నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రభుత్వం పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు.. తాజాగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ లో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ పోస్టులకు సంబందించిన అర్హతలు, ఆసక్తి కలిగిన వాళ్లు వెంటనే అప్లై చేసుకోవచ్చు.. జీతం పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 30 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అప్లయ్ చేయడానికి చివరి తేదీ మే 10. ఈ పోస్టులపై ఉద్యోగాలు పొందాలనుకునేవారు అధికార వెబ్ సైట్ ను చూసి అప్లై చేసుకోవచ్చు..
మొత్తం పోస్టుల వివరాలు..
అకడమిక్ కన్సల్టెంట్- 03 పోస్టులు
ట్రాన్స్ లేటర్- 23 పోస్టులు
జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో- 04 పోస్టులు
అర్హతలు..
ఒక్కో పోస్టుకు ఒక్కో అర్హతలను కలిగి ఉండాలి.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి..
వయసు..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనే వారికి 45 సంవత్సరాలు మించి ఉండకూడదు..
ఎంపిక ప్రక్రియ..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూలో అభ్యర్థుల పనితీరు ఆధారంగా ఫలితాలు సిద్ధం చేయబడతాయి..
జీతం..
అకడమిక్ కన్సల్టెంట్- రూ 60000, ట్రాన్స్ లేటర్- రూ 30000 వరకు ఉంటుంది..
ఈ పోస్టులకు అప్లై చేసుకోవారు.. అధికారిక వెబ్సైట్.. ncert.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు..