US – Iran Tensions: మళ్లీ భగ్గుమన్న అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతలు.. మూడు ఆయిల్ ట్యాంకర్లపై అగ్రరాజ్యం దాడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US – Iran Tensions: అమెరికా – ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్కు చెందిన మూడు చమురు ట్యాంకర్లపై అమెరికా సైన్యం దాడి చేసినట్లు తాజాగా వెల్లడించింది. అమెరికా యుద్ధ నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది. నెల రోజుల పాటు ఇరువైపులా ప్రశాంత వాతావరణం కొనసాగిన తర్వాత గత వారం మళ్లీ కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ పరిణామాల మధ్య అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా నౌకాదళానికి చెందిన నౌకలపై ఇరాన్ దాడి చేస్తే.. ఆ దేశానికి చెందిన చమురు ట్యాంకర్లను ధ్వంసం చేసి సముద్రంలో ముంచేస్తామని హెచ్చరించారు.
ఇరాన్ చమురు ట్యాంకర్లే టార్గెట్
ఇరాన్కు చెందిన మూడు చమురు ట్యాంకర్లు ఓ రహస్య నెట్వర్క్లో భాగంగా ఉన్నాయని అమెరికా సైన్యం ఆరోపించింది. ఈ నెట్వర్క్ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్తో పాటు ప్రాంతంలోని ఆ దేశ మద్దతు ఉన్న సాయుధ గ్రూపులకు నిధులు సమకూర్చడంలో సహాయపడుతోందని పేర్కొంది. మరోవైపు ఇరాన్ ప్రభుత్వ టీవీ కథనం ప్రకారం.. ఖార్గ్ ద్వీపానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఓ చమురు ట్యాంకర్పై నాలుగు అమెరికా క్షిపణులు దాడి చేశాయని పేర్కొంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. ఇరాన్ భారీగా చమురు ఎగుమతులు చేసే ప్రధాన టెర్మినల్ ఖార్గ్ ద్వీపంలోనే ఉంది. యుద్ధ సమయంలో ఈ ప్రాంతం పలుమార్లు దాడులకు గురైంది. మార్చిలోనూ ఖార్గ్ ద్వీపంలోని సైనిక స్థావరాలపై అమెరికా దాడులు చేసినట్లు సమాచారం. తాజా దాడులతో హోర్ముజ్ జలసంధి చుట్టూ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దాడితో అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు మళ్లీ పెరిగాయని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న అమెరికా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, డిస్ట్రాయర్పై ఇరాన్ నుంచి పలుమార్లు దాడులు జరిగినట్లు అమెరికా సైన్యం ఆరోపించింది. అయితే వాటిని తమ బలగాలు విజయవంతంగా ఎదుర్కొన్నాయని, అమెరికా సైనికులకు ఎలాంటి గాయాలు కాలేదని అగ్రరాజ్యం వెల్లడించింది.
Also Read
- Miss World 2026 Winner: జోహెయిర్రీ మోలా సొంతం చేసుకున్న మిస్ వరల్డ్ కిరీటం.. టాప్ 40లో నికితా పొర్వాల్
- Putin: యుద్ధంలో కీలక పరిణామం.. 3 రోజులు ఉక్రెయిన్పై దాడులు చేయబోమన్న పుతిన్
- BLA Attack: పాక్ సైన్యంపై BLA మెరుపుదాడి.. 25 మంది సైనికులు హతం..
- Moscow: యుద్ధం ముగింపు దిశగా అడుగులు.. మాస్కోలో ట్రంప్ దూతలు చర్చలు.. పుతిన్ మెత్తబడతారా?
వెస్ట్ బ్యాంక్లో సెటిలర్లపై అమెరికా రాయబారి తీవ్ర వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా.. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ సెటిలర్ల హింసపై ఇజ్రాయెల్లోని అమెరికా రాయబారి మైక్ హకబీ మరోసారి తీవ్రంగా స్పందించారు. సెటిలర్ల చర్యలను ‘టెర్రర్ యాక్ట్’గా అభివర్ణించారు. తుర్ముస్ అయ్యా గ్రామంలో పాలస్తీనా-అమెరికన్ నివాసితులతో మాట్లాడిన హకబీ.. ఇతరుల భూమిని బలవంతంగా ఆక్రమించడం, వాహనాలకు నిప్పుపెట్టడం, మసీదులను తగలబెట్టడం, ఇళ్లలోకి చొరబడి విధ్వంసం చేయడం వంటి చర్యలు కేవలం నేరాలు మాత్రమే కాదని.. అవి ఉగ్రవాద చర్యల స్థాయికి చేరుకుంటాయని వ్యాఖ్యానించారు. గత నెల కుస్రా ప్రాంతంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపైనా హకబీ తీవ్రంగా స్పందించారు. అక్కడ సెటిలర్లు పలు ఇళ్లను చుట్టుముట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైతం కొందరు ఆందోళనకారుల చర్యలను ఖండించగా.. ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ వాటిని అవమానకరమైన చర్యలుగా పేర్కొంది.
యెమెన్లో హూతీ తిరుగుబాటుదారుల ఆరోపణలు
మరోవైపు ఇరాన్ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులు యెమెన్ ప్రభుత్వ బలగాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. పశ్చిమ, నైరుతి యెమెన్లో జరిగిన దాడుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు తెలిపారు. హొదెయ్దా, తైజ్ ప్రావిన్సుల్లో శుక్రవారం జరిగిన దాడుల్లో ఈ మరణాలు సంభవించినట్లు హూతీ వర్గాలు వెల్లడించాయి. హొదెయ్దాలోని ఓ ఇంటిపై జరిగిన దాడిలో ఓ తండ్రి, ఆయన కుమార్తె మరణించినట్లు పేర్కొన్నాయి. తైజ్లో జరిగిన కాల్పుల్లో మరో వ్యక్తి చనిపోగా.. మరొకరు గాయపడినట్లు తెలిపాయి. అయితే యెమెన్ ప్రభుత్వానికి చెందిన మీడియా సంస్థ మాత్రం హొదెయ్దాలోని హైస్ జిల్లాను యెమెన్ సైన్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ పోరులో పలువురు హూతీ తిరుగుబాటుదారులు మరణించడం లేదా గాయపడటం జరిగిందని పేర్కొంది. ఇదే సమయంలో దక్షిణ లెబనాన్, తూర్పు బెకా లోయలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ముగ్గురు మరణించగా.. దాదాపు రెండు డజన్ల మంది గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైపు పంపిన డ్రోన్ను అడ్డుకున్న అనంతరం హిజ్బుల్లా స్థావరాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ ఘటనలో తమ సైనికులకు ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొంది. అమెరికా మధ్యవర్తిత్వంతో జూన్లో లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య ఓ ఒప్పందానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ.. దక్షిణ లెబనాన్లో పరిస్థితులు పెద్దగా మెరుగుపడలేదు. హిజ్బుల్లా ఆయుధాలను విడిచిపెట్టడానికి ప్రతిగా ఇజ్రాయెల్ బలగాలు ఆక్రమించిన ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లాలన్న ప్రతిపాదనపై ఇప్పటివరకు పెద్దగా పురోగతి కనిపించలేదని చెబుతున్నారు.
చర్చలకు తిరిగి రావాలని అమెరికా – ఇరాన్కు ఈజిప్ట్ పిలుపు
తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మరోసారి చర్చల బాట పట్టాలని ఈజిప్ట్ కోరింది. ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బదర్ అబ్దెలత్తీ.. బహ్రెయిన్, ఒమన్ విదేశాంగ మంత్రులతో ఫోన్లో మాట్లాడారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించడమే ప్రాధాన్యత కావాలని ఆయన సూచించారు. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు సురక్షితంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో.. అక్కడ నౌకల రాకపోకలు తగ్గడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య తాజా పరిణామాలతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్పై సస్పెన్స్.. అసలు ఏం జరుగుతోంది?
-
US – Iran Tensions: మళ్లీ భగ్గుమన్న అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతలు.. మూడు ఆయిల్ ట్యాంకర్లపై అగ్రరాజ్యం దాడి!
-
Sudivya Kumar Sonu: ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత.. జేఎంఎం తీవ్ర దిగ్భ్రాంతి
-
Maremmma Pre Release Event: అబ్బాయి సినిమా చూసి ఫిదా అయిన రవితేజ.. ‘మారెమ్మ’పై మాస్ మహారాజా ప్రశంసలు
-
Miss World 2026 Winner: జోహెయిర్రీ మోలా సొంతం చేసుకున్న మిస్ వరల్డ్ కిరీటం.. టాప్ 40లో నికితా పొర్వాల్
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!