Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
- షకీబ్ అల్ హసన్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి
- ఇంటికి నిప్పంటించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shakib Al Hasan House Attacked: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ షకీబ్ అల్ హసన్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడి, ఇంటికి నిప్పంటించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన షకీబ్ అల్ హసన్ ఢిల్లీలో మాజీ ప్రధాని షేక్ హసీనా నిర్వహించిన మీడియా సమావేశానికి హాజరైన కొన్ని గంటల తర్వాత చోటుచేసుకుంది. దక్షిణాసియా విదేశీ ప్రతినిధుల క్లబ్ (Foreign Correspondents’ Club of South Asia) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఈ మీడియా సమావేశం జరిగింది. ఇందులో షేక్ హసీనా ప్రసంగించగా, షకీబ్ అల్ హసన్ కూడా హాజరయ్యారు.
ఇంటిపై రాళ్లతో దాడి.. నిప్పంటించే ప్రయత్నం
ది డైలీ స్టార్ నివేదిక ప్రకారం.. రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు మగురా సదర్ పోలీస్ స్టేషన్ అధికారి Md Abdullah Al Mamun తెలిపారు. కొంతమంది దుండగులు షకీబ్ అల్ హసన్ ఇంటిపై ఇటుకలు విసిరారని, కిటికీలను ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. అనంతరం ఇంటికి నిప్పంటించేందుకు కూడా ప్రయత్నించినట్లు వెల్లడించారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరనే విషయం వెంటనే తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం షకీబ్ ఇంటి వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు పేర్కొన్నారు.
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
ఘటనపై అవామీ లీగ్ స్పందన
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అవామీ లీగ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. షకీబ్ అల్ హసన్ ఇంటిపై దాడి యత్నాన్ని పార్టీ తీవ్రంగా ఖండించింది. షేక్ హసీనా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్కు షకీబ్ హాజరైన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరగడం రాజకీయంగా ఆందోళన కలిగించే అంశమని అవామీ లీగ్ పేర్కొంది. బంగ్లాదేశ్లో అవామీ లీగ్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని, ఈ ఘటన కూడా అందులో భాగమేనని పార్టీ ఆరోపించింది.
2024 నుంచి బంగ్లాదేశ్కు దూరంగా షకీబ్
2024 ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత నుంచి షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్కు దూరంగా ఉంటున్నారు. ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. రాజకీయ అశాంతి సమయంలో జరిగిన ఓ హత్య కేసులో నమోదైన ఎఫ్ఐఆర్లో మొత్తం 147 మందితో పాటు షకీబ్ పేరు కూడా ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే, చట్టపరమైన ప్రక్రియను ఎదుర్కొనేందుకు తాను బంగ్లాదేశ్కు తిరిగి రావాలని కోరుకుంటున్నానని, అయితే తన వ్యక్తిగత భద్రతపై హామీ కావాలని షకీబ్ గతంలో పేర్కొన్నారు.
అంతర్జాతీయ క్రికెట్కు ఇంకా అధికారికంగా వీడ్కోలు చెప్పలేదు
షకీబ్ అల్ హసన్ 2024 చివరి నుంచి బంగ్లాదేశ్ తరఫున క్రికెట్ ఆడలేదు. అయినప్పటికీ ఆయన అంతర్జాతీయ క్రికెట్కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించలేదు. అన్ని ఫార్మాట్లలో పూర్తిస్థాయి సిరీస్ ఆడిన తర్వాతే క్రికెట్కు వీడ్కోలు చెప్పాలని షకీబ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, 2024 ఆగస్టులో జరిగిన ఎన్నికల్లో మగురా-1 నియోజకవర్గం నుంచి అవామీ లీగ్ అభ్యర్థిగా షకీబ్ అల్ హసన్ ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయనపై ఉన్న కేసులు, భద్రతా పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్కు ఆయన తిరిగి రావడం చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!