Voyager 1: వాయేజర్ 1కి మళ్లీ ప్రాణం.. 24 బిలియన్ కి.మీ నుంచి భూమికి సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Voyager 1: ఐదు దశాబ్ధాల క్రితం నాసా ప్రయోగించిన ‘వాయేజర్ 1’ అంతరిక్ష నౌక ప్రాణం పోసుకుంది. గత కొన్ని నెలల క్రితంగా విశ్వంలో దాని జాడ తెలియకుండాపోయింది. తాజాగా నౌక నుంచి సమాచారం అందినట్లు నాసా సోమవారం ప్రకటించింది. తాము పంపే సిగ్నల్స్ని వాయేజర్ 1 స్వీకరిస్తున్నప్పటికీ, నవంబర్ 14, 2023 నుంచి దాని నుంచి భూమికి సిగ్నల్స్ రావడం లేదని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు.
ప్రస్తుతం విశ్వంలో సుదూరం ప్రయాణించిన మానవ నిర్మిత వస్తువుగా వాయేజర్ 1 రికార్డు సృష్టించింది. 1977లో ప్రయోగించిన ఈ నౌక ప్రస్తుతం సౌరకుటుంబాన్ని దాటి ‘ ఇంటర్స్టెల్లార్’ మీడియంలోకి ప్రవేశించింది. భూమి నుంచి సుమారుగా 2400 కోట్ల కి.మీ(24 బిలియన్ కి.మీ.) కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే, ఒక పనిచేయని చిప్ కారణంగా ఇటీవల వాయేజర్ 1లో సమస్య ఏర్పడినట్లు నాసా జెట్ ప్రొపల్షన్ బృందాలు కనుగొన్నాయి. అయితే, అంతరిక్ష నౌకలోని 46 ఏళ్ల క్రితం నాటి కంప్యూటర్ కోడింగ్ ఈ సమస్యను పరిష్కరించింది. ప్రస్తుతం వాయేజర్ 1లోని ఆన్బోర్డ్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ హెల్త్, దాని పొజిషన్ గురించి కీలక డేలాను తిరిగి ఇచ్చినట్లు నాసా వెల్లడించింది. సైన్స్ డేటాను ఇవ్వడం తిరిగి ప్రారంభించింది.
Also Read
- Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
- Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా 'రెంట్ ఫ్రీ' సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
1977లో ప్రారంభించిన వాయేజర్ 1 స్పేస్క్రాఫ్ట్ 2012లో ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి ప్రవేశించింది. మానవజాతి నిర్మించిన ఈ వ్యోమనౌక భూమి నుంచి ఏకంగా 24 బిలియన్ కి.మీ ప్రయాణించింది. ఇప్పటికీ అంతదూరం నుంచి సమాచారాన్ని పంపిస్తుంది. ఈ సమాచారం భూమి-వాయేజర్ 1 మధ్య బదిలీ కావడానికి 22.5 గంటల సమయం పడుతోంది. దీని తర్వాత ప్రయోగించిన వాయేజర్ 2 నౌక కూడా 2018లో సౌర వ్యవస్థను దాటింది. వాయేజర్ అంతరిక్ష నౌకల్లో ఏర్పాటు చేసిన రెండు ‘‘గోల్డెన్ రికార్డ్స్’’-బంగారు పూతపూసిన రాగి డిస్కులు మానవులకు సంబంధించిన సమాచారం, తాము ఉన్న స్థానాన్ని తెలిపే సమాచారాన్ని కలిగి ఉంది. గ్రహాంతవాసులకు మనుషుల వివరాలను తెలియజేసేందుకు ఇది ఉద్దేశించబడింది. 2025 తర్వాత వీటిలో ఉన్న బ్యాటరీలు క్షీణించనున్నాయి. ఆ తర్వాత భూమికి సందేశాలు ఇవ్వడం ఆగిపోతాయని భావిస్తున్నారు. ఇక ఇవి మన పాలపుంతలో గంటకు 61 వేల కి.మీ వేగంతో ఇలా ప్రయాణిస్తూనే ఉంటాయి.
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో పాత క్యాలెండర్లు ఇంకా ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం ఇది మంచిదేనా?
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!