Imran Khan: అవిశ్వాసం ముప్పు..! పాక్ ప్రధాని కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ప్రధాని ఇమ్రాన్ఖాన్పై వ్యతిరేకత తీవ్రమైంది. అధికార కూటమి నుంచి ప్రధాన భాగస్వామ్య పార్టీలు తప్పుకోనున్నాయి. ప్రతిపక్షంలో చేరి ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాయి. నాలుగేళ్ల ఖాన్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఎక్కువ కావడంతో మిత్రపక్షాలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రేపు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనున్నారు ఇమ్రాన్ ఖాన్. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తాను రాజీనామా చేయనని ఇమ్రాన్ ఖాన్ తేల్చి చెప్పారు. తనకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి అన్ని దారులూ వెతుకుతున్నాయని… అవిశ్వాసంలో ప్రతిపక్షాలు నెగ్గవని ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Asteroid: భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం..!
Also Read
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
అయితే, ఓవైపు అవిశ్వాస తీర్మానం ముప్పు పొంచిఉన్నా.. శుక్రవారం జరగనున్న అవిశ్వాస తీర్మానానికి ముందు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయనని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బుధవారం చెప్పారు. జర్నలిస్టులతో సంభాషిస్తున్నప్పుడు, ప్రతిపక్షాలు తమ కార్డులన్నీ వేసినప్పటికీ, తనపై అవిశ్వాస తీర్మానం విజయవంతం కాదని ప్రధాని చెప్పినట్లు జియో న్యూస్ నివేదించింది. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయను. నేను చివరి బంతి వరకు ఆడతాను మరియు వారు ఒత్తిడిలో ఉన్నందున నేను ఒక రోజు ముందు వారిని ఆశ్చర్యపరుస్తాను అని పేర్కొన్నారు.. ఇంట్లో కూర్చుంటాను అని ఎవరూ తప్పుడు అభిప్రాయానికి రావొద్దు.. నేను రాజీనామా చేయను, దొంగల ఒత్తిడికి నేను రాజీనామా చేయాలా? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు సైన్యంతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని పునరుద్ఘాటించినట్లు జియో న్యూస్ నివేదించింది. శక్తిమంతమైన సైన్యం పాకిస్థాన్కు కీలకమని, సైన్యాన్ని విమర్శించడం సరికాదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. సైన్యం లేకపోతే, దేశం మూడు ముక్కలుగా విడిపోయేదని పేర్కొన్నారు. మరోవైపు.. ఇమ్రాన్ ఖాన్కు పాక్ ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఇటీవల స్వాత్లో జరిగిన బహిరంగ సభలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని 50 వేల జరిమానా విధించింది. ఈనెల 15న కైబర్ పఖ్తున్కావలో స్థానిక ప్రభుత్వ ఎన్నికలు జరుగుతుండగా… ఇమ్రాన్ఖాన్ స్వాత్ను సందర్శించొద్దని ఈసీపీ నిషేధం విధించింది. ఈసీ ఆదేశాలు బేఖాతరు చేసి.. ఇమ్రాన్ఖాన్ ర్యాలీలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!