Israel-Hamas War: ఆరుగురు బందీలను తల వెనక కాల్చి చంపిన హమాస్: బెంజమిన్ నెతన్యాహూ..
- బందీలను తలలోకి కాల్చిచంపిన హమాస్..
- ఆరుగురి హత్యపై ఇజ్రాయిల్లో తీవ్ర నిరసనలు..
- తాను లొంగిపోయేది లేదన్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: గాజాలో బందీగా ఉన్న ఆరుగురు ఇజ్రాయిలీలను హమాస్ కాల్చి చంపడం యుద్ధంలో కీలక పరిణామంగా మారింది. గాజాలోని దక్షిణ ప్రాంతమైన రఫాలోని భూగర్భ సొరంగాల్లో ఈ ఆరుగురు మృతదేహాలను ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) కనుక్కున్నాయి. బందీలు చనిపోవడంపై ఇజ్రాయిల్లో తీవ్ర నిరసనలకు దారి తీశాయి. ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ లక్ష్యంగా వేలాది మంది టెల్ అవీవ్లో నిరసనలు చేశారు. బందీల విడుదల ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే, బందీల తల వెనక భాగంలో కాల్చి హమాస్ హత్య చేసిందిన నెతన్యాహూ సోమవారం చెప్పారు. ‘‘ఆ హంతకులు మా బందీలలో ఆరుగురిని కాల్చి చంపారు’’ అని అన్నారు. బందీలను అత్యంత సమీపంలో నుంచి కాల్చి చంపినట్లు ఇజ్రాయిల్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. బందీలను రక్షించలేకపోయినందుకు ఇజ్రాయిల్ ప్రధాని ప్రజల్ని క్షమాపణ కోరారు. ఐక్యత కోసం పిలుపునిచ్చారు.
Also Read
- Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
- Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
Read Also: Putin: అరెస్ట్ బెదిరింపులకు భయపడని పుతిన్.. మంగోలియాలో పర్యటన..
గతేడాది అక్టోబర్ 07 నాడు ఇజ్రాయిల్పై హమాస్ దారుణమైన దాడికి పాల్పడింది. ఈ దాడిలో 1200 మందిని ఊచకోత కోసింది. 240 మందికి పైగా ఇజ్రాయిలీ ప్రజల్ని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లింది. గతేడాది చివర్లో కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా 100 మంది వరకు బందీలను హమాస్ విడుదల చేసింది. ఒప్పందంలో భాగంగా తమ జైళ్లలో ఉన్న పలువురు పాలస్తీనియన్లను విడుదల చేసింది.
ఇదిలా ఉంటే హమాస్తో ఒప్పందం కుదుర్చుకోవడంలో ఇజ్రాయిల్ ప్రధానిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆగ్రహంతో ఉన్నారు. హమాస్ కాల్చి చంపిన ఆరుగురు బందీల్లో ఒకరు అమెరికన్ ఇజ్రాయిలీ ఉన్నారు. మరోవైపు అమెరికా, ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్న చర్చల్లో గాజా-ఈజిప్ట్ సరిహద్దులోని ఫిలడెల్ఫి కారిడార్ కీలకంగా మారింది. ఇక్కడ నుంచి వైదొలగాలని హమాస్ కోరుతుంటే, ఈ ప్రాంతంపై తమ నియంత్రణ ఉండాలని నెతన్యాహూ పట్టుబడుతున్నారు. యుద్ధ లక్ష్యాల సాధన ఫిలడెల్పీ కారిడార్ గుండా వెళుతోందని నెతన్యాహూ చెప్పారు. తాను ఒత్తిడికి లొంగేది లేదని చెప్పారు. అక్టోబర్ 7 దాడిలో బందీలుగా 251 మందిలో 97 మంది ఇంకా గాజాలోనే ఉన్నారు. వీరిలో 33 మంది మరణించినట్లు ఇజ్రాయిల్ సైన్యం చెబుతోంది.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!