China Covid: చైనాపై కొవిడ్ పంజా.. ఏప్రిల్ నాటికి గరిష్ఠ స్థాయి కేసులు
US Institute Predicts China Could See Over A Million COVID Deaths Through 2023: కొంతకాలంగా చైనాలో కొవిడ్ కేసులు గణనీయంగా పెరగడంతో.. అక్కడి ప్రభుత్వం జీకో కొవిడ్ ఆంక్షల్ని అమలు చేసింది. అయితే.. ఆ ఆంక్షలు మరీ కఠినంగా ఉండటం, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో.. వాటిని సడలించాల్సిందిగా కోరుతూ పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో మరో దారి లేక.. జీరో కొవిడ్ ఆంక్షల్ని ప్రభుత్వం సడలించింది. ఈ దెబ్బకు అక్కడ మళ్లీ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని ఇలాగే వదిలేస్తే.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నాటికి చైనాలో కొవిడ్ కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్’ (ఐహెచ్ఎంఈ) అంచనా వేసింది. అలాగే మరణాల సంఖ్య 3 లక్షలకు పైనే నమోదు కావొచ్చని.. 2023 చివరి నాటికి ఆ మరణాల సంఖ్య 10 లక్షలకు పైన చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆ సంస్థ పేర్కొంది.
IRCTC Contractor Fined: రూ. 5 ఎక్కువగా వసూలు చేశాడు.. ఒక లక్ష ఫైన్ కట్టాడు
Also Read
- Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
- Donald Trump: ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ను టార్గెట్ చేసిన ట్రంప్..!
- Bangladesh: బంగ్లాదేశ్ ఎయిర్ఫోర్స్లో తాలిబాన్లు.. బయటపడ్డ పాకిస్తాన్ మూలాలు..
- Urban Heat Crisis: వరల్డ్ బ్యాంకు హెచ్చరిక.. 2050 నాటికి 700 శాతం పేదలు వేడికి బలి
ఈ ఐహెచ్ఎంఈ డైరెక్టర్ క్రిస్ట్ఫర్ ముర్రే చైనా కొవిడ్ పరిస్థితి గురించి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ కల్లా చైనా జనాభాలో మూడింట ఒకవంతు ప్రజలు ఈ కరోనా వైరస్ బారిన పడతారని కుండబద్దలు కొట్టాడు. అంతేకాదు.. కేవలం జీరో కొవిడ్ విధానంతో ఈ వైరస్ వ్యాప్తిని అదుపు చేయలేరని, ఇతర వేరియెంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ అధికంగా వ్యాప్తి చెందుతోందని ఆయన పేర్కొన్నాడు. మరోవైపు.. చైనాలో 16.4 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని, దీంతో కొవిడ్ పర్యవసనాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్లో గ్లోబల్ హెల్త్ సీనియర్ ప్రతినిధి యాన్జోంగ్ హువాంగ్ బాంబ్ పేల్చాడు. అలాగే.. చైనాలో 80 ఏళ్లు, ఆపైబడిన వారు 8 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలున్నారని, వారికి ఇప్పటిదాకా టీకాలు వేయలేదని, వారిపై కూడా ఈ కొవిడ్ ప్రభావం చూపడం ఖాయమని చెప్పాడు. అటు.. చైనా జాతీయ కమిషన్ ఈ కరోనా పరిస్థితిని ఎదుర్కోవడం కోసం టీకాల ప్రక్రియను ముమ్మరం చేశామని.. వెంటిలేటర్లు, అవసరమైన మందులను కూడా నిల్వ ఉంచామని స్పష్టం చేసింది.
West Bengal Strange Lights: ఆకాశంలో వింత.. స్పేస్షిప్ అంటూ జనాలు గిలిగింత
తాజావార్తలు
-
Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
-
KTR: రంగుల సినిమా చూపించి రేవంత్ అధికారంలోకి వచ్చాడు
-
Vivo T5x 5G: భారీగా తగ్గిన వివో T5x 5G ధర.. 50MP Sony కెమెరా + 120Hz డిస్ప్లే + 7200mAh
-
Donald Trump: ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ను టార్గెట్ చేసిన ట్రంప్..!
-
Top 3 Scooters: 51 లక్షల యూనిట్ల అమ్మకాలు.. జనం ఎగబడి కొంటున్న టాప్ 3 స్కూటర్లు ఇవే.. ధరలు, మైలేజ్ & ఫీచర్లు
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!