Kim Jong: చైనాలోకి వెరైటీగా ఎంట్రీ ఇచ్చిన ఉత్తర కొరియా నేత కిమ్
- చైనాలోకి వెరైటీగా ఎంట్రీ ఇచ్చిన ఉత్తర కొరియా అధ్యక్షుడు
- ట్రైన్లో ప్రయాణం చేసి బీజింగ్ చేరుకున్న కిమ్ జోంగ్ ఉన్
- సైనిక కవాతులో పాల్గొననున్న కిమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాలో రెండు రోజుల పాటు షాంఘై సహకార సదస్సు జరిగింది. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మెడీ.. ఇలా ఆయా దేశాధినేతలంతా హాజరయ్యారు. వీరంతా ప్రత్యేక విమానాల్లో చైనాలో అడుగుపెట్టారు. కానీ ఉత్తర కొరియా అధ్యక్షుడు మాత్రం తాజాగా వెరైటీగా అడుగుపెట్టారు. బీజింగ్లో జరిగే సైనిక కవాతులో పాల్గొనేందుకు బుల్లెట్ ప్రూఫ్ రైల్లో వచ్చారు. విదేశీ పర్యటనలు అంటే చాలా హడావుడి.. హంగామా ఉంటుంది. అందుకు భిన్నంగా కిమ్ జోంగ్ ఉన్ మాత్రం రైల్లో చైనాకు వచ్చారు. మంగళవారం బీజింగ్లో జరిగే సైనిక కవాతులో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో కలిసి పాల్గొననున్నారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన సందర్భంగా 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బీజింగ్లో సైనిక కవాతు జరుగుతోంది. ఈ కవాతును జిన్పింగ్, కిమ్ కలిసి వీక్షించనున్నారు.
ఇది కూడా చదవండి: US-Russia: రష్యాపై తీవ్ర ఆంక్షలకు అమెరికా రంగం సిద్ధం.. ట్రెజరీ కార్యదర్శి సంకేతాలు
Also Read
- Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
- Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
- Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్లో ఉగ్రదాడి!
- Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
రష్యా అధ్యక్షుడు పుతిన్తో కిమ్ జోంగ్ ఉన్కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఉక్రెయిన్తో యుద్ధంలో కూడా సహకరించారు. ఉత్తర కొరియా సైన్యాన్ని రష్యాకు పంపించారు. ఇక పుతిన్ కూడా నిన్న చైనాలో పర్యటించారు. జిన్పింగ్తో కలివిడిగా తిరిగారు. తాజాగా కిమ్ జోంగ్ ఉన్ కూడా వచ్చారు. దీంతో ఈ బంధం మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: UP: యూపీలో ఘోరం.. చెల్లిని ప్రేమించాడని ఓ అన్నయ్య ఘాతుకం.. ప్రియుడిని బయటకు తీసుకెళ్లి..!
చైనా సైనిక కవాతులో పాల్గొనేందుకు సోమవారం ప్యోంగ్యాంగ్ నుంచి కిమ్ జోంగ్ రైల్లో బయల్దేరారు. విదేశాంగ మంత్రి చో సోన్-హుయ్, ఇతర సీనియర్ అధికారులతో కలిసి రైల్లో ప్రయాణించారు. రెండేళ్ల క్రితం రష్యాలో జరిగిన శిఖరాగ్ర సమావేశానికి కూడా కిమ్ రైల్లోనే వెళ్లారు. అలాగే హనోయ్లో జరిగిన శిఖరాగ్ర సమావేశానికి ట్రంప్ను కలిసేందుకు వియత్నాంకు 60 గంటలు ప్రయాణం చేశారు. ఇక 2018లో సింగపూర్లో తొలిసారి ట్రంప్ను కలిసేందుకు చైనా అందించిన బోయింగ్ 747 విమానంలో కిమ్ వెళ్లారు.
అమెరికా, దాని మిత్ర దేశాలు.. ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను బలపర్చుకునేందుకు రష్యా, చైనాతో కిమ్ సంబంధాలు పెంచుకుంటున్నారు. అంతేకాకుండా ఉత్తర కొరియాకు తొలి నుంచి రష్యా, చైనా సంపూర్ణ మద్దతు ఇస్తూనే ఉన్నాయి. ఇక ఉక్రెయిన్తో యుద్ధం తర్వాత రష్యాకు కిమ్ బాగా దగ్గరయ్యారు. ఉక్రెయిన్తో యుద్ధానికి రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు సరఫరా చేసిందని అమెరికా, దక్షిణ కొరియా ఆరోపించింది.
తాజావార్తలు
-
Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్లో త్రిష..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
Drishyam3 : దృశ్యం -3 తెలుగు రీమేక్ నుండి తప్పుకున్న వెంకీ.. డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కు రెడీ
-
Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!
-
Trisha: త్రిషను ‘పరాన్నజీవి’తో పోల్చుతూ..సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
-
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత