Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
- మళ్లీ యుద్ధం మొదలవ్వబోతుందంటూ వార్తలు
- కీలక వ్యాఖ్యలు చేసిన పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-అమెరికా మధ్య ఇంకా శాంతి చర్చలు కొలిక్కి రాలేదు. తాజాగా ఇరాన్ ప్రతిపాదించిన అంశాలను అమెరికా తిరస్కరించింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ ప్రారంభం అవ్వొచ్చని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం జరుగుతుందా? ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు దిగుతాయా? అనే ప్రశ్నలకు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నా ఊహ ప్రకారం.. ఇరాన్లో మళ్లీ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం లేదు’’ అని అభిప్రాయపడ్డారు. ఇటీవల ఇజ్రాయెల్ మీడియా కథనాల్లో మళ్లీ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read
- G7 Summit: ఉక్రెయిన్కు పెరిగిన సైనిక, ఇంధన మద్దతు.. రష్యాపై ఆంక్షలకు జీ7 దేశాలు గ్రీన్సిగ్నల్
- Donald Trump: ఒప్పందం ఖరారు కాలేదు, బాంబులు వేస్తాం.. ఇరాన్కు ట్రంప్ వార్నింగ్..
- Meloni: జీ 7 సదస్సులో ధూమపానంపై ఆసక్తికర సంభాషణ.. మెలోనికి అభినందనలు
- Ilhan Omar: పచ్చి భారత వ్యతిరేకి ఎల్హాన్ ఒమర్, మరోసారి విషం చిమ్మింది..
పాకిస్థాన్కు చెందిన జియో న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ కొన్ని దేశాలపై దాడులు చేయాలని తీవ్రంగా కోరుకుంటోందని.. అయితే అమెరికా మరో దేశం కోసం యుద్ధం చేయడానికి ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు. ‘‘“నా అంచనా ప్రకారం మళ్లీ యుద్ధం జరగదు.’’ అంటూ ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్పై అమెరికా మళ్లీ దాడులు ప్రారంభించవచ్చన్న మీడియా కథనాలను కొట్టిపారేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. అమెరికా ప్రజాభిప్రాయం కూడా స్పష్టంగానే ఉందని.. ఇజ్రాయెల్ కోసం అమెరికా యుద్ధం చేయాలని ప్రజలు కోరుకోవడం లేదని.. ప్రజల మద్దతు లేకుండా యుద్ధాలు కొనసాగించడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్తో పాటు సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, కువైట్, చైనా, రష్యా వంటి దేశాలు కూడా ఇరాన్లో మళ్లీ యుద్ధం జరగకూడదని కోరుకుంటున్నాయని తెలిపారు. ప్రస్తుతం పాకిస్థాన్ ఈ వివాదంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తూ.. అమెరికా, ఇరాన్ మధ్య సందేశాలు చేరవేస్తోంది. అమెరికాతో సంబంధాలు కొనసాగిస్తూనే ముస్లిం దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కూడా కొనసాగించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఆసిఫ్ వ్యాఖ్యలు రావడానికి ముందు ఇరాన్ తాజాగా యుద్ధం ముగించేందుకు అమెరికాకు మరో కొత్త ప్రతిపాదన పంపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా చర్చలు కొనసాగేందుకు కొత్త సైనిక దాడులను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ప్రకటించారు. ట్రంప్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కీలక చర్చలు జరుగుతున్నాయని.. చివరికి అమెరికాకు మాత్రమే కాకుండా పశ్చిమాసియా దేశాలకు కూడా ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఆ ఒప్పందంలో “ఇరాన్కు అణ్వాయుధాలు ఉండకూడదు” అనే అంశం తప్పనిసరిగా ఉంటుందని స్పష్టం చేశారు.
గత ఆరు వారాలుగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన తీవ్ర దాడులతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ముడి చమురు ధరలు భారీగా పెరిగి అనేక దేశాలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
తాజావార్తలు
-
Pizza Hut Success Story: అప్పులతో మొదలైన పిజ్జా బిజినెస్.. నేడు ఎన్ని వేల కోట్ల సామ్రాజ్యంగా ఎదిగిందో తెలుసా?
-
Beach Shacks in AP: గోవా తరహాలో ఏపీ బీచ్లలో బార్లు.. మార్గదర్శకాలు జారీ
-
Supreme Court: ‘సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులు’’.. నిందితులు జైల్లో ఉండడమే ఉత్తమమన్న సూర్యకాంత్
-
Tea and Biscuits: ఖాళీ కడుపుతో టీ, బిస్కెట్లు తింటున్నారా..? ఎయిమ్స్ వైద్యుల కీలక హెచ్చరిక
-
INDA Vs AFGA: ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా.. ఆప్ఘనిస్థాన్పై భారీ విజయం..
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!