US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
- అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం..
- ట్రంప్ అనుమతి కోసం ఎదురుచూపులు..
- అంతర్జాతీయ మీడియా నివేదిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఘర్షణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు దేశాలు కూడా తాత్కాలిక శాంతి ఒప్పందానికి సిద్ధమైనట్లు ఆక్సియోస్ నివేదిక వెల్లడించింది. అయితే, ఈ ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుది ఆమోదం తెలపాల్సి ఉంది. ఇంకా రెండు రోజులు ఆలోచించాలని అనుకుంటున్నట్లు ట్రంప్, మధ్యవర్తులుగా ఉన్న దేశాలకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. అమెరికా, ఇరాన్ ప్రతినిధులు 60 రోజుల తాత్కాలిక అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) రూపొందించేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఈ ఒప్పందం ప్రకారం, ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణ పొడగించడంతో పాటు ఇరాన్ అణు కార్యక్రమాలపై చర్చలు తిరిగి ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఒప్పందంలోని చాలా అంశాలపై రెండు దేశాలు అంగీకరిచాయని, ఇరాన్ నాయకత్వం కూడా దీనికి ఆమోదం తెలపిందని, అయితే ట్రంప్ ఆమోదం కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Germany plane crash: ఇంటి పైకప్పుపై కూలిన విమానం.. ఇద్దరు మృతి
- Saudi-Yemen: పశ్చిమాసియాలో మరో యుద్ధం.. సౌదీపై యెమెన్ క్షిపణి దాడులు
- Saudi Arabia: ఎర్ర సముద్రంలో రాజుకున్న మంటలు.. సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై క్షిపణుల వర్షం!
- Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ఈ డీల్లో భాగంగా ప్రపంచ చమురు రవాణాకు కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని పూర్తిగా స్వేచ్ఛాయుత నౌకాయానానికి అనుమతించడం, 30 రోజుల్లో సముద్రంలో సీమైన్లను ఇరాన్ తొలగించాల్సి ఉంటుంది. వాణిజ్య నౌకలకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదని, దీనికి ప్రతిగా అమెరికా తన నౌకాదళ ఆంక్షల్ని క్రమంగా సడలించుకుంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ 60 రోజులు ఇరాన్ తన అణు ఆయుధాల అభివృద్ధి కొనసాగించమని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. శుద్ధి చేసిన యురేనియంపై భవిష్యత్తులో రెండు దేశాలు చర్చించనున్నాయి. విదేశీ బ్యాంకుల్లో ఫ్రీజ్ చేసిన ఇరాన్ నిధులు, ఆర్థిక ఆంక్షల సడలింపు వంటివి చర్చల్లో భాగం కానున్నాయి.
అయితే, ఈ ఒప్పందం తాత్కాలికమే అని, పూర్తిస్థాయి డీల్ కాదని అధికారులు చెబుతున్నారు. ఒక పక్క శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అలాగే ఉన్నాయి. అమెరికా ఇరాన్ డ్రోన్ కేంద్రాలపై దాడులు చేసింది. ఇరాన్ కువైట్లోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని అటాక్ చేసింది.
తాజావార్తలు
-
Nara Rohith: వరుస ఫ్లాపుల తర్వాత నారా రోహిత్ స్ట్రాంగ్ కమ్బ్యాక్.. లైనప్ చూస్తే షాకే!
-
Ferty9: అంతర్జాతీయ పరిశోధనల్లో విశేష గుర్తింపు.. ప్రపంచ వేదికపై తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా ‘ఫెర్టీ9’!
-
Vivo V40e 5G: స్టైలిష్ డిజైన్, 50MP సోనీ కెమెరా, 80W ఫాస్ట్ ఛార్జింగ్తో.. వివో V40e 5G ప్రీమియం స్మార్ట్ఫోన్
-
OTT Trending Movie: టాప్ ట్రెండింగ్ లో100 కోట్ల సినిమా.. ఓటీటీలో ఇరగదీస్తున్న యాక్షన్ కామెడీ..
-
Peddi Sudarshan Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు..
ట్రెండింగ్
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!