Sri Lanka Crisis: మాజీ ప్రధాని మహిందా రాజపక్సేకు షాక్… అరెస్ట్ చేయాలని కోర్ట్ ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక అల్లాడిపోతోంది. ప్రజలు నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. హింసాత్మక ఘటనల నేపథ్యంలో మహిందా రాజపక్సే తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. భద్రతా కారణాల కారణంగా ఆర్మీ ఆయన్ను రహస్య ప్రాంతానికి తరలించింది. ఇదిలా ఉంటే గురువారం కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే పదవీ బాధ్యతలు చేపట్టారు. ఐదు సార్లు ప్రధానిగా చేసిన అనుభవం ఉండటంతో ఈ సంక్షోభం నుంచి శ్రీలంకను బయటపడేస్తారని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే మాజీ ప్రధాని మహిందా రాజపక్సేకు కోర్ట్ షాక్ ఇచ్చింది. ఆయన్ను అరెస్ట్ చేయాలని సీఐడీ పోలీసులను ఆదేశించింది శ్రీలంక కోర్ట్. రాజపక్సేతో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటీవల అటార్నీ సెనక పెరీరా కొలంబో మెజిస్ట్రేట్ ముందు వ్యక్తిగత ఫిర్యాదు దాఖలు చేశారు. ఇటీవల కొలంబోలో గాలే ఫేస్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సమయంలో రాజపక్సే అనుచరులు వచ్చి నిరసనకారులపై దాడులు చేశారని.. ఈ దాడుల్లో కనీసం 9 మంది మరణించారని… 200 మందికిపైగా ప్రజలు గాయపడ్డారని ఫిర్యాదు చేశారు. దీంతో కోర్ట్ మహిందా రాజపక్సేను అరెస్ట్ చేయాలని ఆదేశించింది. మాజీ ప్రధాని మహిందా రాజపక్సేతో పాటు పార్లమెంట్ సభ్యులు జన్సన్ ఫెర్నాండో, సంజీవ ఎదిరిమన్నే, సనత్ నిశాంత, మెటువా మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ సమన్ లాల్ ఫెర్నాండో, సీనియర్ పోలీస్ అధికారి దేశబంధు తెన్నకూన్, చందన విక్రమరత్నేలను తక్షణమే అరెస్ట్ చేయాలని పిటిషన్ లో డిమాండ్ చేశారు.
Also Read
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
- Netanyahu-Iran: ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
- Saudi-Houthi: పశ్చిమాసియాలో కొత్త ఘర్షణ.. సౌదీ-హౌతీ మధ్య దాడులు..పాక్ రంగంలోకి దిగుతుందా?
శ్రీలంకలో కొత్తగా రణిల్ విక్రమసింఘే బాధ్యలు చేపట్టినా… ఆందోళనలు కొనసాగుతున్నాయి. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే కూడా గద్దెదిగాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు భయంతో మాజీ ప్రధాని తన అధికారిక నివాసాసం టెంపుల్ ట్రీస్ నుంచి పారిపోయి ట్రింకోమలీలోని నౌకాదళ స్థావరంలో ఆశ్రయం పొందుతున్నాడు. దేశంలో ఈ ఏడాది మొదటి నుంచి వరసగా ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. నిత్యావసరాలు, పెట్రోల్, గ్యాస్ ధరలు వీపరీతంగా పెరిగాయి. దీంతో ప్రజలు ఎప్రిల్ 9 నుంచి రోడ్లపైకి వచ్చి నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Chiru – Bobby : చిరంజీవి – బాబీ సినిమా మాస్ సాంగ్’కి పూనకాలే!
-
Pakistani Cinema: నెట్ఫ్లిక్స్తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
-
HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
ట్రెండింగ్
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!