Megaquake: జపాన్ సిద్ధంగా ఉండాలి.. మెగా భూకంపం రాబోతోంది..
- రాబోయే కాలంలో జపాన్లో మెగా భూకంపం..
- సిద్ధంగా ఉండాలని హెచ్చరించిన నిపుణులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Megaquake: జపాన్ వరసగా భూకంపాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గురువారం 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే, రానున్న రోజుల్లో మెగా భూకంపం వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు ఆ దేశాన్ని హెచ్చరిస్తున్నారు. జపాన్ ప్రజలు ‘‘మెగాక్వేక్’’కి సిద్ధం కావాలని చెప్పారు. 2011లో వచ్చిన భూకంపం, సునామీ కారణంగా జపాన్లో 18,500 మంది మరణించారు. ఈ సునామీ ఏకంగా ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రాన్ని దెబ్బతీయడంతో అణు విపత్తు కూడా ఏర్పడింది.
జపాన్ వాతావరణ సంఘం(జేఎంఏ) ప్రకారం.. భవిష్యత్తులో వచ్చే భారీ భూకంపాలు పెద్ద సునామీలకు కారణమవుతాయని హెచ్చరించింది. భారీ భూకంపాలు సంభవించే అవకాశం సాధారణం కన్నా ఎక్కువగా ఉందని, ఒక నిర్దిష్ట వ్యవధిలో ఖచ్చితంగా పెద్ద భూకంపం సంభవిస్తుందని చెప్పారు. గతంలో భారీ భూకంపాలు సంభవించిన పసిఫిక్ మహాసముద్రంలోని రెండు టెక్టానిక్ ప్లేట్ల మధ్య ఉన్న నాంకై ట్రఫ్ ‘‘సబ్డక్షన్ జోన్’’లోనే భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Also Read
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. "మరచిపోలేని గుణపాఠం చెబుతాం" అంటూ ఖమేనీ హెచ్చరిక
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Read Also: Bhatti Vikramarka: మూడో విడత రుణమాఫీపై రైతులకు శుభవార్త.. ఆ రోజున రుణమాఫీ
నంకై ట్రంఫ్ అంటే ఏమిటి..?
800 కి.మీ సముద్ర గర్భంలో ఉన్న ఈ ప్రాంతం టోక్యోకు పశ్చిమాన ఉన్న షిజుయోకా నుంచి క్యుషు ద్వీపంలోని దక్షిణ కొనవరకు ఉంటుంది. ఇది ప్రతీ శతాబ్ధానికి లేదా రెండు శతాబ్ధాలకు 8 లేదా 9 తీవ్రతతో భూకంపాలు వచ్చే ప్రాంతం. వీటిని ‘‘మెగాథ్రస్ట్ భూకంపాలు’’ అని పిలుస్తారు. తరుచుగా ఇక్కడ సంభవించే భూకంపాలు ప్రమాదకరమైన సునామీలను కలిగిస్తాయి.
1707లో నంకై ట్రఫ్లోని అన్ని భాగాలు ఒక్కసారిగా విడిపోయి, భూకంపం సంభవించింది. ఇది ఆ దేశ చరిత్రలోనే రెండో అంత్యంత శక్తివంతమైన భూకంపంగా మిగిలింది. ఇది ఫుజీ అగ్నిపర్వత విస్పోటనానికి కారణమైంది. 1854లో రెండు శక్తివంతమైన నంకై మెగాథ్రస్ట్లు వచ్చాయి. ఆ తర్వాత 1944, 1946లో భూకంపాలు సంభించాయి. నంకై ట్రఫ్ వెంబడి 8-9 భారీ భూకంపాలు వచ్చే 30 ఏళ్లలో 70 శాతం సంభవించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని వల్ల 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోవచ్చని అంచనా వేస్తున్నారు. 13 ట్రిలియన్ డాలర్ల నష్టం ఏర్పడొచ్చు.
తాజావార్తలు
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!