South Korea: దక్షిణ కొరియాలో “ఎమర్జెన్సీ” విధింపు.. నార్త్ కొరియా మద్దతుదారులే టార్గెట్..
- దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ విధింపు..
- ప్రకటించిన దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ మంగళవారం ఆ దేశంలో ‘‘ ఎమర్జెన్సీ మార్షల్ లా’’ ప్రకటించారు. బడ్జెట్ బిల్లుపై పార్లమెంట్లో వాగ్వాదం మధ్య దేశాన్ని ‘‘కమ్యూనిస్ట్ శక్తుల’’ నుంచి రక్షించడానికి ఈ చర్య అవసరమని చెప్పారు. విపక్ష పార్టీలు ఉత్తర కొరియా వైపు సానుభూతి చూపిస్తున్నాయని, ప్రభుత్వాన్ని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
‘‘ఉత్తర కొరియా కమ్యూనిస్ట్ శక్తుల నుండి ఎదురయ్యే బెదిరింపుల నుండి ఉదారవాద దక్షిణ కొరియాను రక్షించడానికి మరియు రాష్ట్ర వ్యతిరేక అంశాలను నిర్మూలించడానికి అత్యవసర మార్షల్ చట్టాన్ని ప్రకటిస్తున్నాను’’ అని యూన్ దేశాన్ని ఉద్దేశించి టీవీలో ప్రసంగించారు. ప్రజల జీవనోపాధితో సంబంధం లేకుండా ప్రతిపక్ష పార్టీ అభిశంసనలు, ప్రత్యేక దర్యాప్తులు, న్యాయం నుంచి తమ నాయకులను రక్షించడానికి ప్రతిపక్ష పార్టీలు పాలనను స్తంభింపచేస్తున్నాయని మండిపడ్డారు. “మన జాతీయ అసెంబ్లీ నేరస్థులకు స్వర్గధామంగా మారింది, ఇది న్యాయ మరియు పరిపాలనా వ్యవస్థలను స్తంభింపజేయడానికి, మన ఉదారవాద ప్రజాస్వామ్య క్రమాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని అధ్యక్షుడు అన్నారు.
Also Read
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
- Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
Read Also: Chiranjeevi: నాని హీరోగా చిరంజీవి సినిమా.. డైరెక్టర్ ఎవరంటే?
ప్రతిపక్ష సభ్యులు ‘‘మాదకద్రవ్యాల నేరాలను ఎదుర్కోవడం, ప్రజా భద్రతను నిర్వహించడం… దేశాన్ని మాదకద్రవ్యాల స్వర్గధామంగా, ప్రజల భద్రత గందరగోళ స్థితిగా మార్చడం వంటి దేశం యొక్క ప్రధాన విధులకు అవసరమైన అన్ని కీలక బడ్జెట్లను తగ్గించారు’’ అని ఆరోపించారు. వీలైనంత త్వరగా దేశ వ్యతిరేక శక్తులను అంతమొందించడం ద్వారా దేశాన్ని సాధారణ స్థితికి తీసుకువస్తానని చెప్పారు.
వచ్చే ఏడాది ప్రవేశపెట్టబోయే బడ్జెట్ బిల్లుపై యూన్కి చెందిన పీపుల్ పవర్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన డెమోక్రటిక్ పార్టీ గొడవలు కొనసాగుతున్న సమయంలో ఈ చర్య వచ్చింది. గత వారం ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటరీ కమిటీ ద్వారా గణనీయంగా తగ్గించిన బడ్జెట్ ప్రణాళికను ఆమోదించారు.
తాజావార్తలు
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!