China Covid: చైనాపై కొవిడ్ పంజా.. ఏప్రిల్ నాటికి గరిష్ఠ స్థాయి కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Institute Predicts China Could See Over A Million COVID Deaths Through 2023: కొంతకాలంగా చైనాలో కొవిడ్ కేసులు గణనీయంగా పెరగడంతో.. అక్కడి ప్రభుత్వం జీకో కొవిడ్ ఆంక్షల్ని అమలు చేసింది. అయితే.. ఆ ఆంక్షలు మరీ కఠినంగా ఉండటం, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో.. వాటిని సడలించాల్సిందిగా కోరుతూ పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో మరో దారి లేక.. జీరో కొవిడ్ ఆంక్షల్ని ప్రభుత్వం సడలించింది. ఈ దెబ్బకు అక్కడ మళ్లీ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని ఇలాగే వదిలేస్తే.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నాటికి చైనాలో కొవిడ్ కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్’ (ఐహెచ్ఎంఈ) అంచనా వేసింది. అలాగే మరణాల సంఖ్య 3 లక్షలకు పైనే నమోదు కావొచ్చని.. 2023 చివరి నాటికి ఆ మరణాల సంఖ్య 10 లక్షలకు పైన చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆ సంస్థ పేర్కొంది.
IRCTC Contractor Fined: రూ. 5 ఎక్కువగా వసూలు చేశాడు.. ఒక లక్ష ఫైన్ కట్టాడు
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
ఈ ఐహెచ్ఎంఈ డైరెక్టర్ క్రిస్ట్ఫర్ ముర్రే చైనా కొవిడ్ పరిస్థితి గురించి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ కల్లా చైనా జనాభాలో మూడింట ఒకవంతు ప్రజలు ఈ కరోనా వైరస్ బారిన పడతారని కుండబద్దలు కొట్టాడు. అంతేకాదు.. కేవలం జీరో కొవిడ్ విధానంతో ఈ వైరస్ వ్యాప్తిని అదుపు చేయలేరని, ఇతర వేరియెంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ అధికంగా వ్యాప్తి చెందుతోందని ఆయన పేర్కొన్నాడు. మరోవైపు.. చైనాలో 16.4 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని, దీంతో కొవిడ్ పర్యవసనాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్లో గ్లోబల్ హెల్త్ సీనియర్ ప్రతినిధి యాన్జోంగ్ హువాంగ్ బాంబ్ పేల్చాడు. అలాగే.. చైనాలో 80 ఏళ్లు, ఆపైబడిన వారు 8 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలున్నారని, వారికి ఇప్పటిదాకా టీకాలు వేయలేదని, వారిపై కూడా ఈ కొవిడ్ ప్రభావం చూపడం ఖాయమని చెప్పాడు. అటు.. చైనా జాతీయ కమిషన్ ఈ కరోనా పరిస్థితిని ఎదుర్కోవడం కోసం టీకాల ప్రక్రియను ముమ్మరం చేశామని.. వెంటిలేటర్లు, అవసరమైన మందులను కూడా నిల్వ ఉంచామని స్పష్టం చేసింది.
West Bengal Strange Lights: ఆకాశంలో వింత.. స్పేస్షిప్ అంటూ జనాలు గిలిగింత
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..