Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Us Crs Report Pakistan Terror Groups Targeting India Lashkar Jaish Analysis

US-India: భారత్‌పై దాడి చేసిన పాకిస్థాన్ ఉగ్ర గ్రూపులపై అమెరికా సంస్థ సంచలన రిపోర్ట్

Published Date :March 28, 2026 , 8:29 pm
By Suresh Maddala
  • భారత్‌ను లక్ష్యం చేసుకున్న ఉగ్ర సంస్థలకు పాక్‌లో ఆశ్రయం
  • పాకిస్థాన్ ఉగ్ర గ్రూపులపై అమెరికా సంస్థ సంచలన రిపోర్ట్
US-India: భారత్‌పై దాడి చేసిన పాకిస్థాన్ ఉగ్ర గ్రూపులపై అమెరికా సంస్థ సంచలన రిపోర్ట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారత్‌ను లక్ష్యం చేసుకున్న ఉగ్రవాద గ్రూపులపై అమెరికా సంస్థ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ సంచలన రిపోర్ట్ బయట పెట్టింది. భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద గ్రూపులకు పాకిస్థాన్ ఇప్పటికీ ఆశ్రయం కల్పిస్తోందని నివేదికలో హెచ్చరించింది. 2008 ముంబై దాడులకు బాధ్యత వహించిన లష్కర్-ఎ-తైబా, 2001లో భారత పార్లమెంటుపై జరిగిన దాడితో సంబంధం ఉన్న జైష్-ఎ-మొహమ్మద్ సంస్థలు ప్రస్తుతం పాకిస్థాన్ భూభాగం నుంచే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని తన నివేదికలో పేర్కొంది.

భారత్, కాశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకున్న గ్రూపులతో సహా పలు రకాల ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ తన గడ్డపై ఆశ్రయం కల్పిస్తూనే ఉందని వెల్లడించింది. సంవత్సరాల తరబడి సైనిక చర్యలు, విధానపరమైన చర్యలు చేపట్టినప్పటికీ ఉగ్రవాద గ్రూపులు పాకిస్థాన్ గడ్డపై తమ కార్యకలాపాలను యథేచ్చగా కొనసాగిస్తున్నాయని నివేదికలో స్పష్టం చేసింది.

ఇక నివేదిక ప్రకారం.. 2021లో ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రవాదం పుంజుకోవడంతో పాటు పాకిస్థాన్ తీవ్రవాదం వల్ల అత్యధికంగా ప్రభావితమైన దేశంగా నిలిచిందని తెలిపింది. అంతేకాకుండా చాలా వరకు ఉగ్రవాద గ్రూపులు ఇస్లామిస్ట్ తీవ్రవాద భావజాలంతో ప్రేరేపించబడ్డాయని యూఎస్ కాంగ్రెస్ పరిశోధన విభాగం తేల్చింది. ఈ బృందాలు ఐదు వర్గాలుగా విభజించబడ్డాయని… ప్రపంచ దృష్టి, ఆఫ్ఘనిస్థాన్ దృష్టి, భారతదేశం, కాశ్మీర్ దృష్టి, దేశీయ దృష్టి, మతతత్వ సంస్థలు అని పేర్కొంది.

అల్‌ఖైదా ప్రధాన భాగం తీవ్రంగా బలహీనపడినప్పటికీ పాకిస్థాన్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తూ.. ఇతర తీవ్రవాద సంస్థలతో పొత్తులు కొనసాగిస్తోందని తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ ప్రాంతీయ అనుబంధ సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్-ఖొరాసన్ ప్రావిన్స్‌లో అంచనా ప్రకారం ‘‘4,000-6,000 మంది యోధులు’’ ఉన్నారని.. ఇది ఇతర తీవ్రవాద గ్రూపుల మాజీ సభ్యులను చేర్చుకుని ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ అంతటా కార్యకలాపాలు నిర్వహిస్తోందని నివేదికలో పేర్కొంది.

దేశీయంగా తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్‌ను (పాకిస్థాన్‌లో పనిచేస్తున్న అత్యంత ప్రాణాంతకమైన ఉగ్రవాద సంస్థ)గా అభివర్ణించింది. దీనిలో సుమారు 2,500 నుంచి 5,000 మంది యోధులు ఉన్నారని.. పాకిస్థాన్ రాజ్యాన్ని కూలదోసి షరియా చట్టాన్ని విధించడమే దీని లక్ష్యమని తెలిపింది.

కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్..
కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (CRS) అనేది అమెరికా కాంగ్రెస్‌కు (పార్లమెంట్) చట్టపరమైన, విధానపరమైన విశ్లేషణలను అందించే ఒక స్వతంత్ర సంస్థ. నిష్పక్షపాత పరిశోధనా సంస్థ. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌లో భాగమైన ఈ సంస్థ.. సభ్యులకు గోప్యమైన.. అధికారిక సమాచారాన్ని 24/7 అందిస్తుంది. ఇది ప్రధానంగా అమెరికా జాతీయ విధానాలు, విదేశీ వ్యవహారాలు, చట్టాలపై పరిశోధనలు చేస్తుంది. నిష్పక్షపాతతంగా.. రాజకీయాలకు అతీతంగా.. ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా.. కేవలం వాస్తవాలను, విశ్లేషణను మాత్రమే అందిస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking international news
  • global terrorism analysis
  • India security threat
  • india- pakistan relations
  • ISIS Khorasan

తాజావార్తలు

  • Tollywood : తిమ్మరాజు పల్లి, పాపం ప్రతాప్, బ్యాడ్ బాయ్ కార్తిక్.. ప్రీమియర్ రివ్యూ

  • Shreyas Iyer: ఫాలోయింగ్ పెరుగుతోంది, ఇక మనల్ని ఎవడ్రా ఆపేది.. శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Book Cover Trick: మీ పిల్లల పుస్తకాలకు నిమిషాల్లో ఇలా అట్టలు వేయండి.. కత్తెర, టేప్ అవసరం కూడా లేదు..!

  • Women Reservation Law: అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ

  • Mahela Jayawardene: “హార్దిక్ ఒక్కడే బాధ్యుడు కాదు”.. ముంబై వరుస ఓటములపై కోచ్ సంచలన వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • Avakaya Pickle Recipe: ముక్క మెత్తబడకుండా.. రంగు మారకుండా.. పర్ఫెక్ట్ కొలతలతో ‘ఆవకాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions