South Korea: దక్షిణ కొరియాలో “ఎమర్జెన్సీ” విధింపు.. నార్త్ కొరియా మద్దతుదారులే టార్గెట్..
- దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ విధింపు..
- ప్రకటించిన దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్..
South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ మంగళవారం ఆ దేశంలో ‘‘ ఎమర్జెన్సీ మార్షల్ లా’’ ప్రకటించారు. బడ్జెట్ బిల్లుపై పార్లమెంట్లో వాగ్వాదం మధ్య దేశాన్ని ‘‘కమ్యూనిస్ట్ శక్తుల’’ నుంచి రక్షించడానికి ఈ చర్య అవసరమని చెప్పారు. విపక్ష పార్టీలు ఉత్తర కొరియా వైపు సానుభూతి చూపిస్తున్నాయని, ప్రభుత్వాన్ని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
‘‘ఉత్తర కొరియా కమ్యూనిస్ట్ శక్తుల నుండి ఎదురయ్యే బెదిరింపుల నుండి ఉదారవాద దక్షిణ కొరియాను రక్షించడానికి మరియు రాష్ట్ర వ్యతిరేక అంశాలను నిర్మూలించడానికి అత్యవసర మార్షల్ చట్టాన్ని ప్రకటిస్తున్నాను’’ అని యూన్ దేశాన్ని ఉద్దేశించి టీవీలో ప్రసంగించారు. ప్రజల జీవనోపాధితో సంబంధం లేకుండా ప్రతిపక్ష పార్టీ అభిశంసనలు, ప్రత్యేక దర్యాప్తులు, న్యాయం నుంచి తమ నాయకులను రక్షించడానికి ప్రతిపక్ష పార్టీలు పాలనను స్తంభింపచేస్తున్నాయని మండిపడ్డారు. “మన జాతీయ అసెంబ్లీ నేరస్థులకు స్వర్గధామంగా మారింది, ఇది న్యాయ మరియు పరిపాలనా వ్యవస్థలను స్తంభింపజేయడానికి, మన ఉదారవాద ప్రజాస్వామ్య క్రమాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని అధ్యక్షుడు అన్నారు.
Also Read
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
Read Also: Chiranjeevi: నాని హీరోగా చిరంజీవి సినిమా.. డైరెక్టర్ ఎవరంటే?
ప్రతిపక్ష సభ్యులు ‘‘మాదకద్రవ్యాల నేరాలను ఎదుర్కోవడం, ప్రజా భద్రతను నిర్వహించడం… దేశాన్ని మాదకద్రవ్యాల స్వర్గధామంగా, ప్రజల భద్రత గందరగోళ స్థితిగా మార్చడం వంటి దేశం యొక్క ప్రధాన విధులకు అవసరమైన అన్ని కీలక బడ్జెట్లను తగ్గించారు’’ అని ఆరోపించారు. వీలైనంత త్వరగా దేశ వ్యతిరేక శక్తులను అంతమొందించడం ద్వారా దేశాన్ని సాధారణ స్థితికి తీసుకువస్తానని చెప్పారు.
వచ్చే ఏడాది ప్రవేశపెట్టబోయే బడ్జెట్ బిల్లుపై యూన్కి చెందిన పీపుల్ పవర్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన డెమోక్రటిక్ పార్టీ గొడవలు కొనసాగుతున్న సమయంలో ఈ చర్య వచ్చింది. గత వారం ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటరీ కమిటీ ద్వారా గణనీయంగా తగ్గించిన బడ్జెట్ ప్రణాళికను ఆమోదించారు.
తాజావార్తలు
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
-
JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో