Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- పీఓకేలో దుర్మార్గాలకు పాల్పడుతున్న పాకిస్తాన్..
- గర్భిణీలు, పిల్లలని చూడకుండా హత్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(POK)లో పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీ అకృత్యాలకు పాల్పడుతోంది. హక్కుల కోసం పోరాడుతున్న అక్కడి ప్రజల్ని అణిచివేస్తోంది. నిరసనకారులపై జరిపిన కాల్పుల్లో 30 మంది మరణించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం, వందలాది మందిని పాక్ భద్రతా బలగాలు కాల్చి చంపినట్లు తెలుస్తోంది. జూన్ 5 నుంచి జూన్ 9 మధ్య పాక్ ఆర్మీ చేపట్టిన భద్రతా ఆపరేషన్లలో భారీగా అకృత్యాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్లో ఏడుగురు గర్భిణీ స్త్రీలతో సహా 26 మంది మరణించారు. మృతుల్లో 19 మంది పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
పీఓకేలో నిరసనలకు నేతృత్వం వహిస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఉద్యమంతో సంబంధం ఉన్న నిరసనకారులను అణచివేసేందుకు హత్యలు చేసినట్లు తెలుస్తోంది. నిరసనలను అణచివేయడానికి సుమారు 14,000 మంది అదనపు పాకిస్తానీ భద్రతా సిబ్బందిని PoKలోకి పాక్ ప్రభుత్వ పంపినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ వార్తలు బయటి ప్రపంచానికి తెలియకుండా ఇంటర్నెట్పై నిషేధం విధించింది.
Also Read
- China: ప్రపంచంలోనే తొలిసారి.. సముద్రంలోని వలలో రాకెట్ను దించిన చైనా!
- Iran War: ట్రంప్ను చంపుతారని భయపెట్టిన ఇజ్రాయిల్.. అందుకే మళ్లీ అమెరికా ఇరాన్పై దాడి చేసిందా?
- Sheikh Hasina: వారు నన్ను చంపేయవచ్చు, అయినా బంగ్లాదేశ్ వెళ్తా: షేక్ హసీనా
- Car Crash: నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.!
ఈ నిరసనలు పీఓకేలోని మీర్పూర్, ముజఫరాబాద్, గిల్గిత్ బాల్టిస్తాన్, దాదియాల్, రావల్కోట్, సుధ్నోటీ, తట్టపాని వంటి ప్రాంతాలకు విస్తరించాయి. నిరసనకారులు పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసిమ్ మునీర్ ఒక ఉగ్రవాది అంటూ ప్రజలు నినాదాలు చేస్తున్నారు. పాక్ ప్రభుత్వ అణిచివేతపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశం పాల్పడే అకృత్యాలకు జవాబుదారీగా చేయాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. పీఓకేలో మానవహక్కుల ఉల్లంఘనపై 30 మంది బ్రిటిష్ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుండి మరో నోటిఫికేషన్
-
AP Government: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఈ నెల 13న ప్రారంభం..
-
Surya Kumar Yadav: కళ్లముందే విరాట్, రోహిత్ అవుటైనా తగ్గని సూర్య.. 55 బంతుల్లో 117 పరుగులతో వీరవిహారం..
-
Shubman Gill: సచిన్, కోహ్లీ సరసన శుభ్మన్ గిల్.. భారత నాలుగో కెప్టెన్గా రికార్డు..
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!