Bangladesh: “శుక్రవారం ఘటన బంగ్లాదేశ్ను షేక్ చేస్తుంది”.. గర్ల్ఫ్రెండ్తో “హదీ” హత్యా నిందితుడు..
- రాడికల్ విద్యార్థి నేత హదీ హత్యతో బంగ్లాలో హింస..
- ‘‘ఈ హత్య దేశాన్ని షేక్ చేస్తుంది.’’
- గర్ల్ ఫ్రెండ్కు ముందే చెప్పిన హంతకుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: భారత వ్యతిరేకి, రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య బంగ్లాదేశ్ను అట్టుడికేలా చేస్తోంది. డిసెంబర్ 12న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చారు, మహ్మద్ యూనస్ ప్రభుత్వం ఎయిర్ అంబులెన్స్ ద్వారా అతడిని సింగపూర్కు మెరుగైన వైద్యం కోసం తరలించింది. డిసెంబర్ 19న అతను చికిత్స తీసుకుంటూ మరణించాడు. అయితే, ఇతడి మరణం బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలకు కారణమైంది. ఢాకాలో పలు మీడియా సంస్థలపై దాడులు చేయడంతో పాటు, షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నేతలపై దాడులకు తెగబడ్డారు. మైమన్సింగ్ జిల్లాలో దైవదూషణకు పాల్పడ్డాడనే ఆరోపణలపై ఒక హిందువును దారుణం కొట్టి, చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు.
అయితే, ఈ ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హదీ హంతకుల్లో ఒకరిగా భావిస్తున్న ప్రధాన నిందితుడు ఫైసల్ కరీం, తన గర్ల్ఫ్రెండ్తో ఈ హత్య గురించి పరోక్షంగా చెప్పినట్లు తెలిసింది. కాల్పులకు ముందు రోజు రాత్రి ఢాకాలోని ఒక రిసార్ట్లో బస చేసిన ఫైసల్, తన గర్ల్ ఫ్రెండ్ మరియా అక్తర్ లిమాతో ‘‘మొత్తం బంగ్లాదేశ్ షేక్ అయ్యే ఘటన’’ జరగబోతోందని చెప్పాడు. అతను మరియాకు హదీకి సంబంధించిన ఒక క్లిప్ కూడా చూపించాడని అక్కడి మీడియా నివేదించింది. ‘‘రేపు (శుక్రవారం) ఏదో జరగబోతోంది, దానితో దేశం మొత్తం వణికిపోతుంది’’ అని అక్కడ డైటీ జుగాంతర్ పత్రిక చెప్పింది. ఈ కేసులో మరియాతో సహా పలువురిని అరెస్ట్ చేశారు. ఫైసల్కు సాహెదా పర్వీన్ సామియా అనే మహిళతో వివాహం జరిగింది. ఆమెతో పాటు అతడి కుటుంబ సభ్యుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read
పక్కా ప్రణాళికతోనే హదీ హత్య:
షరీఫ్ ఉస్మాన్ హదీని పక్కా ప్రణాళికతోనే హత్య చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో ఇందులో ఒక మాజీ కౌన్సిలర్పై అనుమానం ఉన్నట్లు తేలింది. నిధుల సమీకరణ, ఆయుధాల సేకరణ, దాడి, పారిపోయేందుకు సహకరించడంలో మొత్తం 20 మంది వ్యక్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేశారు. ఫైసల్ సోదరి నివాసంలో కాల్పులకు ఉపయోగించిన మ్యాగజైన్, 11 రౌండ్ల మందుగుండు సామాగ్రి లభించింది. ఢాకా సమీపంలోని ఒక చెరువులో రెండు విదేశీ పిస్టల్లు, రెండు మ్యాగజైన్స్ స్వాధీనం చేసుకున్నారు.
కాల్పుల సమయంలో ఉపయోగించిన మోటార్ సైకిల్ నకిలీ నెంబర్ ప్లేట్ ఉపయోగించినట్లు తెలిసింది. పట్టుబడకుండా ఉండేందుకు ఫైసల్ తండ్రి నెంబర్ ప్లేట్లను మార్చినట్లు పోలీసులు కనుగొన్నారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితులు ఫైసల్, అతడి సహాయకులు భారత్ పారిపోయినట్లు అక్కడి మీడియా నివేదిస్తోంది. అయితే, భారత్ వెళ్లారనే దానికి ఆధారాలే లేవని ఢాకా పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!