వాటికన్ సిటీలో అనుకోని అతిథి.. పోప్ను కలిసిన మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రధాని మోదీ ఇటలీ పర్యటనలో ఉన్నారు. రోమ్లో జరిగే 16వ జీ20 దేశాల సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఇటలీ వెళ్లారు. ఈ సందర్భంగా వాటికన్ సిటీలోనూ మోదీ పర్యటించారు. అక్కడ పోప్ ఫ్రాన్సిస్తో మోదీ సమావేశమయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశం 20 నిమిషాల పాటు కొనసాగాల్సి ఉన్నా.. గంట పాటు కొనసాగిందని పీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో వాతావరణ మార్పులు, కాలుష్యంపై పోరాటం, దారిద్ర్య నిర్మూలన వంటి అనేక అంశాల గురించి చర్చకు వచ్చినట్లు తెలిపాయి. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.
Read Also: హుజురాబాద్లో భారీ ఓటింగ్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
- Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
కాగా ఎంతో సుహృద్భావ వాతావరణంలో పోప్తో ప్రధాని మోదీ సమావేశం జరిగిందని పీఎంవో తెలియజేసింది. త్వరలో భారత్లో పర్యటించాలని కోరుతూ పోప్ ఫ్రాన్సిస్ను మోదీ ఆహ్వానించారని తెలిపింది. మోదీ ఆహ్వానం పట్ల పోప్ ఫ్రాన్సిస్ సానుకూలంగా స్పందించారని పేర్కొంది. కాగా 1999లో అప్పటి పోప్ జాన్ పాల్-2 భారత్లో పర్యటించిన తర్వాత ఇప్పటివరకు మరే పోప్ భారత్కు రాలేదు. 1999లో భారత ప్రధానిగా వాజ్పేయి ఉన్నారు. కాగా జీ20 దేశాల సదస్సులో కోవిడ్-19తో ప్రపంచం ఎలాంటి ముప్పును ఎదుర్కొందో పలు దేశాలు చర్చించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
-
Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Telangana Jobs : మెడికల్ జాబ్స్ అలర్ట్.. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!
-
PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!