Russia Ukraine War: ఉక్రెయిన్ పై భీకర దాడి.. మూడు రోజుల్లో 40 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ పై భీకరదాడికి పాల్పడుతోంది. ఇటీవల వరసగా రాకెట్లతో విరుచుకుపడుతోంది. గడిచిన మూడు రోజుల్లో దాదాపుగా 40కి పైగా మంది రష్యా దాడిలో మరణించినట్లు ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 24న సైనిక చర్యగా ప్రారంభం అయిన రష్య, ఉక్రెయిన్ సంక్షోభం యుద్ధంగా మారింది. ఇటీవల రష్యా, ఉక్రెయన్ తూర్పు భాగాలు డోన్ బాస్ ప్రాంతాన్ని టార్గెట్ చేసింది. తూర్పు ప్రాంతంలోని అనేక పట్టణాలను, నగరాలపై వరసగా దాడులు చేస్తూ రష్యా తమ ఆధీనంలోకి తీసుకుంటోంది. ఇటీవల ఇది మరింతగా పెరిగింది. పాశ్చాత్య దేశాలు మాత్రం ఉక్రెయిన్ ను రష్యా పూర్తిగా స్వాధీనం చేసుకునే ప్లాన్ లో ఉందని ఆరోపిస్తున్నారు.
గురువారం రష్యా జరిపిన రాకెట్ దాడిలోొ రాజధాని కీవ్ కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న విన్నిట్సియా నగరంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు ధ్వసం అయ్యాయి. ఈ దాడిలో 23 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ దాడిలో నాలుగేళ్ల బాలిక కూడా మరనించింది. ఈ దాడిపై పాశ్చాత్య దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉక్రెయిన్ సాయుధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు విదేశీ ఆయుధ సరఫరాదారులతో సమావేశం అయ్యారనే ఆరోపణ మధ్య ఈ దాడిని జరిపింది. శుక్రవారం రష్యా దళాలు నికోలపోల్ కు ఉత్తరాన 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్నిప్రో నగరంపై దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు మరణించగా.. 15 మంది వరకు గాయపడ్డారు. రష్యా డ్నిప్రో ప్రాంతంలోని క్షిపణి విడిభాగాలు తయారు చేసే ఫ్యాక్టరీని ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.
Also Read
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
- H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- China: "మనం శత్రువులం కాము".. భారత్కు చైనా సందేశం..
Read Also: ITBP Jawan: ముగ్గురు సహచరులపై కాల్పులు.. అనంతరం తనను తాను కాల్చుకుని..
దీంతో పాటు ఖార్కివ్ ప్రాంతలోని ఈశాన్య పట్టనం చుహుయివ్ పై కూడా రష్యా దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. అయితే రష్యా రక్షణ మంత్రి సెర్గి షోయిగు మాత్రం రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై ఉక్రెయిన్ దాడిని నివారించేందుకే దాడులకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. దాదాపుగా ఆరు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం ఉక్రెయిన్ ను నాశనం చేస్తున్నాయి. ఇప్పటికే ఖార్కీవ్, సుమీ, మరియోపోల్, ఎల్వీవ్ తో పాటు రాజధాని కీవ్ యుద్ధం వల్ల నష్టపోయాయి. యుద్ధం వల్ల ఉక్రెయిన్ నుంచి వలసలు పెరిగాయి. సమీప దేశాలైన పోలాండ్, రొమేనియాలకు ప్రజలు వలసపోతున్నారు.
తాజావార్తలు
-
Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
-
Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
-
Ben Stokes: బెన్ స్టోక్స్ నైట్క్లబ్ వివాదం.. అసలు ఏం జరిగింది?.. భద్రతా సిబ్బందికి కుట్లు పడటానికి కారణమేంటి?
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!