Pakistan: బలూచిస్తాన్లో భారీ పేలుడు.. ఒకరి మృతి, 10 మంది పరిస్థితి విషమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb blast in Balochistan: పాకిస్తాన్ మరోసారి పేలుడుతో దద్దరిల్లింది. బలూచిస్తాన్ ప్రావిన్సులో రద్దీగా ఉండే ఓ మార్కెట్ లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. బలూచిస్తాన్ లోని కోహ్లు పట్టణంలోని ఓ స్వీట్ షాపులో ఈ పేలుడు జరిగింది. దీంట్లో ఇప్పటి వరకు ఒకరు మరణించగా.. మరో 20 మంది వరకు గాయపడ్డారు. ఇందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు జరిగిన వెంటనే క్షతగాత్రులను కోహ్లులోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పేలుడుపై బలూచిస్తాన్ ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్ విచారణ ప్రారంభించింది. అయితే ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా పేలుడుకు బాధ్యత వహించలేదు. ప్రస్తుతం విషమంగా ఉన్నవారిని డేరా ఘాజీ ఖాన్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. అయితే బలూచిస్తాన్ ప్రావిన్సులో తరుచుగా ‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ’ పాక్ ఆర్మీ, చైనా జాతీయులు లక్ష్యంగా దాడులు నిర్వహిస్తుంది. అయితే బీఎల్ఏ కూడా ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించుకోలేదు.
Also Read
- Hindu Temple Demolition: పాకిస్థాన్లో 125 ఏళ్ల పురాతన హిందూ ఆలయం కూల్చివేత.. హిందూ సంఘాల ఆందోళన!
- Explainer: '2012' సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
- Times Square Stabbing: న్యూయార్క్లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్లో హతం!
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
Read Also: Kabul Blast: కాబూల్ బాంబ్ పేలుడులో 100కు చేరిన మృతులు.. చనిపోయిన వారిలో ఎక్కువ మంది బాలికలే..
పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ స్వతంత్య్రం కోసం దశాబ్ధాలుగా పోరాడుతోంది. కానీ పాకిస్తాన్ ఆర్మీ బలూచ్ ప్రజలను తీవ్రంగా అణచివేస్తోంది. అక్కడ పౌర హక్కుల నేతలు, బలూచ్ మద్దతుదారులు తరుచుగా కనిపించకుండా పోతున్నారు. వారంతా ఏమయ్యారనేది ఇప్పటికీ తేలడం లేదు. పాకిస్తాన్ ఆర్మీనే వారిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్యలకు పాల్పడుతోందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆరోపిస్తోంది. దీంతో పాటు ఇటీవల కాలంలో బలూచిస్తాన్ లోని గ్వాదర్ పోర్టును ఆధునీకీకరిస్తోంది చైనా. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)లో భాగంగా బలూచిస్తాన్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రోడ్లు, వంతెనలను నిర్మిస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో చైనీయుల ఆగడాలు కూడా ఎక్కువయ్యాయి. దీంతో చైనీయులు, పాక్ ఆర్మీ లక్ష్యంగా బలూచిస్తాన్ మద్దతుదారులు దాడులు చేస్తుంటారు. బలూచిస్తాన్ తో పాటు సింధ్ ప్రావిన్సుల్లో తరుచుగా ఈ సంస్థ దాడులకు చేస్తుంది.
తాజావార్తలు
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
-
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!