Nvidia: చరిత్ర సృష్టించిన ఎన్విడియా.. 5 ట్రిలియన్ డాలర్ల ఘనత..
- చరిత్ర సృష్టించిన ఎన్విడియా..
- 5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ వాల్యూ..
- ఈ ఘనత సాధించిన తొలి కంపెనీగా రికార్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nvidia: ఎన్విడియా(Nvidia) కంపెనీ చరిత్ర సృష్టించింది. 5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన మొదటి కంపెనీగా అవతరించింది. 4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువకు చేరుకున్న 4 నెలల్లోనే ఈ ఘనట సాధించడం గమనార్హం. కంపెనీ విలువ ఇప్పుడు మొత్తం క్రిప్టో కరెన్సీ మార్కెట్ కన్నా ఎక్కువ. యూరప్ స్టాక్స్ సూచిక Stoxx 600లో సగం విలువకు సమానంగా నిలిచింది. ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ 1993లో ఈ కంపెనీని స్థాపించాడు. అప్పటి నుంచి ఈయనే సీఈఓగా ఉన్నారు. ఒకప్పుడు గ్రాఫిక్ చిప్ డిజైన్ కంపెనీగా ప్రారంభమైన ఎన్విడియా, ఇప్పుడ ప్రపంచ ఏఐ పరిశ్రమకు కీలకంగా మారింది. చాట్జీపీటీ(ChatGPT) ప్రారంభమైన 2022 నుంచి ఎన్విడియా షేర్లు 12 రెట్లు పెరిగాయి.
Read Also: Cyclone Montha Damage: మొంథా తుఫాన్తో భారీ నష్టం.. ఏపీలో ప్రాథమిక అంచనాలు ఇవే..!
Also Read
కంపెనీకి 500 బిలియన్ డాలర్ల విలువైన AI చిప్ ఆర్డర్లు వచ్చాయని చెప్పడంతో పాటు, అమెరికా ప్రభుత్వానికి 7 సూపర్ కంప్యూటర్లను నిర్మించే ప్రణాళికను మంగళవారం హువాంగ్ ప్రకటించారు. హువాంగ్ ప్రస్తుత షేర్ల విలువ సుమారుగా 177 బిలియన్ డాలర్లు. దీని ద్వారా ఆయన ప్రపంచంలోనే 8వ అత్యంత ధనవంతుడి స్థానంలో నిలిచారు. ఎన్విడియా రూపొందించిన H100, బ్లాక్వెల్ చిప్లు ప్రపంచ వ్యాప్తంగా ఏఐకి వెన్నెముకగా మారాయి. చాట్ జీపీటీ, ఎలాన్ మస్క్ xAI వంటి లార్జ్ లాంగ్వెజ్ మోడళ్లలో ఇవి కీలకంగా మారాయి.
అయితే, ఈ పరిణామాల గురించి నిపుణులు హెచ్చరించారు. ఏఐ రంగంలో పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నా, ఈ ధోరణి అధికం అయితే మార్కెట్ బబుల్ ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు. ప్రస్తుతం ఎన్విడియా అమెరికా, చైనా టెక్ పోటీలో కీలకంగా మారింది. ట్రంప్, జిన్పింగ్ మధ్య జరగబోయే సమావేశంలో ఎన్విడియా బ్లాక్వెల్ చిప్ ప్రధాన చర్చాంశంగా మారే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!