Voyager 1: వాయేజర్ 1కి మళ్లీ ప్రాణం.. 24 బిలియన్ కి.మీ నుంచి భూమికి సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Voyager 1: ఐదు దశాబ్ధాల క్రితం నాసా ప్రయోగించిన ‘వాయేజర్ 1’ అంతరిక్ష నౌక ప్రాణం పోసుకుంది. గత కొన్ని నెలల క్రితంగా విశ్వంలో దాని జాడ తెలియకుండాపోయింది. తాజాగా నౌక నుంచి సమాచారం అందినట్లు నాసా సోమవారం ప్రకటించింది. తాము పంపే సిగ్నల్స్ని వాయేజర్ 1 స్వీకరిస్తున్నప్పటికీ, నవంబర్ 14, 2023 నుంచి దాని నుంచి భూమికి సిగ్నల్స్ రావడం లేదని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు.
ప్రస్తుతం విశ్వంలో సుదూరం ప్రయాణించిన మానవ నిర్మిత వస్తువుగా వాయేజర్ 1 రికార్డు సృష్టించింది. 1977లో ప్రయోగించిన ఈ నౌక ప్రస్తుతం సౌరకుటుంబాన్ని దాటి ‘ ఇంటర్స్టెల్లార్’ మీడియంలోకి ప్రవేశించింది. భూమి నుంచి సుమారుగా 2400 కోట్ల కి.మీ(24 బిలియన్ కి.మీ.) కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే, ఒక పనిచేయని చిప్ కారణంగా ఇటీవల వాయేజర్ 1లో సమస్య ఏర్పడినట్లు నాసా జెట్ ప్రొపల్షన్ బృందాలు కనుగొన్నాయి. అయితే, అంతరిక్ష నౌకలోని 46 ఏళ్ల క్రితం నాటి కంప్యూటర్ కోడింగ్ ఈ సమస్యను పరిష్కరించింది. ప్రస్తుతం వాయేజర్ 1లోని ఆన్బోర్డ్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ హెల్త్, దాని పొజిషన్ గురించి కీలక డేలాను తిరిగి ఇచ్చినట్లు నాసా వెల్లడించింది. సైన్స్ డేటాను ఇవ్వడం తిరిగి ప్రారంభించింది.
Also Read
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
- PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
1977లో ప్రారంభించిన వాయేజర్ 1 స్పేస్క్రాఫ్ట్ 2012లో ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి ప్రవేశించింది. మానవజాతి నిర్మించిన ఈ వ్యోమనౌక భూమి నుంచి ఏకంగా 24 బిలియన్ కి.మీ ప్రయాణించింది. ఇప్పటికీ అంతదూరం నుంచి సమాచారాన్ని పంపిస్తుంది. ఈ సమాచారం భూమి-వాయేజర్ 1 మధ్య బదిలీ కావడానికి 22.5 గంటల సమయం పడుతోంది. దీని తర్వాత ప్రయోగించిన వాయేజర్ 2 నౌక కూడా 2018లో సౌర వ్యవస్థను దాటింది. వాయేజర్ అంతరిక్ష నౌకల్లో ఏర్పాటు చేసిన రెండు ‘‘గోల్డెన్ రికార్డ్స్’’-బంగారు పూతపూసిన రాగి డిస్కులు మానవులకు సంబంధించిన సమాచారం, తాము ఉన్న స్థానాన్ని తెలిపే సమాచారాన్ని కలిగి ఉంది. గ్రహాంతవాసులకు మనుషుల వివరాలను తెలియజేసేందుకు ఇది ఉద్దేశించబడింది. 2025 తర్వాత వీటిలో ఉన్న బ్యాటరీలు క్షీణించనున్నాయి. ఆ తర్వాత భూమికి సందేశాలు ఇవ్వడం ఆగిపోతాయని భావిస్తున్నారు. ఇక ఇవి మన పాలపుంతలో గంటకు 61 వేల కి.మీ వేగంతో ఇలా ప్రయాణిస్తూనే ఉంటాయి.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!