NTV Telugu Site icon

Modi-Trudeau: లావోస్‌లో మోడీతో కెనడా ప్రధాని ట్రూడో చర్చలు

Pmmodi

Pmmodi

లావోస్‌లో భారత్‌-ఆసియాన్‌ శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ప్రధాని మోడీ గురువారం లావోస్ వెళ్లారు. పర్యటనలో భాగంగా ఆయా దేశాధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తున్నారు. శుక్రవారం ప్రధాని మోడీతో భేటీ అయినట్లు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో వెల్లడించారు. లావోస్‌లో జరుగుతోన్న భారత్‌-ఆసియాన్‌ శిఖరాగ్ర సదస్సులో కలిసినట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Noel Tata: టాటా ట్రస్ట్‌ల కొత్త ఛైర్మన్ నోయెల్ టాటాపై బుర్జ్ ఖలీఫా బాధ్యత!

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత్‌ హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోడీతో భేటీ అయినట్లు జస్టిన్‌ ట్రూడో వెల్లడించారు. లావోస్‌లో జరుగుతోన్న భారత్‌-ఆసియాన్‌ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మోడీతో చర్చలు జరిపారు. తదుపరి చేయాల్సిన పనులు ఉన్నాయని మెడీతో ట్రూడో చెప్పినట్లు కెనడా మీడియా వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Vijayawada: పున్నమి ఘాట్లో నారీ శక్తి విజయోత్సవ కార్యక్రమం.. హాజరైన నారా భువనేశ్వరి, బ్రాహ్మణి