Indonesia: ఇండోనేషియాలో విపత్తు.. నేటితో ప్రకృతి బీభత్సానికి 18 ఏళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunami in Indonesia: డిసెంబరు 26, 2004 రాత్రి, 9.1-9.3 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం ప్రపంచం ఇప్పటివరకు చూసిన అతిపెద్ద సునామీలలో ఒకటి. 30 మీటర్ల ఎత్తులో ఉన్న భారీ అలలు ఎగిసిపడడంతో ఇండోనేషియాలో తెల్లవారుజామున పుట్టిన ఆవిపత్తు ఆ దేశంతో పాటు మరికొన్ని దేశాల ప్రజలను చీకట్లోకి నెట్టేసింది. అప్పట్లో సమర్థమంతమైన వార్నింగ్ సిస్టమ్స్ లేకపోవడంతో ఏం జరుగుతుందో తెలిసేలోపే మర్చిపోలేని విషాదాన్ని మిగిల్చింది. అదే బాక్సింగ్ డే సునామీ/ఇండియన్ ఓపెన్ సునామీ. నేటితో ఈ విషాదానికి 18 ఏళ్లు. ప్రపంచమంతా ఇంకా క్రిస్మస్ సంబరాల్లో ఉండగా అకస్మాత్తుగా వచ్చిన సునామీ లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఈ విపత్తు 14 దేశాలపై ప్రభావం చూపింది. 2,27,000 మందికిపైగా చనిపోయినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇండోనేషియాలోని సుమిత్రకు పశ్చిమ తీరాన 250 కిలోమీటర్ల దూరంలో 30 మీటర్ల లోతులో పుట్టిన భూకంపం ఫలితమే ఈ విధ్వంసం.

Also Read
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ఇండియా టెక్టోనిక్ ప్లేట్లలో కదలికలతో ఈ భూకంపం పుట్టింది. అప్పుడు పుట్టిన ఎనర్జీ హిరోషిమాపై అమెరికా వేసిన ఆటమ్ బాంబ్ కంటే 23వేల రెట్లు ఎక్కువట. 100 అడుగుల ఎత్తుకు ఎగసిపడిన ఈ అలలు గంటల వ్యవధిలో తూర్పు ఆఫ్రికా తీరం వరకు చేరుకున్నాయి. ఆ అలలు 8.67 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాయట. రిక్టర్ స్కేలుపై 9.1-9.3గా నమోదైన ఆ భూకంపం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ ఇదే అత్యంత ప్రమాదకరమైన సునామీ. అత్యధికంగా ఇండోనేషియాలో దాదాపు 2,27,000 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారుగా.. శ్రీలంకలో 35,322, మన దేశంలో 16,269, థాయ్లాండ్లో 8212 మంది ఈ సునామీకి బలయ్యారు. సోమాలియా, మాల్దీవ్స్, మలేషియా, మయన్మార్, టాంజానియా, బంగ్లాదేశ్, సీషెల్స్, సౌతాఫ్రికా, యెమెన్, కెన్యా దేశాల్లో కూడా ప్రాణనష్టం నమోదైంది. రూ.82.5 వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. 2004లో ఆ విపత్తును కళ్లారా చూసిన వాళ్లకు ప్రశాంతంగా ఆహ్లాదాన్ని పంచే సముద్రాన్ని చూస్తుంటే ఇప్పటికీ ఆ విషాద ఛాయలు వెంటాడుతున్నాయి.

1880లలో భారతదేశాన్ని తాకిన చివరి పెద్ద సునామీ గురించి పెద్దగా తెలియదు. 1945లో పశ్చిమ తీరాన్ని తాకిన సునామీ కూడా పేలవంగా నమోదు చేయబడిందని భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శైలేష్ నాయక్ తెలిపారు. అధికారిక లెక్కల ప్రకారం, భారతదేశంలో 10,136 మంది మరణించారు, అత్యధిక మరణాలు తమిళనాడు నుండి నమోదయ్యాయి. అయితే, అనధికారిక అంచనాల ప్రకారం వాస్తవ సంఖ్య 18,000 మందికి పైగా ఉండవచ్చన్నారు. భారతదేశంలో రెండవ అత్యంత ప్రభావిత ప్రాంతం అండమాన్, నికోబార్ దీవులు, అధికారిక మరణాల సంఖ్య 1,300కి చేరుకుంది, 5,500 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. దాని వల్ల పర్యావరణం కూడా దెబ్బతింటుందని పరిశోధనలో వెల్లడైందని తెలిపారు. దేశంలోని ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం, అండమాద్ దీవులలోని బారెన్ 1, భూకంప కార్యకలాపాల ఫలితంగా డిసెంబర్ 30న విస్ఫోటనం చెందింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు.
Droupadi Murmu: తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ ఇదే..
తాజావార్తలు
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
-
Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
-
New Oppo: టెక్ లవర్స్ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
-
TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!