Sudan Crisis: సూడాన్ సంక్షోభం.. రంజాన్ సందర్భంగా మూడు రోజులు కాల్పుల విరమణ
Sudan Crisis: సైన్యం, పారామిలిటీరీ మధ్య ఘర్షణతో ఆఫ్రికా దేశం సూడాన్ అట్టుడుకుతోంది. ఈ రెండు దళాలకు చెందిన నేతల మధ్య విభేదాలు ఈ సంక్షోభానికి కారణం అయ్యాయి. ఆర్మీ చీఫ్ అబ్దేల్ ఫత్తా అల్-బుర్హాన్, పారామిలిటరీ కమాండర్ జనరల్ మొహమ్మద్ హమ్దాన్ దగాలో మధ్య తీవ్ర విభేదాలు, ఈ రెండు భద్రతా బలగాల మధ్య సూడాన్ దేశం రావణకాష్టంగా మారింది. ముఖ్యంగా రాజధాని ఖార్టూమ్ నగరంలో రెండు దళాల పోరు తారాస్థాయికి చేరింది. దీంతో ఇప్పటివరకు ఆ దేశంలో 350 మందికి పైగా మరణించారు.
ఇదిలా ఉంటు ముస్లిం దేశం అయిన సుడాన్, రంజాన్ పండగ సందర్భంగా కాల్పుల 72 గంటల పాటు కాల్పుల విమరణ ప్రకటించినట్లు పారామిలిటరీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈద్ ఉత్-ఫితర్ సందర్భంగా పౌరులను ఖాళీ చేయించేందుకు హ్యుమానిటీ కారిడార్ తెరవడానికి, కుటుంబాలను కలుసుకోవడానికి అవకాశం ఇచ్చారు.
Also Read
- Karoline Leavitt: వైట్హౌస్కు దూరం కాబోతున్న ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లీవిట్.. కారణమిదే!
- Iran-US Talks: నేడు ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య కీలక చర్చలు.. సర్వత్రా ఉత్కంఠ
- Benjamin Netanyahu: ప్రొస్టేట్ క్యాన్సర్ను జయించిన నెతన్యాహూ..
- Malacca Strait: షాకింగ్..! హార్మూజ్ తర్వాత మలక్కా జలసంధి.. ఇరాన్ పన్నుల దారిలో మరో ముస్లిం దేశం..!
Read Also: Somu Veerraju: బీజేపీతో టీడీపీ కలుస్తుందా? అచ్చెన్నాయుడు ఏం చెబుతారు..?
ప్రజాస్వామ్య పునరుద్ధణ కోసం పారామిలిటరీని, సైన్యంలో కలిపే ప్రతిపాదనపై ఈ ఇద్దరు నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో సూడాన్ లో మరోసారి ప్రజాస్వామ్యం వైపు వెళ్లాలనే ఆశలను దెబ్బతీసింది. ఇటీవల యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కాల్పుల విరమణకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ ఘర్షణను అణిచివేసేందుకు సైనిక పరిష్కారం తప్ప వేరే మార్గం లేదని ఆర్మీ చీఫ్ బుర్హాన్ అన్నారు.
ఈ ఘర్షణల కారణంగా సూడాన్ లోన ఖార్టూమ్ నగరంలో పాటు ఓమ్దుర్మాన్ మరియు బహ్రీలలో ప్రజలు పారిపోయేందుకు సిద్ధం అయ్యారు. వేలాది మంది సూటికేసులు పట్టుకుని బస్ స్టేషన్ల వద్దకు చేరుకున్నారు. ఇక నగరంలో ఆస్పత్రుల్లో మందులు లేవు, సూపర్ మార్కెట్లలో సరుకులు లేవు. చాలా మంది విదేశీయులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. దాదాపు 10,000 నుండి 20,000 మంది ప్రజలు చాద్లోని సరిహద్దులోని గ్రామాలలో ఆశ్రయం పొందారని యూఎన్ శరణార్థి సంస్థ UNHCR, ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) తెలిపింది. దేశంలో నాలుగింట ఒక వంతు ఆకలితో అలమటిస్తున్నట్లు వెల్లడించింది.
తాజావార్తలు
-
Hyderabad: ఏటీఎంలో ఊపిరాడక మృతి.. ఉదయం 5:30కు లోపలికి.. గంట తర్వాత విగతజీవిగా!
-
Toxic: ‘టాక్సిక్’ లో రోమాంటిక్ సీన్స్ పై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Karoline Leavitt: వైట్హౌస్కు దూరం కాబోతున్న ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లీవిట్.. కారణమిదే!
-
Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
-
Cheapest Saree Markets: మగువలకు గుడ్ న్యూస్.. రూ.150 కే పట్టు చీరలు.. దేశంలోనే అత్యంత చౌకైన మార్కెట్లు ఇవే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!