Russia Ukraine War: ఉక్రెయిన్ పై భీకర దాడి.. మూడు రోజుల్లో 40 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ పై భీకరదాడికి పాల్పడుతోంది. ఇటీవల వరసగా రాకెట్లతో విరుచుకుపడుతోంది. గడిచిన మూడు రోజుల్లో దాదాపుగా 40కి పైగా మంది రష్యా దాడిలో మరణించినట్లు ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 24న సైనిక చర్యగా ప్రారంభం అయిన రష్య, ఉక్రెయిన్ సంక్షోభం యుద్ధంగా మారింది. ఇటీవల రష్యా, ఉక్రెయన్ తూర్పు భాగాలు డోన్ బాస్ ప్రాంతాన్ని టార్గెట్ చేసింది. తూర్పు ప్రాంతంలోని అనేక పట్టణాలను, నగరాలపై వరసగా దాడులు చేస్తూ రష్యా తమ ఆధీనంలోకి తీసుకుంటోంది. ఇటీవల ఇది మరింతగా పెరిగింది. పాశ్చాత్య దేశాలు మాత్రం ఉక్రెయిన్ ను రష్యా పూర్తిగా స్వాధీనం చేసుకునే ప్లాన్ లో ఉందని ఆరోపిస్తున్నారు.
గురువారం రష్యా జరిపిన రాకెట్ దాడిలోొ రాజధాని కీవ్ కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న విన్నిట్సియా నగరంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు ధ్వసం అయ్యాయి. ఈ దాడిలో 23 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ దాడిలో నాలుగేళ్ల బాలిక కూడా మరనించింది. ఈ దాడిపై పాశ్చాత్య దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉక్రెయిన్ సాయుధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు విదేశీ ఆయుధ సరఫరాదారులతో సమావేశం అయ్యారనే ఆరోపణ మధ్య ఈ దాడిని జరిపింది. శుక్రవారం రష్యా దళాలు నికోలపోల్ కు ఉత్తరాన 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్నిప్రో నగరంపై దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు మరణించగా.. 15 మంది వరకు గాయపడ్డారు. రష్యా డ్నిప్రో ప్రాంతంలోని క్షిపణి విడిభాగాలు తయారు చేసే ఫ్యాక్టరీని ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.
Also Read
- Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
- Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
Read Also: ITBP Jawan: ముగ్గురు సహచరులపై కాల్పులు.. అనంతరం తనను తాను కాల్చుకుని..
దీంతో పాటు ఖార్కివ్ ప్రాంతలోని ఈశాన్య పట్టనం చుహుయివ్ పై కూడా రష్యా దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. అయితే రష్యా రక్షణ మంత్రి సెర్గి షోయిగు మాత్రం రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై ఉక్రెయిన్ దాడిని నివారించేందుకే దాడులకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. దాదాపుగా ఆరు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం ఉక్రెయిన్ ను నాశనం చేస్తున్నాయి. ఇప్పటికే ఖార్కీవ్, సుమీ, మరియోపోల్, ఎల్వీవ్ తో పాటు రాజధాని కీవ్ యుద్ధం వల్ల నష్టపోయాయి. యుద్ధం వల్ల ఉక్రెయిన్ నుంచి వలసలు పెరిగాయి. సమీప దేశాలైన పోలాండ్, రొమేనియాలకు ప్రజలు వలసపోతున్నారు.
తాజావార్తలు
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
Purusha : భార్యల టార్చర్లు, మగాళ్ల కష్టాలు..క్షేమంగా వెళ్లి లాభంగా రండి వైబ్’లో ‘పురుష:’ ట్రైలర్!
-
Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
-
Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!