Twitter: ట్విట్టర్కు షాక్.. యాడ్స్ నిలిపివేసిన ప్రముఖ సంస్థలు..
United Airlines joins Pfizer, Audi in move to suspend Twitter ads amid Musk takeover: ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్ మస్క్ కు షాకులు తప్పలా లేవు. ఇప్పటికే ఉద్యోగుల తొలగింపుపై కొంత మంది అమెరికన్ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఖర్చులను తగ్గించుకునేందుకు ఎలాన్ మస్క్ సగం మందికి ఉద్వాసనలు పలికేందుకు సిద్ధం అయ్యారు. ఈ ప్రక్రియ శుక్రవారం నుంచే ప్రారంభం అయింది. మరోవైపు ట్విట్టర్ టేకోవర్ తరువాత సీఈఓ పరాగ్ అగర్వాల్ తో పాటు మరో భారతీయ ఉద్యోగి, పాలసీ చీఫ్ విజయగద్దెలతో పాటు మరికొంత మంది కీలక ఉద్యోగులను తొలగించారు. ట్విట్టర్ బోర్డును రద్దు చేసి ఏకైక డైరెక్టర్ గా ఉన్నారు.
ఇదిలా ఉంటే మస్క్ నిర్ణయాలపై పలు అంతర్జాతీయ కంపెనీలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ట్విట్టర్ హస్తగతం తరువాత ‘‘ వాక్ స్వాతంత్య్రం’’ కల్పిస్తానని మస్క్ హామీ ఇవ్వడంతో ట్విట్టర్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లో గత వారం నుంచి ద్వేషపూరిత ప్రసంగం, తప్పుడు సమాచారం పెరిగింది. దీంతో ట్విట్టర్ లో యాడ్స్ ఇస్తున్న కొన్ని కంపెనీలు ఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే కొన్ని మల్టీనేషనల్, ప్రముఖ కంపెనీలు ట్విట్టర్ లో యాడ్స్ నిలిపివేశాయి. తాజాగా అమెరికాలోని ప్రధాన ఎయిర్లైన్ ఆపరేటర్ అయిన యునైటెడ్ ఎయిర్లైన్స్ ట్విట్టర్ లో తన ప్రకటనలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు ఇదే విధంగా కొన్ని కంపెనీలు ట్విట్టర్ లో ప్రకటనలు నిలిపివేశాయి.
Also Read
- Zohran Mamdani-King Charles: కోహినూర్ వజ్రం భారత్కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్కు మమ్దానీ విజ్ఞప్తి!
- Trump: హార్ముజ్పై ట్రంప్ కఠిన నిర్ణయం.. ప్రపంచ దేశాలు ఆందోళన
- Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
Read Also: Twitter: నా ఉద్యోగం పోయింది.. భారతీయుడి ట్వీట్ వైరల్
ట్విట్టర్ లో ప్రకటనలు నిలిపివేసిన ప్రముఖ కంపెనీలో ప్రపంచ ఆటోమేకర్ దిగ్గజం ఆడితో పాటు ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఫైజర్, ఆహార తయారీదారు జనరల్ మిల్స్ ఉన్నాయి. ఈ జాబితాలో యునైటెడ్ ఎయిర్లైన్స్ కూడా చేరింది. మరికొన్ని కంపెనీలు ట్విట్టర్ వ్యవహారంపై వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం యాంటీ డిఫమేషన్ లీగ్, ట్విట్టర్ తో సంబంధాలను నిలిపివేయాలని పలు కంపెనీలకు సూచించింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కు అపరిమిత అవకాశాలు కల్పిస్తే ద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు సమాచారానికి దారి తీస్తుందని చాలా మంది భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే గతంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో యూఎస్ క్యాపిటల్ పై దాడికి కారణం అయిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ట్విట్టర్ నిషేధించింది. అయితే ట్విట్టర్ ను టేకోవర్ చేసిన మస్క్ మళ్లీ డొనాల్డ్ ట్రంపును ట్విట్టర్ లోకి ఆహ్వానిస్తానని బహిరంగంగా ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పలు కంపెనీలు యాడ్స్ ఇవ్వడానికి జంకుతున్నాయి. ట్విట్టర్ ఆదాయంలో 90 శాతం ప్రకటన ద్వారానే వస్తోంది. డిజిటల్ మార్కెటింగ్ కోసం ట్విట్టర్ ను ఆశ్రయిస్తున్నారు. అయితే డిజిటల్ ప్రకటనల్లో గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్ దాదాపుగా 75 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2022లో ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ యాడ్స్ లో కేవలం 0.9 శాతం ట్విట్టర్ కు వస్తున్నాయి. 21.4 శాతం ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా ఉంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: నాకు టార్గెట్ అంటూ ఏమీ ఉండదు, అదొక్కటే తెలుసు.. అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Hardik Pandya: మా స్టేడియంలో వారి పేరు మార్మోగుతోంది.. ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది!
-
Zohran Mamdani-King Charles: కోహినూర్ వజ్రం భారత్కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్కు మమ్దానీ విజ్ఞప్తి!
-
Rule Change: మే 1 నుండి న్యూ రూల్స్.. ఎల్పీజీ ధరల నుండి క్రెడిట్ కార్డుల వరకు ఏవేం మారనున్నాయంటే?
-
Kitchen Tips: వేసవిలో పప్పు త్వరగా పాడవుతుందా..? ఇలా చేస్తే ఉదయం వండినా రాత్రి వరకు ఫ్రెష్గా..!
ట్రెండింగ్
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!