Pakistan: పాక్లో బీఎల్ఏ వీరంగం.. రైలు హైజాక్.. 100 మందికి పైగా పాక్ సైనికుల బందీ..
- పాకిస్తాన్లో బీఎల్ఏ యోధుల వీరంగం..
- జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్..
- 100కి పైగా పాక్ ఆర్మీ సైనికుల కిడ్నాప్..
- ఆపరేషన్ చేపడితే చంపేస్తామని బీఎల్ఏ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) వీరంగం సృష్టిస్తోంది. బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వీరు, ఏకంగా ‘‘జాఫర్ ఎక్స్ప్రెస్’’ రైలును హైజాక్ చేయడం సంచలనంగా మారింది. బలూచిస్తా్న్లోని బోలాన్ జిల్లాలో బీఎల్ఏ దాడి చేసింది. రైలుని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు బీఎల్ఏ ప్రకటించింది. ఈ ట్రైన్ బలూచ్ రాజధాని క్వెట్టా నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వాలోని పెషావర్కి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.
Read Also: Hyderabad : గుడిలో శివ పార్వతల విగ్రహాలు ఎత్తుకెళ్లిన అక్కాచెల్లెల్లు.. ఎందుకిలా చేశారంటే?
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
బోలాన్ లోని టన్నెల్ -8ని దాటుతుండగా ఎటాక్ జరిగింది. రైలులో మొత్తం 700 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, రైలులో ప్రయాణిస్తున్న 100కి పైగా పాకిస్తానీ జవాన్లను బీఎల్ఏ తమ బందీలుగా చేసుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి జీయంద్ బలోచ్ ప్రకటించారు. పాక్ బలగాలు ఏదైనా ఆపరేషన్ ప్రారంభిస్తే, తాము ప్రయాణికులందరిని చంపేస్తామని బీఎల్ఏ హెచ్చరించింది. ఈ హైజాక్ ఆపరేషన్ని బీఎల్ఏ ఆత్మాహుతి దళం మజీద్ బ్రిగేడ్ నిర్వహించింది.
Read Also: Pakistan: బలూచిస్తాన్లో ‘‘జాఫర్ ఎక్స్ప్రెస్’’ రైలు హైజాక్ చేసిన బీఎల్ఏ..
మరోవైపు, పాకిస్తాన్ దళాలు ఈ క్రైసిస్ని పూర్తి చేసేందుకు ఆపరేషన్ చేస్తున్నాయి. రైలు ఉన్న ప్రాంతాన్ని పాక్ సైన్యం చుటుముట్టాయి. బలూచ్ ఆర్మీకి, పాక్ ఆర్మీకి కాల్పులు జరుగుతున్నాయి. పాకిస్తానీ బలగాలు ఎయిర్ అటాక్స్, డ్రోన్ అటాక్స్ చేస్తున్నాయి. ఇప్పటికే, 6 మంది పాకిస్తాన్ జవాన్లను చంపేసినట్లు బీఎల్ఏ ప్రకటించింది. ఎయిర్ అటాక్స్ ఆపకుంటే మరో గంటలో బందీలను చంపేస్తామని చెప్పింది. ముఖ్యంగా పాకిస్తాన్ పంజాబీ ప్రయాణికులు, పాక్ ఆర్మీకి చెందిన వారిని బీఎల్ఏ బందీగా చేసుకున్నట్లు సమాచారం. బలూచ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రయాణికుల్ని విడిచిపెట్టినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!