Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..

  • నేపాల్‌లోని రసువా జిల్లాలో భోటేకోశి నది ఉగ్రరూపం
  • ఒక్కసారిగా వచ్చిన వరదతో 22 మంది మృతి
  • దాదాపు 400 మంది గల్లంతు.. వారిలో 133 మంది భారతీయులు
  • కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన వారు గల్లంతు..
Nepal Floods (2)

Nepal Floods (2)

Nepal Floods: నేపాల్‌లో భోటేకోశి నది పెను విధ్వంసాన్ని సృష్టించింది. టిటెట్ సరిహద్దుల్లో ఉన్న నేపాల్ జిల్లాల్లో ఒక్కసారిగా నది ఉప్పొంగటంతో అనేక గ్రామాలు, వంతెనలు కొట్టుకుపోయాయి. వందలాది మంది గల్లంతయ్యారు. వీరిలో 100కు పైగా భారతీయులు ఉన్నట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. మరోవైపు, ఈ నది ప్రవాహం దిగువన ఉన్న భారత్ లోని బీహార్, యూపీల్లోకి వచ్చే ప్రమదం ఉండటంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కోసి, గండర్ నదుల ప్రవాహం పెరిగే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, ఈ వరదల కాఱంగా ఇప్పటి వరకు 19 మంది మృతి చెందగా, 400 మందికి పైగా కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన వారు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఇందులో 133 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. గల్లంతైన వారిలో విదేశీయులు, నేపాలీ పౌరులు కూడా ఉన్నారు. భారత ప్రధాని నరేంద్రమోడీ, నేపాల్ ప్రధాని బాలెన్ షాకు ఫోన్ చేసి వరదల్లో మరణించిన వారికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. అవసరమైన సాయాన్ని అందిస్తామని ప్రధాని మోడీ నేపాల్‌కు హామీ ఇచ్చారు. . గల్లంతైన వారిలో విదేశీయులు, నేపాలీ పౌరులు కూడా ఉన్నారు.