Pakistan: పాక్లో బీఎల్ఏ వీరంగం.. రైలు హైజాక్.. 100 మందికి పైగా పాక్ సైనికుల బందీ..
- పాకిస్తాన్లో బీఎల్ఏ యోధుల వీరంగం..
- జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్..
- 100కి పైగా పాక్ ఆర్మీ సైనికుల కిడ్నాప్..
- ఆపరేషన్ చేపడితే చంపేస్తామని బీఎల్ఏ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) వీరంగం సృష్టిస్తోంది. బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వీరు, ఏకంగా ‘‘జాఫర్ ఎక్స్ప్రెస్’’ రైలును హైజాక్ చేయడం సంచలనంగా మారింది. బలూచిస్తా్న్లోని బోలాన్ జిల్లాలో బీఎల్ఏ దాడి చేసింది. రైలుని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు బీఎల్ఏ ప్రకటించింది. ఈ ట్రైన్ బలూచ్ రాజధాని క్వెట్టా నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వాలోని పెషావర్కి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.
Read Also: Hyderabad : గుడిలో శివ పార్వతల విగ్రహాలు ఎత్తుకెళ్లిన అక్కాచెల్లెల్లు.. ఎందుకిలా చేశారంటే?
Also Read
- Internet Crisis: ఇంటర్నెట్కు హోర్ముజ్ సెగలు.. భారత్కు ముప్పు తప్పదా?
- Trump China Visit: డ్రాగన్ గడ్డపై అడుగు పెట్టబోతున్న ట్రంప్ .. బీజింగ్ వేదికగా ఏం జరగబోతుంది?
- Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
- Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
బోలాన్ లోని టన్నెల్ -8ని దాటుతుండగా ఎటాక్ జరిగింది. రైలులో మొత్తం 700 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, రైలులో ప్రయాణిస్తున్న 100కి పైగా పాకిస్తానీ జవాన్లను బీఎల్ఏ తమ బందీలుగా చేసుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి జీయంద్ బలోచ్ ప్రకటించారు. పాక్ బలగాలు ఏదైనా ఆపరేషన్ ప్రారంభిస్తే, తాము ప్రయాణికులందరిని చంపేస్తామని బీఎల్ఏ హెచ్చరించింది. ఈ హైజాక్ ఆపరేషన్ని బీఎల్ఏ ఆత్మాహుతి దళం మజీద్ బ్రిగేడ్ నిర్వహించింది.
Read Also: Pakistan: బలూచిస్తాన్లో ‘‘జాఫర్ ఎక్స్ప్రెస్’’ రైలు హైజాక్ చేసిన బీఎల్ఏ..
మరోవైపు, పాకిస్తాన్ దళాలు ఈ క్రైసిస్ని పూర్తి చేసేందుకు ఆపరేషన్ చేస్తున్నాయి. రైలు ఉన్న ప్రాంతాన్ని పాక్ సైన్యం చుటుముట్టాయి. బలూచ్ ఆర్మీకి, పాక్ ఆర్మీకి కాల్పులు జరుగుతున్నాయి. పాకిస్తానీ బలగాలు ఎయిర్ అటాక్స్, డ్రోన్ అటాక్స్ చేస్తున్నాయి. ఇప్పటికే, 6 మంది పాకిస్తాన్ జవాన్లను చంపేసినట్లు బీఎల్ఏ ప్రకటించింది. ఎయిర్ అటాక్స్ ఆపకుంటే మరో గంటలో బందీలను చంపేస్తామని చెప్పింది. ముఖ్యంగా పాకిస్తాన్ పంజాబీ ప్రయాణికులు, పాక్ ఆర్మీకి చెందిన వారిని బీఎల్ఏ బందీగా చేసుకున్నట్లు సమాచారం. బలూచ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రయాణికుల్ని విడిచిపెట్టినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Internet Crisis: ఇంటర్నెట్కు హోర్ముజ్ సెగలు.. భారత్కు ముప్పు తప్పదా?
-
Yogibabu : సత్య – యోగి బాబు నవ్వుల బాంబ్..’రంగబలి’ డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ!
-
Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
-
Nara Rohit: కొత్త సినిమా మొదలెట్టిన నారా రోహిత్
-
Trump China Visit: డ్రాగన్ గడ్డపై అడుగు పెట్టబోతున్న ట్రంప్ .. బీజింగ్ వేదికగా ఏం జరగబోతుంది?
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?