Pakistan: బలూచిస్తాన్లో భారీ పేలుడు.. ఒకరి మృతి, 10 మంది పరిస్థితి విషమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb blast in Balochistan: పాకిస్తాన్ మరోసారి పేలుడుతో దద్దరిల్లింది. బలూచిస్తాన్ ప్రావిన్సులో రద్దీగా ఉండే ఓ మార్కెట్ లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. బలూచిస్తాన్ లోని కోహ్లు పట్టణంలోని ఓ స్వీట్ షాపులో ఈ పేలుడు జరిగింది. దీంట్లో ఇప్పటి వరకు ఒకరు మరణించగా.. మరో 20 మంది వరకు గాయపడ్డారు. ఇందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు జరిగిన వెంటనే క్షతగాత్రులను కోహ్లులోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పేలుడుపై బలూచిస్తాన్ ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్ విచారణ ప్రారంభించింది. అయితే ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా పేలుడుకు బాధ్యత వహించలేదు. ప్రస్తుతం విషమంగా ఉన్నవారిని డేరా ఘాజీ ఖాన్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. అయితే బలూచిస్తాన్ ప్రావిన్సులో తరుచుగా ‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ’ పాక్ ఆర్మీ, చైనా జాతీయులు లక్ష్యంగా దాడులు నిర్వహిస్తుంది. అయితే బీఎల్ఏ కూడా ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించుకోలేదు.
Also Read
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
Read Also: Kabul Blast: కాబూల్ బాంబ్ పేలుడులో 100కు చేరిన మృతులు.. చనిపోయిన వారిలో ఎక్కువ మంది బాలికలే..
పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ స్వతంత్య్రం కోసం దశాబ్ధాలుగా పోరాడుతోంది. కానీ పాకిస్తాన్ ఆర్మీ బలూచ్ ప్రజలను తీవ్రంగా అణచివేస్తోంది. అక్కడ పౌర హక్కుల నేతలు, బలూచ్ మద్దతుదారులు తరుచుగా కనిపించకుండా పోతున్నారు. వారంతా ఏమయ్యారనేది ఇప్పటికీ తేలడం లేదు. పాకిస్తాన్ ఆర్మీనే వారిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్యలకు పాల్పడుతోందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆరోపిస్తోంది. దీంతో పాటు ఇటీవల కాలంలో బలూచిస్తాన్ లోని గ్వాదర్ పోర్టును ఆధునీకీకరిస్తోంది చైనా. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)లో భాగంగా బలూచిస్తాన్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రోడ్లు, వంతెనలను నిర్మిస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో చైనీయుల ఆగడాలు కూడా ఎక్కువయ్యాయి. దీంతో చైనీయులు, పాక్ ఆర్మీ లక్ష్యంగా బలూచిస్తాన్ మద్దతుదారులు దాడులు చేస్తుంటారు. బలూచిస్తాన్ తో పాటు సింధ్ ప్రావిన్సుల్లో తరుచుగా ఈ సంస్థ దాడులకు చేస్తుంది.
తాజావార్తలు
-
Bhojshala case: భోజ్శాల ఒక దేవాలయం.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!