US-India: భారత్పై దాడి చేసిన పాకిస్థాన్ ఉగ్ర గ్రూపులపై అమెరికా సంస్థ సంచలన రిపోర్ట్
- భారత్ను లక్ష్యం చేసుకున్న ఉగ్ర సంస్థలకు పాక్లో ఆశ్రయం
- పాకిస్థాన్ ఉగ్ర గ్రూపులపై అమెరికా సంస్థ సంచలన రిపోర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ను లక్ష్యం చేసుకున్న ఉగ్రవాద గ్రూపులపై అమెరికా సంస్థ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ సంచలన రిపోర్ట్ బయట పెట్టింది. భారత్ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద గ్రూపులకు పాకిస్థాన్ ఇప్పటికీ ఆశ్రయం కల్పిస్తోందని నివేదికలో హెచ్చరించింది. 2008 ముంబై దాడులకు బాధ్యత వహించిన లష్కర్-ఎ-తైబా, 2001లో భారత పార్లమెంటుపై జరిగిన దాడితో సంబంధం ఉన్న జైష్-ఎ-మొహమ్మద్ సంస్థలు ప్రస్తుతం పాకిస్థాన్ భూభాగం నుంచే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని తన నివేదికలో పేర్కొంది.
భారత్, కాశ్మీర్ను లక్ష్యంగా చేసుకున్న గ్రూపులతో సహా పలు రకాల ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ తన గడ్డపై ఆశ్రయం కల్పిస్తూనే ఉందని వెల్లడించింది. సంవత్సరాల తరబడి సైనిక చర్యలు, విధానపరమైన చర్యలు చేపట్టినప్పటికీ ఉగ్రవాద గ్రూపులు పాకిస్థాన్ గడ్డపై తమ కార్యకలాపాలను యథేచ్చగా కొనసాగిస్తున్నాయని నివేదికలో స్పష్టం చేసింది.
Also Read
- Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!
- Economic D-Day: ఇరాన్కు ఆర్థిక సాయం చేస్తే భారీ మూల్యం తప్పదు.. దేశాలకు ట్రంప్ ‘ఎకనామిక్ డీ-డే’ హెచ్చరిక
- Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
- Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
ఇక నివేదిక ప్రకారం.. 2021లో ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రవాదం పుంజుకోవడంతో పాటు పాకిస్థాన్ తీవ్రవాదం వల్ల అత్యధికంగా ప్రభావితమైన దేశంగా నిలిచిందని తెలిపింది. అంతేకాకుండా చాలా వరకు ఉగ్రవాద గ్రూపులు ఇస్లామిస్ట్ తీవ్రవాద భావజాలంతో ప్రేరేపించబడ్డాయని యూఎస్ కాంగ్రెస్ పరిశోధన విభాగం తేల్చింది. ఈ బృందాలు ఐదు వర్గాలుగా విభజించబడ్డాయని… ప్రపంచ దృష్టి, ఆఫ్ఘనిస్థాన్ దృష్టి, భారతదేశం, కాశ్మీర్ దృష్టి, దేశీయ దృష్టి, మతతత్వ సంస్థలు అని పేర్కొంది.
అల్ఖైదా ప్రధాన భాగం తీవ్రంగా బలహీనపడినప్పటికీ పాకిస్థాన్లో కార్యకలాపాలు కొనసాగిస్తూ.. ఇతర తీవ్రవాద సంస్థలతో పొత్తులు కొనసాగిస్తోందని తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ ప్రాంతీయ అనుబంధ సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్-ఖొరాసన్ ప్రావిన్స్లో అంచనా ప్రకారం ‘‘4,000-6,000 మంది యోధులు’’ ఉన్నారని.. ఇది ఇతర తీవ్రవాద గ్రూపుల మాజీ సభ్యులను చేర్చుకుని ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ అంతటా కార్యకలాపాలు నిర్వహిస్తోందని నివేదికలో పేర్కొంది.
దేశీయంగా తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ను (పాకిస్థాన్లో పనిచేస్తున్న అత్యంత ప్రాణాంతకమైన ఉగ్రవాద సంస్థ)గా అభివర్ణించింది. దీనిలో సుమారు 2,500 నుంచి 5,000 మంది యోధులు ఉన్నారని.. పాకిస్థాన్ రాజ్యాన్ని కూలదోసి షరియా చట్టాన్ని విధించడమే దీని లక్ష్యమని తెలిపింది.
కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్..
కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (CRS) అనేది అమెరికా కాంగ్రెస్కు (పార్లమెంట్) చట్టపరమైన, విధానపరమైన విశ్లేషణలను అందించే ఒక స్వతంత్ర సంస్థ. నిష్పక్షపాత పరిశోధనా సంస్థ. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్లో భాగమైన ఈ సంస్థ.. సభ్యులకు గోప్యమైన.. అధికారిక సమాచారాన్ని 24/7 అందిస్తుంది. ఇది ప్రధానంగా అమెరికా జాతీయ విధానాలు, విదేశీ వ్యవహారాలు, చట్టాలపై పరిశోధనలు చేస్తుంది. నిష్పక్షపాతతంగా.. రాజకీయాలకు అతీతంగా.. ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా.. కేవలం వాస్తవాలను, విశ్లేషణను మాత్రమే అందిస్తుంది.
తాజావార్తలు
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
-
Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
-
Ongole: లిఫ్ట్లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!