Israel-Hamas War: ఆరుగురు బందీలను తల వెనక కాల్చి చంపిన హమాస్: బెంజమిన్ నెతన్యాహూ..
- బందీలను తలలోకి కాల్చిచంపిన హమాస్..
- ఆరుగురి హత్యపై ఇజ్రాయిల్లో తీవ్ర నిరసనలు..
- తాను లొంగిపోయేది లేదన్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: గాజాలో బందీగా ఉన్న ఆరుగురు ఇజ్రాయిలీలను హమాస్ కాల్చి చంపడం యుద్ధంలో కీలక పరిణామంగా మారింది. గాజాలోని దక్షిణ ప్రాంతమైన రఫాలోని భూగర్భ సొరంగాల్లో ఈ ఆరుగురు మృతదేహాలను ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) కనుక్కున్నాయి. బందీలు చనిపోవడంపై ఇజ్రాయిల్లో తీవ్ర నిరసనలకు దారి తీశాయి. ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ లక్ష్యంగా వేలాది మంది టెల్ అవీవ్లో నిరసనలు చేశారు. బందీల విడుదల ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే, బందీల తల వెనక భాగంలో కాల్చి హమాస్ హత్య చేసిందిన నెతన్యాహూ సోమవారం చెప్పారు. ‘‘ఆ హంతకులు మా బందీలలో ఆరుగురిని కాల్చి చంపారు’’ అని అన్నారు. బందీలను అత్యంత సమీపంలో నుంచి కాల్చి చంపినట్లు ఇజ్రాయిల్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. బందీలను రక్షించలేకపోయినందుకు ఇజ్రాయిల్ ప్రధాని ప్రజల్ని క్షమాపణ కోరారు. ఐక్యత కోసం పిలుపునిచ్చారు.
Also Read
- Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
Read Also: Putin: అరెస్ట్ బెదిరింపులకు భయపడని పుతిన్.. మంగోలియాలో పర్యటన..
గతేడాది అక్టోబర్ 07 నాడు ఇజ్రాయిల్పై హమాస్ దారుణమైన దాడికి పాల్పడింది. ఈ దాడిలో 1200 మందిని ఊచకోత కోసింది. 240 మందికి పైగా ఇజ్రాయిలీ ప్రజల్ని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లింది. గతేడాది చివర్లో కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా 100 మంది వరకు బందీలను హమాస్ విడుదల చేసింది. ఒప్పందంలో భాగంగా తమ జైళ్లలో ఉన్న పలువురు పాలస్తీనియన్లను విడుదల చేసింది.
ఇదిలా ఉంటే హమాస్తో ఒప్పందం కుదుర్చుకోవడంలో ఇజ్రాయిల్ ప్రధానిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆగ్రహంతో ఉన్నారు. హమాస్ కాల్చి చంపిన ఆరుగురు బందీల్లో ఒకరు అమెరికన్ ఇజ్రాయిలీ ఉన్నారు. మరోవైపు అమెరికా, ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్న చర్చల్లో గాజా-ఈజిప్ట్ సరిహద్దులోని ఫిలడెల్ఫి కారిడార్ కీలకంగా మారింది. ఇక్కడ నుంచి వైదొలగాలని హమాస్ కోరుతుంటే, ఈ ప్రాంతంపై తమ నియంత్రణ ఉండాలని నెతన్యాహూ పట్టుబడుతున్నారు. యుద్ధ లక్ష్యాల సాధన ఫిలడెల్పీ కారిడార్ గుండా వెళుతోందని నెతన్యాహూ చెప్పారు. తాను ఒత్తిడికి లొంగేది లేదని చెప్పారు. అక్టోబర్ 7 దాడిలో బందీలుగా 251 మందిలో 97 మంది ఇంకా గాజాలోనే ఉన్నారు. వీరిలో 33 మంది మరణించినట్లు ఇజ్రాయిల్ సైన్యం చెబుతోంది.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!