Iran War: అమెరికా ఒత్తిడికి ఇరాన్ దిగిరాకపోవడంతో మళ్లీ దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీజ్ఫైర్ ఉన్నప్పటికీ, యూఎస్ మళ్లీ ఇరాన్పై విరుచుకుపడేందుకు ప్లాన్ చేస్తోంది. దీంతో మరోసారి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగొచ్చు. యూఎస్ సెంట్రల్ కమాండ్(CENTCOM) తాజాగా మూడు కీలక సైనిక ఆప్షన్లను సిద్ధం చేసినట్లు యాక్సియోస్ నివేదించింది. ఈ ప్రణాళికల్ని ట్రంప్ ముందు పెట్టారు.
ఇందులో మొదటిది, ఇరాన్పై తక్కువ సమయంలో తీవ్రమైన దాడులు చేపట్టడం. కీలక మౌలిక సదుపాయాల్ని దెబ్బతీయడం. దీని ద్వారా ఇరాన్ను చర్చల వైపు తీసుకురావడం అమెరికా ప్లాన్గా తెలుస్తోంది. ప్రజల మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే అది ‘‘జెనీవా కన్వెన్షన్’’ ప్రకారం యుద్ధ నేరంగా పరిగణించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Also: Bengal Exit Poll: అంతుచిక్కని బెంగాల్ ఓటర్ నాడి.. ఎగ్జిట్ పోల్స్పై ప్రముఖ సంస్థ మౌనం..
రెండోది హార్ముజ్ జలసంధిపై పూర్తిగా నియంత్రణ సాధించింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకంగా ఉన్న ఈ ఇరుకైన సముద్ర మార్గం యుద్ధంలో కీలకంగా మారింది. ఈ మార్గాన్ని వాణిజ్య నౌకాయానానికి తిరిగి తెరవడం. అయితే, ఈ ఆపరేషన్కు ల్యాండ్ ఆర్మీ సపోర్ట్ కూడా కావాల్సి వస్తుంది. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం జరుగుతుంది.
మూడో ఆప్షన్ ఇరాన్ అణు నిల్వల్ని సంపాదించేందుకు ఆపరేషన్ నిర్వహించడం. దీనికి స్పెషల్ ఫోర్సెస్ అవసరం అవుతాయి. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అమెరికా ముప్పుగా భావిస్తోంది. అయితే, తమ అణు కార్యక్రమాలు శాంతియుత ప్రయోజనాల కోసమని ఇరాన్ చెబుతోంది.
జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్, జనరల్ డాన్ కెయిన్ ఈ ప్రతిపాదనలపై ట్రంప్తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. సెంట్కామ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ ఈ కొత్త ప్రణాళికల గురించి ట్రంప్కు వివరించనున్నారు. ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధానికి ముందు కూపర్ ఇలాగే ట్రంప్కు బ్రీఫింగ్ ఇచ్చారు.
