Heavy Rains: దక్షిణ కొరియా రాజధానిలో వర్ష బీభత్సం.. దెబ్బతిన్న 2,682 భవనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains: దక్షిణ కొరియా రాజధాని సియోల్లో రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షం వరదలకు కారణమైంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది. భారీ వర్షాల కారణంగా 2,682 భవనాలు, అపార్ట్మెంట్లు జలమయం కావడంతో కనీసం 600 మంది నిరాశ్రయులయ్యారు. 20,000కు పైగా పశువులు చనిపోయాయి. చాలావరకు పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం, అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ వర్షాల వల్ల నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. సెంట్రల్ డిజాస్టర్ అండ్ సేఫ్టీ కౌంటర్మెజర్స్ హెడ్క్వార్టర్స్ ప్రకారం.. తొమ్మిది మంది మరణించగా.. 17 మంది గాయపడ్డారు. ఏడుగురు వ్యక్తులు తప్పిపోయారు. సియోల్, జియోంగ్గి, గాంగ్వాన్లో అధికంగా నష్టం జరిగింది. . జియోంగ్గిలో 85 మంది, ఇంచియాన్లో 44 మంది, గాంగ్వాన్లో తొమ్మిది మంది, సియోల్లో ఏడుగురు సహా దాదాపు 145 మందిని అధికారులు రక్షించారు.
Lanka villages: ముంపే కాదు ముహూర్తాలు ముంచుకొస్తున్నాయి.. లంక గ్రామాల్లో పెళ్లి కష్టాలు..!
Also Read
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
- Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
- Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
1,200 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి తాత్కాలికంగా సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లారు. వరదల కారణంగా దాదాపు 988 మంది తమ ఇళ్లను కోల్పోయారు. ప్రస్తుతం 1,471 మంది కమ్యూనిటీ సెంటర్లు, పాఠశాలలు, విలేజ్ హాళ్లు, వసతి గృహాలు వంటి తాత్కాలిక సౌకర్యాలలో ప్రజలు ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. కొరియా డిజాస్టర్ రిలీఫ్ అసోసియేషన్, రెడ్క్రాస్ బాధితులకు నిత్యావసర వస్తువులను అందించాయి. విపత్తు సహాయ విరాళానికి మద్దతుగా ప్రభుత్వం ప్రస్తుతం డిజాస్టర్ రిలీఫ్ అసోసియేషన్ వంటి సంబంధిత సంస్థలతో చర్చలు జరుపుతోంది. దాదాపు 67 మంది కుటుంబీకులు, బంధువుల ఇళ్లకు తరలివెళ్లారు. మొత్తం 600 మంది నిరాశ్రయులు కాగా.. అందులో సియోల్లో 230 మంది, ఇంచియాన్లో 9 మంది, జియోంగ్గిలో 361 మందికి ఆశ్రయం లేకుండా పోయింది.
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!