Viral video: ఆకతాయిలు చిల్లర చేష్టలు.. ట్రైన్ వెళ్తుండగా నీళ్లు పోసిన యువకులు.. చివరికిలా!
- ఆకతాయిలు చిల్లర చేష్టలు
- ట్రైన్ వెళ్తుండగా నీళ్లు పోసిన యువకులు
- పాకిస్థాన్లో ఘటన.. వీడియో వైరల్
ఓ ట్రైన్ పట్టాలపై పరుగులు పెడుతోంది. రైలు ఆగదులే.. ఏం చేసినా ఫర్వాలేదు అనుకున్నారు కొందరు ఆకతాయిలు. ఇంకేముంది.. రైల్వే ట్రాక్ ఆనుకుని ఒక చెరువు ఉంది. అందులో బైక్ స్టాండ్ చేసి స్టార్ట్ చేశారు. చక్రం స్పీడ్గా తిరుగుతూ.. ట్రైన్పైకి నీళ్లు చిమ్ముతోంది. దీంతో రైల్లో ఉన్న ప్రయాణికులంతా తడిచిపోయారు. దీన్ని గమనించిన పోలీసులు, రైల్వే సిబ్బంది, ప్రయాణికులు వెంటనే చైన్ లాగి ట్రైన్ ఆపేశారు. అంతే వేగంగా రైల్వే సిబ్బంది కిందకి దిగి.. యువకుల్ని పట్టుకుని చితకబాదారు. అంతేకాకుండా బైక్ను కూడా రైల్లో వేసుకుని వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన పాకిస్థాన్లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Teacher Transfers: తెలంగాణలో 18, 942 ఉపాధ్యాయులకు ప్రమోషన్లు..!
కొందరి యువకుల చిలిపి పనుల కారణంగా రైలు అర్ధాంతరంగా ఆగిపోయింది. రైలు వెళ్తుండగా.. ట్రాక్ను ఆనుకుని ఉన్న చెరువు నుంచి నీళ్లు చిమ్మారు. దీంతో కోపోద్రేకులైన ప్రయాణికులు.. యువకుల భరతం పట్టారు. యువకులకు బడిత పూజ చేసి.. బైకు ట్రైన్లో వేసుకుని వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో మీరు కూడా చూసేయండి.
ان لوگوں کو لگ رھا تھا ٹرین رکے گی نہیں،ٹرین رکی،مسافروں نے طبیعت صاف کرکے ان کو دھویا اور پولیس نے بائیک بھی ضبط کرلی۔لیکن ان ذلیل لوگوں کو گرفتار کیا جانا چاھئے تھا۔ pic.twitter.com/sGCbbjugVL
— صحرانورد (@Aadiiroy2) June 25, 2024
తాజావార్తలు
-
Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!
-
Andhra Pradesh: వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థలో కీలక మార్పులు.. కొత్త కార్పొరేషన్ ఏర్పాటు..
-
TN Elections 2026: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. తెలుగు ఓటర్లే లక్ష్యంగా సీఎం చంద్రబాబు రోడ్ షో!
-
Kangana: అవకాశాలు తగ్గినప్పుడే జీవితం విలువ తెలుస్తుంది..
-
YS Jagan Pulivendula Tour: నేడు పులివెందులకు వైఎస్ జగన్..
ట్రెండింగ్
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?