Russia Ukraine War: ఉక్రెయిన్ పై భీకర దాడి.. మూడు రోజుల్లో 40 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ పై భీకరదాడికి పాల్పడుతోంది. ఇటీవల వరసగా రాకెట్లతో విరుచుకుపడుతోంది. గడిచిన మూడు రోజుల్లో దాదాపుగా 40కి పైగా మంది రష్యా దాడిలో మరణించినట్లు ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 24న సైనిక చర్యగా ప్రారంభం అయిన రష్య, ఉక్రెయిన్ సంక్షోభం యుద్ధంగా మారింది. ఇటీవల రష్యా, ఉక్రెయన్ తూర్పు భాగాలు డోన్ బాస్ ప్రాంతాన్ని టార్గెట్ చేసింది. తూర్పు ప్రాంతంలోని అనేక పట్టణాలను, నగరాలపై వరసగా దాడులు చేస్తూ రష్యా తమ ఆధీనంలోకి తీసుకుంటోంది. ఇటీవల ఇది మరింతగా పెరిగింది. పాశ్చాత్య దేశాలు మాత్రం ఉక్రెయిన్ ను రష్యా పూర్తిగా స్వాధీనం చేసుకునే ప్లాన్ లో ఉందని ఆరోపిస్తున్నారు.
గురువారం రష్యా జరిపిన రాకెట్ దాడిలోొ రాజధాని కీవ్ కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న విన్నిట్సియా నగరంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు ధ్వసం అయ్యాయి. ఈ దాడిలో 23 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ దాడిలో నాలుగేళ్ల బాలిక కూడా మరనించింది. ఈ దాడిపై పాశ్చాత్య దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉక్రెయిన్ సాయుధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు విదేశీ ఆయుధ సరఫరాదారులతో సమావేశం అయ్యారనే ఆరోపణ మధ్య ఈ దాడిని జరిపింది. శుక్రవారం రష్యా దళాలు నికోలపోల్ కు ఉత్తరాన 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్నిప్రో నగరంపై దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు మరణించగా.. 15 మంది వరకు గాయపడ్డారు. రష్యా డ్నిప్రో ప్రాంతంలోని క్షిపణి విడిభాగాలు తయారు చేసే ఫ్యాక్టరీని ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.
Also Read
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
- Saudi-Houthi: ట్రంప్ మొండిచేయి.. హౌతీలతో రాజీ కోసం సౌదీ ఏం చేసిందంటే...!
Read Also: ITBP Jawan: ముగ్గురు సహచరులపై కాల్పులు.. అనంతరం తనను తాను కాల్చుకుని..
దీంతో పాటు ఖార్కివ్ ప్రాంతలోని ఈశాన్య పట్టనం చుహుయివ్ పై కూడా రష్యా దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. అయితే రష్యా రక్షణ మంత్రి సెర్గి షోయిగు మాత్రం రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై ఉక్రెయిన్ దాడిని నివారించేందుకే దాడులకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. దాదాపుగా ఆరు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం ఉక్రెయిన్ ను నాశనం చేస్తున్నాయి. ఇప్పటికే ఖార్కీవ్, సుమీ, మరియోపోల్, ఎల్వీవ్ తో పాటు రాజధాని కీవ్ యుద్ధం వల్ల నష్టపోయాయి. యుద్ధం వల్ల ఉక్రెయిన్ నుంచి వలసలు పెరిగాయి. సమీప దేశాలైన పోలాండ్, రొమేనియాలకు ప్రజలు వలసపోతున్నారు.
తాజావార్తలు
-
Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
-
OTR: వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ టిక్కెట్ కోసం ఇప్పట్నుంచే పనబాక ప్లాన్!
-
OTR: ధర్మవరం వైసీపీ నేతలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్నింగ్
-
Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
-
OTR: ఏపీలో పదే పదే రిక్రూట్మెంట్ జీవోల విషయంలో తడబాట్లు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..