South Korea: దక్షిణ కొరియాలో “ఎమర్జెన్సీ” విధింపు.. నార్త్ కొరియా మద్దతుదారులే టార్గెట్..
- దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ విధింపు..
- ప్రకటించిన దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ మంగళవారం ఆ దేశంలో ‘‘ ఎమర్జెన్సీ మార్షల్ లా’’ ప్రకటించారు. బడ్జెట్ బిల్లుపై పార్లమెంట్లో వాగ్వాదం మధ్య దేశాన్ని ‘‘కమ్యూనిస్ట్ శక్తుల’’ నుంచి రక్షించడానికి ఈ చర్య అవసరమని చెప్పారు. విపక్ష పార్టీలు ఉత్తర కొరియా వైపు సానుభూతి చూపిస్తున్నాయని, ప్రభుత్వాన్ని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
‘‘ఉత్తర కొరియా కమ్యూనిస్ట్ శక్తుల నుండి ఎదురయ్యే బెదిరింపుల నుండి ఉదారవాద దక్షిణ కొరియాను రక్షించడానికి మరియు రాష్ట్ర వ్యతిరేక అంశాలను నిర్మూలించడానికి అత్యవసర మార్షల్ చట్టాన్ని ప్రకటిస్తున్నాను’’ అని యూన్ దేశాన్ని ఉద్దేశించి టీవీలో ప్రసంగించారు. ప్రజల జీవనోపాధితో సంబంధం లేకుండా ప్రతిపక్ష పార్టీ అభిశంసనలు, ప్రత్యేక దర్యాప్తులు, న్యాయం నుంచి తమ నాయకులను రక్షించడానికి ప్రతిపక్ష పార్టీలు పాలనను స్తంభింపచేస్తున్నాయని మండిపడ్డారు. “మన జాతీయ అసెంబ్లీ నేరస్థులకు స్వర్గధామంగా మారింది, ఇది న్యాయ మరియు పరిపాలనా వ్యవస్థలను స్తంభింపజేయడానికి, మన ఉదారవాద ప్రజాస్వామ్య క్రమాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని అధ్యక్షుడు అన్నారు.
Also Read
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
Read Also: Chiranjeevi: నాని హీరోగా చిరంజీవి సినిమా.. డైరెక్టర్ ఎవరంటే?
ప్రతిపక్ష సభ్యులు ‘‘మాదకద్రవ్యాల నేరాలను ఎదుర్కోవడం, ప్రజా భద్రతను నిర్వహించడం… దేశాన్ని మాదకద్రవ్యాల స్వర్గధామంగా, ప్రజల భద్రత గందరగోళ స్థితిగా మార్చడం వంటి దేశం యొక్క ప్రధాన విధులకు అవసరమైన అన్ని కీలక బడ్జెట్లను తగ్గించారు’’ అని ఆరోపించారు. వీలైనంత త్వరగా దేశ వ్యతిరేక శక్తులను అంతమొందించడం ద్వారా దేశాన్ని సాధారణ స్థితికి తీసుకువస్తానని చెప్పారు.
వచ్చే ఏడాది ప్రవేశపెట్టబోయే బడ్జెట్ బిల్లుపై యూన్కి చెందిన పీపుల్ పవర్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన డెమోక్రటిక్ పార్టీ గొడవలు కొనసాగుతున్న సమయంలో ఈ చర్య వచ్చింది. గత వారం ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటరీ కమిటీ ద్వారా గణనీయంగా తగ్గించిన బడ్జెట్ ప్రణాళికను ఆమోదించారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!