Putin: తిరుగుబాటు నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న పుతిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్లు రష్యా తరుపున పోరాడిని కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ ఏకంగా రష్యా ప్రభుత్వం, సైన్యంపైనే తిరుగుబాటు చేసింది. తాము చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే తమ చావు రష్యా ప్రజల కోసమే అంటూ వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ అన్నారు. రష్యాలో మిలిటరీ నాయకత్వాన్ని కూలుస్తామని, అధ్యక్షుడు పుతిన్ కే వార్నింగ్ ఇచ్చాడు. అన్యాయంగా తమ సైనికులను రష్యన్ ఆర్మీ చంపేస్తోందని ఆరోపించారు. రష్యా దాడుల్లో తమ సైన్యం వేలల్లో చనిపోతోందని దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.
Read Also: Maruti Suzuki WagonR CNG Price: 80 వేలకే మారుతీ వేగనార్ సీఎన్జీ.. 34 కిలోమీటర్ల మైలేజ్!
Also Read
- Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
- Trump: ట్రంప్తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
- Jammu Kashmir: పాక్కు దిమ్మతిరిగే ప్రకటన.. కాశ్మీర్పై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు
- Bangladesh: గంగా జలాలపై బంగ్లాదేశ్ కన్ను.. భారత్పై ఒత్తిడి పెంచే ప్లాన్..
ఇదిలా ఉంటే రష్యాలో సాయుధ తిరుగుబాటు నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ముఖ్య ప్రాంతాల్లో బలగాలను పెంచింది. తిరుగుబాటు నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు క్రెమ్లిన్ ప్రకటించింది. తిరుగుబాటును ఎదుర్కొనేందుకు త్వరలోనే దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ రష్యన్ వార్తా సంస్థలకు తెలియజేశారు.
మరోవైపు వాగ్నర్ గ్రూప్ రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లోని పట్టణాలను స్వాధీనం చేసుకునేందుకు సమాయత్తం అవుతోంది. ఇప్పటికే రష్యన్ ఆర్మీకి సంబంధించిన ఒక హెలికాప్టర్ని కూల్చేసినట్లు వాగ్నర్ గ్రూప్ వెల్లడించింది. మరోవైపు తిరుగుబాటు ప్రారంభించిన ప్రిగోజిన్పై క్రిమినల్ విచారణ ప్రారంభించినట్లు రష్యా ప్రభుత్వం తెలిపింది. మరోవైపు 25000 మంది బలగం తమతో ఉందని, రష్యా ప్రజలు కూడా తమతో చేరాలని, మేం తిరుగుబాటు చేయడం లేదని, న్యాయం కోసం పోరాడుతున్నామని ప్రిగోజిన్ అన్నారు.
ప్రస్తుతం వాగ్నర్ గ్రూప్ రోస్తోవ్ లోని మిలిటరీ కార్యాలయాన్ని ఆధీనంలోకి తసుకుంది. రష్యాలోని దక్షిణ ప్రాంతమైన రోస్తోవ్ లోని మిలిటరీ కార్యాలయం నుంచి ప్రిగోజిన్ ఓ వీడియోను విడుదల చేసి.. చీఫ్ ఆఫ్ స్టాఫ్ గెరాసియోమ్, రక్షణ మంత్రి సెర్గీ సోయిగు తనతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే వాగ్నర్ సేనలు మాస్కో వైపు వెళ్లాయని.. రోస్తోవ్ ను దిగ్బంధం చేస్తాయని హెచ్చరించారు. మరోవైపు గెరాసిమోవ్ మిలిటరీ కార్యాలయం నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
-
Prabhas : ప్రభాస్- ఓం రౌత్ .. అంతా ఒట్టిదే
-
Mahua Moitra: కోర్టు విచారణకు డుమ్మా.. మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్ జారీ
-
Homemade Olive Oil: ఖరీదైన ఆలివ్ ఆయిల్కు గుడ్బై.. ఇంట్లోనే తయారు చేసుకునే సింపుల్ పద్ధతి ఇదే!
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్లో ఆ 22 నిమిషాలు.. పాక్ స్పందించేలోపే సుఖోయ్ దాడి పూర్తి!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!