ఇరాన్తో యుద్ధం ముగిసిందని వైట్హౌస్ ప్రకటించింది. ఇరాన్తో యుద్ధం ఆపేసినట్లు అమెరికా కాంగ్రెస్కు తెలిపింది. వార్ పవర్స్ యాక్ట్ ప్రకారం విధించిన 60 రోజుల గడువు ముగియడంతో ఈ ప్రకటన చేసింది. పశ్చిమాసియాలో అమెరికా దళాలు ఉన్నప్పటికీ యుద్ధం నిలిపివేసినట్లు వెల్లడించింది. యుద్ధం కొనసాగించాలంటే అమెరికా కాంగ్రెస్ అనుమతి తప్పనిసిరి.. ఈ గడువు మే 1న ముగిసింది. దీంతో ట్రంప్ సందేశాన్ని అమెరికా కాంగ్రెస్కు వైట్హౌస్ పేర్కొంది. ఏప్రిల్ 7న ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది.
అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తలపై ట్రంప్ భిన్న ప్రకటనలు చేశారు. ఇరాన్తో వైషమ్యాలు ముగిశాయని అమెరికా కాంగ్రెస్కు ట్రంప్ తెలిపారు. అయితే యుద్ధం కొనసాగింపుపై తన అధికారాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. యుద్ధంపై 60 రోజుల్లోగా కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలని చెప్పడం చట్ట విరుద్ధమని.. 60 రోజుల అనుమతి వాదనపై ప్రతిపక్ష డెమోక్రాట్లు దేశభక్తులేకాదని ట్రంప్ ధ్వజమెత్తారు.
ఏప్రిల్లో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటి నుంచి దాడులు జరగలేదని.. అయినా ఇరాన్తో ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని.. ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వం అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు. ఆయుధాల నిల్వలపై మా దగ్గర గతంలో లేనంతగా బాంబులు, క్షిపణులు ఉన్నాయని వెల్లడించారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా మాకు భారీ స్థాయిలో ఆయుధ సంపత్తి ఉంది. అవసరమైతే మా ఆయుధ సంప్తి ఎప్పుడైనా ఉపయోగించగలం.
ప్రస్తుతం మేం పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కంటే ప్రస్తుతం రెట్టింపు ఆయుధ నిల్వలు ఉన్నాయి. దాడులు ఆపినంత మాత్రాన.. యుద్ధం ముగిసినట్లు కాదు.
అమెరికా యుద్ధనౌకలు సముద్ర దిగ్బంధం కొనసాగిస్తున్నాం.’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే వైట్హౌస్లో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ ఒక కొత్త ప్రతిపాదనను పంపిందని.. అయితే దానితో తాను సంతోషంగా లేనని చెప్పారు. ‘‘వారు ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు.. కానీ నేను దానితో సంతృప్తిగా లేను. ఏం జరుగుతుందో చూద్దాం.’’ అని అన్నారు. ఇరాన్ కచ్చితంగా కొన్ని చర్యలు తీసుకుందని.. అయితే చివరికి ఏదైనా ఒప్పందానికి రాగలదో లేదో తనకు కచ్చితంగా తెలియదని పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వం తీవ్రంగా విచ్ఛిన్నమైందన్నారు. అన్ని వర్గాలు ఏదో ఒక రకమైన ఒప్పందాన్ని కోరుకుంటున్నాయని అంగీకరించినప్పటికీ.. ఈ విభజన చర్చల్లో ఇబ్బందులను కలిగిస్తోందని ట్రంప్ అన్నారు.
