపరిమితి గతంలో 44 ఏళ్లుగా ఉండగా, తాజాగా 46 ఏళ్లకు పెంచారు.
పే స్కేల్: రూ.36,750 – నెలకు రూ.1,06,990.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష 80 పాయింట్లను కలిగి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు మరియు సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీస్కు 20 పాయింట్లు ఇవ్వబడతాయి.
దరఖాస్తు రుసుము: రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, వికలాంగులు, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.
దరఖాస్తు విధానం- ప్రారంభ-ముగింపు తేదీ: ఆన్లైన్ ద్వారా.. 28-09-2024 నుండి 14-10-2024 వరకు.
Mulugu: క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో స్థానికులు..
తాజావార్తలు
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
-
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
-
తెలంగాణ జలియన్వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!