Sri Lanka Crisis: మాజీ ప్రధాని మహిందా రాజపక్సేకు షాక్… దేశం విడిచి వెళ్లకుండా కోర్ట్ ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక దేశం రావణకాష్టంగా మారింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ద్వీప దేశం అల్లాడుతోంది. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. నిత్యావసరాల ధరలు ఘోరంగా పెరిగాయి. దీంతో ప్రజల్లో అసహనం కట్టలు తెంచుకుంది. దీంతో గత కొన్ని నెలలుగా ఆ దేశంలో ప్రజలు రోడ్డెక్కి నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అయితే తాజాగా ఈ ఘటనలు హింసాత్మకంగా మారాయి. పలువురు మరణించడంతో పాటు 200 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటిపోతున్న తరుణంలో ప్రధాని పదవికి మహీందా రాజపక్సే రాజీనామా చేశారు. ప్రధాని మహిందా రాజపక్సే తో పాటు అధ్యక్షుడు గోటబయ రాజపక్సేపై ఉన్న కోపంతో నిరసనకారులు రాజపక్సే పూర్వీకుల ఇళ్లను పూర్తిగా కాల్చివేశారు.
ఇదిలా ఉంటే హింసాత్మక ఘటనలు జరుగుతున్న క్రమంలో పోలీసులు, ఆర్మీకి విశేషాధికారాలు ఇచ్చింది ప్రభుత్వం. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారిని కనిపిస్తే కాల్చివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు నిరసనకారులు అధికార పక్షం, విపక్షం అన్న తేడా లేకుండా రాజకీయ నాయకులును ఉరికించి కొడుతున్నారు. రాజపక్సే సర్కార్ ను కనీసం గద్దె దించలేకపోతున్నారని ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాసను తరిమికొట్టారు.
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
ఇదిలా ఉంటే మాజీ ప్రధాని మహిందా రాజపక్సేకు షాక్ ఇచ్చింది శ్రీలంక కోర్ట్. దేశం విడిచి వెళ్లకుండా కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. మహిందా రాజపక్సే భద్రత కారణాలతో ఆర్మీ ఆయన్ను సేఫ్ ప్లేస్ కు తరలించింది. ఓ నేవల్ బేస్ లో మహిందా రాజపక్సే ప్రస్తుతం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే శ్రీలంకలో గోటబయ ప్రభుత్వ కాళ్ల బేరానికి వచ్చింది. వారం రోజుల్లోనే కొత్త ప్రధాని, మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తామని ప్రజలకు మాటిచ్చారు. దేశంలో అధ్యక్ష తరహా పాలన కాకుండా ప్రధాని తరహా పాలన తీసుకువస్తామని అందుకు తగ్గట్లుగానే రాజ్యాంగంలో మార్పులు చేస్తామని అన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!