US-Iran War: ట్రంప్కు ఉన్న దమ్ము, ఎవరికీ లేదు: అమెరికా రక్షణ మంత్రి..
- త్వరగా ఒక ఒప్పందానికి రావాలి..
- ఇరాన్ను హెచ్చరిస్తూ యూఎస్ రక్షణ మంత్రి వ్యాఖ్యలు..
- లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: ఇరాన్ ఒక ఒప్పందాన్ని అంగీకరించాలని లేదా యుద్ధం తీవ్రమవుతుందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మంగళవారం హెచ్చరించారు. ఈ యుద్ధాన్ని ముగించడానికి ఒక ఒప్పందానికి రావానే విషయంలో అమెరికా దృఢంగా ఉందని ఆయన అన్నారు. యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే మొజ్తబా ఖమేనీ నేతృత్వంలోని కొత్త ఇరాన్ ప్రభుత్వం పాతదాని కంటే వివేకవంతంగా ఉండాలని అన్నారు. రాబోయే రోజుల్లో దాడులు తీవ్రంగా ఉంటాయని, ఇరాన్పై మరింత ఒత్తిడి పెరుగుతుందని హెగ్సెత్ అన్నారు. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబు లేదని, ఇరాన్ నేవీ మొత్తం నిర్వీర్యం అయిందని, ఇరాన్తో డీల్ కుదుర్చుకునే ఉద్దేశం ట్రంప్కు ఉందని అన్నారు. ఇరాన్ డీల్కు ఒప్పుకోకపోతే దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. ట్రంప్కు ఉన్న దమ్ము.. ఎవరికీ లేదు హెగ్సేత్ అన్నారు.
Read Also: ACB court: అవినీతి అధికారికి ఏడేళ్లు జైలు, రూ.2 లక్షల జరిమానా
Also Read
- Iran-US Ceasefire: గుడ్న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
- Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
- US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
- India-Iran Trade: ఇరాన్తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
ఇరాన్ సైనిక సామర్థ్యాలు గణనీయంగా బలహీనమయ్యాయని, దీని వల్ల నైతిక స్థైర్యం పడిపోయిందని ఆయన అన్నారు. మాకు మరిన్ని అవకాశాలు ఉన్నాయని, ఇరాక్కు తక్కువగా ఉన్నాయని, కేవలం ఒక నెలలో అమెరికా సంఘర్షణ గమనాన్ని మార్చేసిందని ఆయన చెప్పారు. ఇరాన్ సైనిక నాయకత్వంలో ఒత్తిడి పెరుగుతోందని, ఉన్నత స్థాయిలో అసంతృప్తి పేరుకుపోయిందని నిఘా వర్గాలు చెబుతున్నాయని యూఎస్ రక్షణ మంత్రి అన్నారు.
ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్ని ప్రారంభించాయి. తొలి రోజే ప్రస్తుత ఇరాన్ సుప్రీంలీడర్గా ఉన్న మొజ్తబా ఖమేనీ తండ్రి, అప్పటి సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని చంపేశారు. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య యుద్ధం తీవ్రమైంది. ఇరాన్ ప్రతీకార దాడుల్లో భాగంగా గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. మరోవైపు, చమురు రవాణాకు కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ దిగ్బంధించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడింది.
తాజావార్తలు
-
Best Mileage Bikes: లీటర్కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
-
TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్పై స్పీకర్ కీలక చర్య
-
Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
-
Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!