Voyager 1: వాయేజర్ 1కి మళ్లీ ప్రాణం.. 24 బిలియన్ కి.మీ నుంచి భూమికి సమాచారం..
Voyager 1: ఐదు దశాబ్ధాల క్రితం నాసా ప్రయోగించిన ‘వాయేజర్ 1’ అంతరిక్ష నౌక ప్రాణం పోసుకుంది. గత కొన్ని నెలల క్రితంగా విశ్వంలో దాని జాడ తెలియకుండాపోయింది. తాజాగా నౌక నుంచి సమాచారం అందినట్లు నాసా సోమవారం ప్రకటించింది. తాము పంపే సిగ్నల్స్ని వాయేజర్ 1 స్వీకరిస్తున్నప్పటికీ, నవంబర్ 14, 2023 నుంచి దాని నుంచి భూమికి సిగ్నల్స్ రావడం లేదని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు.
ప్రస్తుతం విశ్వంలో సుదూరం ప్రయాణించిన మానవ నిర్మిత వస్తువుగా వాయేజర్ 1 రికార్డు సృష్టించింది. 1977లో ప్రయోగించిన ఈ నౌక ప్రస్తుతం సౌరకుటుంబాన్ని దాటి ‘ ఇంటర్స్టెల్లార్’ మీడియంలోకి ప్రవేశించింది. భూమి నుంచి సుమారుగా 2400 కోట్ల కి.మీ(24 బిలియన్ కి.మీ.) కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే, ఒక పనిచేయని చిప్ కారణంగా ఇటీవల వాయేజర్ 1లో సమస్య ఏర్పడినట్లు నాసా జెట్ ప్రొపల్షన్ బృందాలు కనుగొన్నాయి. అయితే, అంతరిక్ష నౌకలోని 46 ఏళ్ల క్రితం నాటి కంప్యూటర్ కోడింగ్ ఈ సమస్యను పరిష్కరించింది. ప్రస్తుతం వాయేజర్ 1లోని ఆన్బోర్డ్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ హెల్త్, దాని పొజిషన్ గురించి కీలక డేలాను తిరిగి ఇచ్చినట్లు నాసా వెల్లడించింది. సైన్స్ డేటాను ఇవ్వడం తిరిగి ప్రారంభించింది.
Also Read
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
- Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
1977లో ప్రారంభించిన వాయేజర్ 1 స్పేస్క్రాఫ్ట్ 2012లో ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి ప్రవేశించింది. మానవజాతి నిర్మించిన ఈ వ్యోమనౌక భూమి నుంచి ఏకంగా 24 బిలియన్ కి.మీ ప్రయాణించింది. ఇప్పటికీ అంతదూరం నుంచి సమాచారాన్ని పంపిస్తుంది. ఈ సమాచారం భూమి-వాయేజర్ 1 మధ్య బదిలీ కావడానికి 22.5 గంటల సమయం పడుతోంది. దీని తర్వాత ప్రయోగించిన వాయేజర్ 2 నౌక కూడా 2018లో సౌర వ్యవస్థను దాటింది. వాయేజర్ అంతరిక్ష నౌకల్లో ఏర్పాటు చేసిన రెండు ‘‘గోల్డెన్ రికార్డ్స్’’-బంగారు పూతపూసిన రాగి డిస్కులు మానవులకు సంబంధించిన సమాచారం, తాము ఉన్న స్థానాన్ని తెలిపే సమాచారాన్ని కలిగి ఉంది. గ్రహాంతవాసులకు మనుషుల వివరాలను తెలియజేసేందుకు ఇది ఉద్దేశించబడింది. 2025 తర్వాత వీటిలో ఉన్న బ్యాటరీలు క్షీణించనున్నాయి. ఆ తర్వాత భూమికి సందేశాలు ఇవ్వడం ఆగిపోతాయని భావిస్తున్నారు. ఇక ఇవి మన పాలపుంతలో గంటకు 61 వేల కి.మీ వేగంతో ఇలా ప్రయాణిస్తూనే ఉంటాయి.
తాజావార్తలు
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో