Social media: నిషేధం ఎత్తివేత.. ఎక్కడంటే
- గత కొద్ది కాలంగా సోషల్ మీడియాపై ..
- నిషేధం విధించిన నేపాల్ ప్రభుత్వం
- ఆందోళన చేపట్టిన నేపాల్ యువత, ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాపై నేపాల్ లో నిషేధం ఎత్తివేశారు. గత కొద్ది కాలంగా సోషల్ మీడియాపై ఆ దేశం నిషేధం విధించింది. అయితే… అక్కడి ప్రజలు ఆందోళన చేపట్టడంతో… హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. నేపాల్ లో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధింపుపై నేపథ్యంలో చేపట్టిన ఆందోళన తీవ్ర హింసకు దారితీయడంతో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి.. ఓ నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాపై విధించిన బ్యాన్ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
Also Read
సమావేశం అనంతరం ఆ దేశ కమ్యూనికేషన్, సమాచార, ప్రసార శాఖ మంత్రి పృథ్వీ సుబా గురుంగ్ నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటన చేశారు. ‘జనరేషన్ జడ్’ డిమాండ్ మేరకు సోషల్ మీడియా సైట్లను తిరిగి ప్రారంభించేందుకు సమాచార మంత్రిత్వ శాఖ సంబంధిత ఏజెన్సీలను సంప్రదించినట్లు వెల్లడించారు. మంత్రి ప్రకటన నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి దాటాక ఫేస్బుక్, ఎక్స్ (ట్విటర్), వాట్సప్ తదితర సైట్లు పనిచేయడం ప్రారంభించాయి. ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో ఆందోళనకారులు నిరసన విరమించాలని మంత్రి కోరారు.
గడువు లోపల కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక శాఖ వద్ద రిజిస్టర్ కానందుకు ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్, ఎక్స్, రెడిట్, లింక్డిన్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ పై గత గురువారం నిషేధం విధించింది. ఈ మాధ్యమాలు ఆగష్టు 28 నుంచి ఏడు రోజుల్లోగా రిజిష్టర్ కావల్సి ఉంది. ఈ గడువు బుధవారం రాత్రి తీరిపోయినప్పటికి ఇంకా రిజిస్టర్ కాలేదు. దీంతో 26 సైట్లపై నిషేధం విధించింది. ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వంపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. వెంటనే స్పందించిన యువత రాజధాని కాఠ్మండ్ తో పాటు పలు ప్రాంతాల్లో భారీగా ఆందోళనలు నిర్వహించారు. ఆందోళనకారులు నేపాల్ పార్లమెంట్వైపు దూసుకు రావడంతో.. పోలీసులు వారిపై టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ఉపయోగించారు. అనంతరం ఈ కాల్పుల్లో 19 మంది చనిపోయారు. మరో 300 మందికి పైగా గాయపడడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచారు.
తాజావార్తలు
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
-
Ragi Pakoda: ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.. రాగి పిండితో కరకరలాడే స్నాక్స్ను సింపుల్గా ఇలా చేసుకోండి!
-
Jr NTR: ఎన్టీఆర్ పేరుతో విరాళాల సేకరణపై అప్రమత్తంగా ఉండండి!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!