Social media: నిషేధం ఎత్తివేత.. ఎక్కడంటే
- గత కొద్ది కాలంగా సోషల్ మీడియాపై ..
- నిషేధం విధించిన నేపాల్ ప్రభుత్వం
- ఆందోళన చేపట్టిన నేపాల్ యువత, ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాపై నేపాల్ లో నిషేధం ఎత్తివేశారు. గత కొద్ది కాలంగా సోషల్ మీడియాపై ఆ దేశం నిషేధం విధించింది. అయితే… అక్కడి ప్రజలు ఆందోళన చేపట్టడంతో… హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. నేపాల్ లో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధింపుపై నేపథ్యంలో చేపట్టిన ఆందోళన తీవ్ర హింసకు దారితీయడంతో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి.. ఓ నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాపై విధించిన బ్యాన్ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
Also Read
- Donald Trump: "ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే".. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
- Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
- US Airstrikes on Iran: మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు
- Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
సమావేశం అనంతరం ఆ దేశ కమ్యూనికేషన్, సమాచార, ప్రసార శాఖ మంత్రి పృథ్వీ సుబా గురుంగ్ నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటన చేశారు. ‘జనరేషన్ జడ్’ డిమాండ్ మేరకు సోషల్ మీడియా సైట్లను తిరిగి ప్రారంభించేందుకు సమాచార మంత్రిత్వ శాఖ సంబంధిత ఏజెన్సీలను సంప్రదించినట్లు వెల్లడించారు. మంత్రి ప్రకటన నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి దాటాక ఫేస్బుక్, ఎక్స్ (ట్విటర్), వాట్సప్ తదితర సైట్లు పనిచేయడం ప్రారంభించాయి. ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో ఆందోళనకారులు నిరసన విరమించాలని మంత్రి కోరారు.
గడువు లోపల కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక శాఖ వద్ద రిజిస్టర్ కానందుకు ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్, ఎక్స్, రెడిట్, లింక్డిన్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ పై గత గురువారం నిషేధం విధించింది. ఈ మాధ్యమాలు ఆగష్టు 28 నుంచి ఏడు రోజుల్లోగా రిజిష్టర్ కావల్సి ఉంది. ఈ గడువు బుధవారం రాత్రి తీరిపోయినప్పటికి ఇంకా రిజిస్టర్ కాలేదు. దీంతో 26 సైట్లపై నిషేధం విధించింది. ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వంపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. వెంటనే స్పందించిన యువత రాజధాని కాఠ్మండ్ తో పాటు పలు ప్రాంతాల్లో భారీగా ఆందోళనలు నిర్వహించారు. ఆందోళనకారులు నేపాల్ పార్లమెంట్వైపు దూసుకు రావడంతో.. పోలీసులు వారిపై టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ఉపయోగించారు. అనంతరం ఈ కాల్పుల్లో 19 మంది చనిపోయారు. మరో 300 మందికి పైగా గాయపడడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచారు.
తాజావార్తలు
-
India First Hydrogen Train: భారత్ తొలి హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ సక్సెస్.. గంటకు 120 కిమీ వేగంతో పరుగులు
-
Donald Trump: “ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే”.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
-
Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
-
Vivo X Fold 6: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో వివో ఎక్స్ ఫోల్డ్ 6 విడుదల.. ఫోల్డబుల్ ఫోన్లలో కొత్త బెంచ్మార్క్
-
TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!