US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
- అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం..
- ట్రంప్ అనుమతి కోసం ఎదురుచూపులు..
- అంతర్జాతీయ మీడియా నివేదిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఘర్షణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు దేశాలు కూడా తాత్కాలిక శాంతి ఒప్పందానికి సిద్ధమైనట్లు ఆక్సియోస్ నివేదిక వెల్లడించింది. అయితే, ఈ ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుది ఆమోదం తెలపాల్సి ఉంది. ఇంకా రెండు రోజులు ఆలోచించాలని అనుకుంటున్నట్లు ట్రంప్, మధ్యవర్తులుగా ఉన్న దేశాలకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. అమెరికా, ఇరాన్ ప్రతినిధులు 60 రోజుల తాత్కాలిక అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) రూపొందించేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఈ ఒప్పందం ప్రకారం, ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణ పొడగించడంతో పాటు ఇరాన్ అణు కార్యక్రమాలపై చర్చలు తిరిగి ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఒప్పందంలోని చాలా అంశాలపై రెండు దేశాలు అంగీకరిచాయని, ఇరాన్ నాయకత్వం కూడా దీనికి ఆమోదం తెలపిందని, అయితే ట్రంప్ ఆమోదం కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
- Trump: ఒప్పందం చేసుకోకపోతే మిషన్ పూర్తవుతుంది.. ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్కు వార్నింగ్
- Trump: ఫుట్బాల్ ప్లేయర్ నిషేధంపై ట్రంప్ సమీక్ష.. దుమారం రేపుతోన్న అధ్యక్షుడి తీరు
- Microsoft LayOff: మైక్రోసాఫ్ట్లో భారీ ఉద్యోగాల కోత.. AI కోసం 4,800 మందికి ఉద్వాసన..
ఈ డీల్లో భాగంగా ప్రపంచ చమురు రవాణాకు కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని పూర్తిగా స్వేచ్ఛాయుత నౌకాయానానికి అనుమతించడం, 30 రోజుల్లో సముద్రంలో సీమైన్లను ఇరాన్ తొలగించాల్సి ఉంటుంది. వాణిజ్య నౌకలకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదని, దీనికి ప్రతిగా అమెరికా తన నౌకాదళ ఆంక్షల్ని క్రమంగా సడలించుకుంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ 60 రోజులు ఇరాన్ తన అణు ఆయుధాల అభివృద్ధి కొనసాగించమని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. శుద్ధి చేసిన యురేనియంపై భవిష్యత్తులో రెండు దేశాలు చర్చించనున్నాయి. విదేశీ బ్యాంకుల్లో ఫ్రీజ్ చేసిన ఇరాన్ నిధులు, ఆర్థిక ఆంక్షల సడలింపు వంటివి చర్చల్లో భాగం కానున్నాయి.
అయితే, ఈ ఒప్పందం తాత్కాలికమే అని, పూర్తిస్థాయి డీల్ కాదని అధికారులు చెబుతున్నారు. ఒక పక్క శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అలాగే ఉన్నాయి. అమెరికా ఇరాన్ డ్రోన్ కేంద్రాలపై దాడులు చేసింది. ఇరాన్ కువైట్లోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని అటాక్ చేసింది.
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!