Pakistan-Israel: అమెరికా-ఇరాన్ చర్చలకు వేదికగా పాకిస్తాన్ మారింది. చర్చలకు ముందు పాకిస్తాన్ ఇజ్రాయిల్ల మధ్య తీవ్ర ఘర్షణ కొనసాగుతోంది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ మీడియా ఇజ్రాయిల్ వ్యతిరేక వాతావరణాన్ని సృష్టిస్తోంది. చర్చల్ని అడ్డుకోవడానికి ఇజ్రాయిల్ అన్ని రకాల ఎత్తుగడలు వేస్తోందని పాకిస్తానీ వార్తా పత్రిక ‘డాన్’ తన ఎడిటోరియల్లో రాసుకొచ్చింది. దీనికి ముందు పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇజ్రాయిల్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also: Pakistan: మిడిల్ ఈస్ట్కు పాకిస్తాన్ యుద్ధ విమానాలు.. ఇజ్రాయిల్ భయమే కారణమా..
‘‘ఇజ్రాయిల్ను నాశనం చేయడానికి అమెరికాతో కలిసి చేసిన ఇజ్రాయిల్ ప్రయత్నం విఫలమైంది’’ అని, తన లక్ష్యాలను సాధించడంలో విఫలమైనందున ప్రభత్వాన్ని ఇజ్రాయిల్ మీడియా తీవ్రంగా విమర్శిస్తోందని డాన్ రాసింది. ఇరాన్ మిత్రపక్షమైన హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకునే నెపంతో ఇజ్రాయిల్ లెబనాన్ ప్రజలపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోందని డాన్ ఆరోపించింది. ఇరాన్ను సులభంగా ఓడించాలనే దానిపై ట్రంప్కు ఇజ్రాయిల్ తప్పుడు సమాచారం ఇచ్చిందని చెప్పింది. ప్రస్తుతం పాకిస్తాన్ చేస్తున్న శాంతి ప్రయత్నాలు విఫలం చేయడానికి ఇజ్రాయిల్ అన్ని రకాల ఎత్తుగడల్ని వేస్తోందని పాకిస్తానీ పత్రిక ఆరోపించింది. లెబనాన్ భూభాగాన్ని ఇజ్రాయిల్ ఆక్రమించుకోవాలని చూస్తోందని ఆరోపించింది.
మరో పాకిస్తానీ మీడియా జియో న్యూస్ కూడా ఇలాంటి కథనాలనే ప్రచురించింది. ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ ప్రకటనను ప్రముఖంగా ప్రస్తావించింది. ఇరాన్ యుద్ధం కోరుకోవడం లేదని, అయితే యుద్ధానికి కారణమైన దోషుల్ని వదిలిపెట్టబోమని హెచ్చరించిన విషయాన్ని ప్రస్తావించింది. మరోవైపు, పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ట్వీట్లో ఇజ్రాయిల్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్ మానవాళికి ముప్పుగా మారిందని, క్యాన్సర్ లాంటిదని అన్నారు. ఇస్లామాబాద్లో శాంతి చర్చలు జరుగుతుండగా గాజా, ఇరాన్, లెబనాన్పై దాడులు చేస్తుందని దుయ్యబట్టారు. ఈ పోస్టుపై ఇజ్రాయిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో, ఆసిఫ్ తన ట్వీట్ను తొలగించారు.
