Israel PM: యురేనియం ఎక్కడుందో మాకు తెలుసు: ఇరాన్ సీక్రెట్ స్థలంపై ఇజ్రాయెల్ సంచలన వ్యాఖ్యలు
- ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్లలో 60 శాతం శుద్ధి చేసిన 400 కిలోల యురేనియం..
- శుద్ధి చేసిన యురేనియం జాడ కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపిన అమెరికా..
- యురేనియం ఎక్కడ దాచారో మాకు తెలుసు: ఇరాన్ సీక్రెట్ స్థలంపై ఇజ్రాయెల్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel PM: మోతాదుకు మించి ఇరాన్ యురేనియంను శుద్ధి చేయడమే ఇజ్రాయెల్, అమెరికా కోపానికి గురి కావడంతోనే.. యుద్ధానికి దారి తీసింది. ఇంత భారీ స్థాయిలో దాడి చేసినా.. ఆ శుద్ధి చేసిన యురేనియం యొక్క జాడ మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. అణుబాంబు తయారీకి అవసరమైన 60-90శాతం మధ్యలో దానిని శుద్ధి చేసి స్వచ్ఛమైన యురేనియం 235ను ఇరాన్ తయారు చేస్తోందని అమెరికా, ఇజ్రాయెల్, పశ్చిమ దేశాల ఆరోపించాయి. ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్లలో 60 శాతం శుద్ధి చేసిన 400 కిలోల యురేనియం ఉందని తేలింది. దీనిని కూడా కొన్ని రకాల ఆయుధాల్లో వాడే ఛాన్స్ ఉంది. దాన్ని చిన్న కంటైనర్లు, కార్లలో కూడా పెట్టి తరలించే అవకాశం ఉందని నిపుణులు తెలియజేశారు.
Read Also: Gold Rate Today: గోల్డ్ లవర్స్కు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
ఇక, యూఎస్ దాడులు చేసే నాటికే దేశంలోని శుద్ధి చేసిన యురేనియం మొత్తాన్ని ఓ రహస్య ప్రదేశానికి తరలించినట్లు ఇరాన్ పేర్కొంది. వీటిల్లో కొంత ఫోర్డో అణు కేంద్రం నుంచే తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే, జూన్ 19వ తేదీన 16 ట్రక్కుల కదలికలను అమెరికాకు చెందిన మ్యాక్సర్ టెక్నాలజీస్ గుర్తించింది. ఇస్ఫహాన్ పరిశోధన కేంద్రంలో కూడా ఇరాన్ దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల్లో 60 శాతం ఇక్కడే ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా జరిగిన దాడిలో కూడా నతాంజ్, ఫోర్డోపై అమెరికా బంకర్ బస్టర్లతో దాడి చేసింది. కానీ, ఇస్ఫహాన్పై మాత్రం తోమహాక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో కేవలం భవనాలకే పరిమితం అయ్యాయి. అయితే, అమెరికా దాడులు చేసిన ప్రదేశాల నుంచి రేడియేషన్ వెలువడలేదు. అసలు అక్కడ అణు ధార్మిక పదార్థాలు ఉన్నాయా అనే అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇరాన్ యురేనియం నిల్వలు ఎక్కడ ఉన్నాయో తమకు తెలియదన్నారు. వాటిని కనుక్కునే దిశగా అమెరికా ప్రణాళిక రచిస్తుందన్నారు.
Read Also: Nabha Natesh : అందం గేట్లు తెరిచేసిన నభా నటేష్..
అయితే, టెహ్నాన్ 60 శాతం శుద్ధి చేసిన 400 కిలో గ్రాముల యురేనియం గురించి ఆసక్తికరమైన ఇంటెలిజెన్స్ రిపోర్టు తమకు అందిందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. కానీ, ఆ వివరాలు బయటకు చెప్పడం కుదరదు అన్నారు. తాము హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాను చంపేసిన తర్వాత ఇరాన్ అణ్వాయుధాల తయారీ మొదలు పెట్టిందని వెల్లడించారు. దీంతో పాటు ఇరాన్ నెలకు 300 బాలిస్టిక్ క్షిపణులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాను అమెరికా అధ్యక్షుడి దృష్టికి తీసుకొచ్చి త్వరగా చర్యలు తీసుకోవాలని కోరాను.. డొనాల్డ్ ట్రంప్ కూడా అర్థం చేసుకొని యూఎస్ కి మంచి జరిగే నిర్ణయమే తీసుకున్నారని నెతన్యాహు తెలిపారు.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?