Earth: భూమి ఒక్క సెకన్ తిరగడం ఆగితే, ఏం జరుగుతుంది..?
- భూమి ఒక్క సెకన్ తిరగడం ఆగితే ఏం జరుగుతుంది..?
- విధ్వంసమే అంటున్న శాస్త్రవేత్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earth: మన విశ్వంలో ఇప్పటి వరకు జీవజాలానికి అనువైన ఏకైక గ్రహం భూమి మాత్రమే. భూమి లాంటి జీవనానికి అనుకూలంగా ఉన్న గ్రహాలను కనుగొనేందుకు ఈ అనంత కోటి విశ్వంలో శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. భూమికి ఉన్న ఫీచర్లు లాంటివి ఏ గ్రహానికి లేవు. తన మాతృ నక్షత్రం అయిన సూర్యుడి నుంచి మరీ దూరంగా కాకుండా, మరీ దగ్గరగా కాకుండా జంతు, వృక్షాలకు అనువైన ‘‘గోల్డెన్ లాక్ జోన్’’లో ఉంది. దీనికి తోడు చంద్రుడి లాంటి ఉపగ్రహం కూడా భూమికి ఉండటం ప్లస్ పాయింట్.
ఇక భూమి 23.5 డిగ్రీలు వంగి తన అక్షం చుట్టూ తాను తిరిగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతుందని మనందరికి తెలుసు. భూమి ప్రతీ గంటలకు దాదాపుగా 1600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది. ఇంత స్పీడ్లో తిరుగుతున్న భూమి ఒక్క సెకను పాటు ఆగితే ఏం అవుతుందో ఊహించుకోండి. ఒక్క సెకనే కదా ఏం అవుతుందని అనుకుంటే పొరపాటే. ఈ ఒక్క సెకన్ లో ప్రళయమే ముంచుకు వస్తుంది.
Also Read
- Putin: యుద్ధంలో కీలక పరిణామం.. 3 రోజులు ఉక్రెయిన్పై దాడులు చేయబోమన్న పుతిన్
- BLA Attack: పాక్ సైన్యంపై BLA మెరుపుదాడి.. 25 మంది సైనికులు హతం..
- Moscow: యుద్ధం ముగింపు దిశగా అడుగులు.. మాస్కోలో ట్రంప్ దూతలు చర్చలు.. పుతిన్ మెత్తబడతారా?
- Iran-US War: మరోసారి యుద్ధం తీవ్రం.. ఖర్గ్ ద్వీపం దగ్గర భారీ పేలుళ్లు.. ఇరాన్ ఆయిల్ ట్యాంకర్పై అమెరికా దాడి!
Read Also: Sir Creek: భారత్-పాకిస్తాన్ మధ్య ‘‘సర్ క్రీక్’’ వివాదం ఏంటి.? రాజ్నాథ్ సింగ్ వార్నింగ్ ఎందుకు.?
ప్రతీ 23 గంటల 56 నిమిషాలకు భూమి తన చుట్టూ తాను ఒక భ్రమణాన్ని పూర్తి చేస్తుంది. ఈ స్థిరమైన కదలికలు పగలు-రాత్రులకు సహాయపడుతున్నాయి. వాతావరణ, మహాసముద్రాల ప్రవర్తనల్ని ప్రభావితం చేస్తుంది. ఒక వేళ ఒక్క సెకన్ పాటు భూమి తిరగడం ఆపేస్తే, భూమిపై ఉన్న ప్రతీ ఒక్కటి వినాశకరమైన వేగంతో తూర్పు వైపు విసిరేయబడుతారు. వాతావరణ కదలికల్లో ఉండీ, వెయ్యి తుఫానుల శక్తితో భూమిపై ఉన్న ప్రకృతిని తుడిచిపెడుతుంది. నిర్మాణాలు కూలిపోతాయి, చెట్లు వేర్లతో సహా విసిరేయబడుతాయి.
ఆకస్మికంగా భూమి ఆగడం వల్ల, భూ అంతర్భాగంలోని పొరలు మారడం వల్ల, భారీ భూకంపాలు సంభవిస్తాయి. మహాసముద్రాలు ఉప్పొంగి, సునామీలు విధ్వంసం సృష్టిస్తాయి. ఈ పరిణామం భూమిపై ఉన్న ప్రతీ ఒక్కరిని చంపేస్తుంది, మనం ప్రయాణిస్తున్న వాహనం ఒక్కసారిగా ఆగితే ఎలా మనం ముందుకు పడుతామో, 1600 వేగంతో ప్రయాణిస్తున్న భూమి ఆగితే ప్రతీ ఒక్కరు కూడా తీవ్రమైన వేగంతో తోసేయబడుతారని ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీత్ డిగ్రాస్సే టైసన్ చెప్పారు.
ఇదే కాకుండా, ఈ పరిణామం చంద్రుడి లయను కూడా దెబ్బతీస్తుంది. భూమి భ్రమణం దాని గురుత్వాకర్షణ శక్తితో ముడిపడి ఉంది. ఇది చంద్రుడిని ప్రభావితం చేస్తుంది. ఇది చంద్రుడి మార్గాన్ని మార్చే అవకాశం కూడా ఉంది. అయితే, భూమి భ్రమణం ఆగిపోకయే అవకాశం లేనప్పటికీ, అలాంటి సంఘటన పరిణామాలు మాత్రం విధ్వంసంగా ఉంటాయి.
తాజావార్తలు
-
Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు.. 2029లోపు మరో మూడు డీఎస్సీలు..
-
Padi Kaushik Roddy : ఎథిక్స్ కమిటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లేఖ
-
Putin: యుద్ధంలో కీలక పరిణామం.. 3 రోజులు ఉక్రెయిన్పై దాడులు చేయబోమన్న పుతిన్
-
Sree Vishnu: రాష్ట్ర హోం మినిస్టర్నే ఎత్తుకెళ్లిన మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ ‘కామ్రేడ్ కళ్యాణ్’!
-
BLA Attack: పాక్ సైన్యంపై BLA మెరుపుదాడి.. 25 మంది సైనికులు హతం..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!