Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
- అణు సామర్థ్యం కోసం దేశాన్ని తాకట్టు పెట్టడానికి అసిమ్ మునీర్ కుట్ర..
- పాక్ లోని గ్వాదర్ పోర్టును శాశ్వతంగా చైనాకు ఇచ్చే ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: అణు సాంకేతికత కోసం దేశాన్ని తాకట్టు పెట్టడానికి కూడా పాకిస్తాన్ సిద్ధమైంది. కీలక అణు సామర్థ్యం కోసం చైనాకు తన గ్వాదర్ పోర్టును శాశ్వతంగా ఇవ్వడానికి పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ సిద్ధమైనట్లు ‘డ్రాప్ సైట్ న్యూస్’ ఒక కథనంలో వెల్లడించడం సంలచంగా మారింది. 2024లో పాక్-చైనా ద్వైపాక్షిక చర్చల్లో మునీర్ ఈ ప్రతిపాదన చేసినట్లు సమాచారం.
సముద్ర ఆధారిత సెకండ్-స్ట్రైక్ సామర్థ్యం కోసం పాకిస్తాన్ చైనాను కోరుతోంది. దీనికి ప్రతిఫలంగా గ్వాదర్లో చైనా శాశ్వత సైనిక స్థావరానికి అనుమతి ఇస్తామని పాక్, చైనాకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. పాక్ ఆకాశం, భూమి అణు దాడి సామర్థ్యాలతో పాటు సముద్రం నుంచి కూడా అణు దాడి నిర్వహించే సామర్థ్యంతో ‘‘న్యూక్లియర్ ట్రయాడ్’’గా మారాలని భావిస్తోంది. దీని కోసమే సముద్రం నుంచి అణు దాడి సామర్థ్యాన్ని చైనా నుంచి పొందాలని అనుకుంటోంది. అయితే, పాక్ డిమాండ్ అసాధారణమైందిగా భావించిన చైనా, ఈ చర్చల్ని మధ్యలోనే నిలిపేసినట్లు నివేదిక వెల్లడించింది.
Also Read
2022లో పాక్ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన అసిమ్ మునీర్ చైనాకు దూరంగా అమెరికాకు దగ్గరవ్వడానికి ప్రయత్నించారని కథనం పేర్కొంది. ట్రంప్ పలుమార్లు తన ఫేమరెట్ ఫీల్డ్ మార్షల్ అని అసిమ్ మునీర్పై పలుమార్లు ప్రశంసలు కురిపించారు. పాక్ ప్రతిపాదన భారత్కు ప్రమాదం తెచ్చిపెట్టేలా ఉంది. ప్రస్తుతం రష్యా, చైనా, బ్రిటన్, భారత్ వంటి దేశాలకు మాత్రమే పూర్తి స్థాయిలో సముద్ర ఆధారిత అణు నిరోధక, దాడి సామర్థ్యాలు ఉన్నాయి. పాకిస్తాన్కు ఈ సామర్థ్యం లభిస్తే దక్షిణాసియాలో వ్యూహాత్మక సమీకరణాలు మారే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్కు అణు కార్యక్రమాల్లో చైనా సాంకేతిక సాయం అందించినట్లు నివేదిక వెల్లడించింది. అణు బాంబు నమూనాలు, యురేనియం, బాలిస్టిక్ క్షిపణి సాంకేతికత వంటి అంశాల్లో పాకిస్తాన్కు సహకారం అందించినట్లు చెప్పింది.
తాజావార్తలు
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!