Site icon NTV Telugu

భారత్‌లో కరోనా… డబ్ల్యూహెచ్‌వో కీలక వ్యాఖ్యలు..

Soumya Swaminathan

Soumya Swaminathan

భారత్‌లో కరోనా మహమ్మారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైంటిస్ట్‌, డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌.. ఇండియాలో కరోనా ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి మారుతున్నట్లు కనిపిస్తోందన్నారు. మరికొన్నిరోజులు కోవిడ్‌ ఇలానే ఉండే అవకాశం ఉందన్నారు. 2022 ఆఖరు నాటికి.. 70 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తై, కోవిడ్‌కు ముందునాటి పరిస్థితులు తిరిగి వస్తాయని చెప్పారు. భారతదేశంలో కోవిడ్ -19 ఇప్పుడు స్థానిక దశకు చేరుకుంటోంది. దాని వ్యాప్తి రేటు మునుపటి కంటే చాలా నెమ్మదిగా ఉంది.. సాంకేతికంగా స్థానిక దశ అంటే ఏదైనా అంటువ్యాధి ప్రభావం తక్కువ సంఖ్యలో వ్యక్తులకు లేదా ఒక నిర్దిష్ట ప్రాంతానికి పరిమితం కావడం. దీనితో పాటు, వైరస్ కూడా బలహీనపడింది. ఇది కాకుండా, ప్రజలు ఈ వ్యాధితో జీవించడం కూడా నేర్చుకుంటారు. భారతదేశంలో రెండవ వేవ్ తర్వాత కరోనా కేసులు వేగంగా తగ్గాయన్నారు.

భారతదేశ పరిమాణం, జనాభా, రోగనిరోధక శక్తి స్థితిని చూస్తే, కేసులు పెరుగుతూనే ఉంటాయని చెప్పవచ్చు. అందుకే భారతదేశం అంతిమ దశకు చేరుకుంటుందని మేము నమ్ముతున్నాము. ఇప్పుడు కొన్ని నెలల క్రితం ఉన్న పరిస్థితి ఇప్పుడు ఉన్నట్లు అనిపించడం లేదు. అవును, మొదటి, రెండవ వేవ్ ల సమయంలో కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో లేదా ఇన్ఫెక్షన్ స్థాయిలు తక్కువగా ఉన్న ప్రదేశాలలో, అలాగే వ్యాక్సిన్ కవరేజ్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కేసులు పెరగవచ్చు అన్నారు.. పిల్లలకు కొవిడ్‌ సోకినప్పటికీ వ్యాధి అతి స్వల్పంగానే ఉంటుందని.. తక్కువ శాతం మంది మాత్రమే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుందన్నారు. పెద్దవారితో పోలిస్తే మరణాలు చాలా తక్కువే ఉంటాయన్నారు సౌమ్య స్వామినాథన్‌. ఇక, భారత్‌ బయోటెక్‌ డెవలప్ చేసిన కోవాగ్జిన్‌ టీకాకు త్వరలోనే డబ్ల్యూహెచ్‌వో అనుమతి వస్తుందన్నారు.

Exit mobile version