Social media: నిషేధం ఎత్తివేత.. ఎక్కడంటే
- గత కొద్ది కాలంగా సోషల్ మీడియాపై ..
- నిషేధం విధించిన నేపాల్ ప్రభుత్వం
- ఆందోళన చేపట్టిన నేపాల్ యువత, ప్రజలు
సోషల్ మీడియాపై నేపాల్ లో నిషేధం ఎత్తివేశారు. గత కొద్ది కాలంగా సోషల్ మీడియాపై ఆ దేశం నిషేధం విధించింది. అయితే… అక్కడి ప్రజలు ఆందోళన చేపట్టడంతో… హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. నేపాల్ లో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధింపుపై నేపథ్యంలో చేపట్టిన ఆందోళన తీవ్ర హింసకు దారితీయడంతో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి.. ఓ నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాపై విధించిన బ్యాన్ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
Also Read
- Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
- Trump-King Charles: వైట్హౌస్లో ట్రంప్ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
సమావేశం అనంతరం ఆ దేశ కమ్యూనికేషన్, సమాచార, ప్రసార శాఖ మంత్రి పృథ్వీ సుబా గురుంగ్ నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటన చేశారు. ‘జనరేషన్ జడ్’ డిమాండ్ మేరకు సోషల్ మీడియా సైట్లను తిరిగి ప్రారంభించేందుకు సమాచార మంత్రిత్వ శాఖ సంబంధిత ఏజెన్సీలను సంప్రదించినట్లు వెల్లడించారు. మంత్రి ప్రకటన నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి దాటాక ఫేస్బుక్, ఎక్స్ (ట్విటర్), వాట్సప్ తదితర సైట్లు పనిచేయడం ప్రారంభించాయి. ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో ఆందోళనకారులు నిరసన విరమించాలని మంత్రి కోరారు.
గడువు లోపల కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక శాఖ వద్ద రిజిస్టర్ కానందుకు ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్, ఎక్స్, రెడిట్, లింక్డిన్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ పై గత గురువారం నిషేధం విధించింది. ఈ మాధ్యమాలు ఆగష్టు 28 నుంచి ఏడు రోజుల్లోగా రిజిష్టర్ కావల్సి ఉంది. ఈ గడువు బుధవారం రాత్రి తీరిపోయినప్పటికి ఇంకా రిజిస్టర్ కాలేదు. దీంతో 26 సైట్లపై నిషేధం విధించింది. ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వంపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. వెంటనే స్పందించిన యువత రాజధాని కాఠ్మండ్ తో పాటు పలు ప్రాంతాల్లో భారీగా ఆందోళనలు నిర్వహించారు. ఆందోళనకారులు నేపాల్ పార్లమెంట్వైపు దూసుకు రావడంతో.. పోలీసులు వారిపై టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ఉపయోగించారు. అనంతరం ఈ కాల్పుల్లో 19 మంది చనిపోయారు. మరో 300 మందికి పైగా గాయపడడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచారు.
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!