Ban Phones In Classroom: క్లాస్ రూముల్లో మొబైల్స్ నిషేధం.. యూరోపియన్ దేశం కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Phones In Classrooms: ప్రస్తుతం కాలంలో అన్ని దేశాల్లో తరగతి గదుల్లోకి సెల్ ఫోన్లు తీసుకురావడం పరిపాటిగా మారింది. విద్యపై దృష్టి సారించడం కన్నా క్లాస్ రూముల్లో మొబైల్ ఫోన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నవారు కూడా ఉన్నారు. మన దేశంలో క్లాసురూముల్లోకి సెల్ ఫోన్లు తీసుకురావడంపై కాస్త కఠినంగానే వ్యవహరిస్తారు. కానీ యూరప్ దేశాల్లో మాత్రం ఇది సర్వసాధారణం. అలాంటిది ఇప్పుడు ఓ ఓ యూరోపియన్ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది.
Read Also: Russia: మాస్కోపై డ్రోన్ అటాక్.. అమెరికా, నాటో పనే అని రష్యా ఆరోపణలు..
Also Read
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
తాజా విద్యా సంస్కరణల్లో భాగంగా నెదర్లాండ్స్ క్లాసురూముల్లోకి మొబైల్ ఫోన్లను నిషేధించింది. పాఠాలకు అంతరాయం కలిగించే మొబైల్ ఫోన్లను క్లాసురూముల్లోకి తీసుకురాకుండా నిషేధిస్తున్నామని అక్కడి ప్రభుత్వం మంగళవారం తెలిపింది. మొబైల్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్వాచ్లు విద్యార్థుల అభ్యాసానికి ఆటంకం కలిగిస్తున్నాయని, వాటిని వచ్చే ఏడాది నుంచి తరగతిలోకి అనుమతించబోమని డచ్ ప్రభుత్వం తెలిపింది.
పాఠాలు చెప్పే సమయంలో మొబైల్ ఫోన్లు హానికరమైన ప్రభావాన్ని చూపుతున్నాయని.. వీటి వల్ల విద్యార్థులు ఏకాగ్రత తగ్గడంతో పాటు పనితీరు దెబ్బతింటోందని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొబైల్ ఫోన్లు, అలాగే టాబ్లెట్లు, స్మార్ట్వాచ్లు ఇకపై జనవరి 1, 2024 నుండి తరగతి గదుల్లోకి అనుమతించబడవని ప్రకటించింది. అక్టోబర్ నాటికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అంతర్గత నిబంధనలను అంగీకరించాలని ప్రభుత్వ పాఠశాల అధికారులు కోరుతున్నారు. అయితే దేశంలోని రైట్ సంకీర్ణ ప్రభుత్వం అధికార నిషేధాన్ని విధించలేదు. వచ్చే ఏడాది ఫలితాలను బట్టి అధికార నిషేధాన్ని విధించే అవకాశం ఉంది. ఈ చర్య ‘‘సాంస్కృతిక పరివర్తన’’కు దారి తీస్తుందని.. విద్య అభ్యాసాన్ని మెరుగుపరుస్తుందని విద్యాశాఖ మంత్రి రాబర్ట్ డిజ్క్గ్రాఫ్ పార్లమెంటుకు తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!