Mojtaba Khamenei: ‘‘దేవుడి దయతో అమెరికా లేని భవిష్యత్తు’’.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన..
- గల్ఫ్కు అమెరికా లేని భవిష్యత్తు..
- నీళ్ల అడుగు భాగమే అమెరికా స్థానం..
- యూఎస్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మొజ్తబా ఖమేనీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mojtaba Khamenei: ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాలు కూడా సవాల్లు, ప్రతిసవాల్లు విసురుకుంటున్నాయి. తాజాగా, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అమెరికాపై విరుచుకుపడ్డారు. ఆయన లిఖితపూర్వక సందేశాన్ని ఇరాన్ స్టేట్ మీడియా చదివి వినిపించింది. ఇరాన్తో అణు ఒప్పందం కుదిరే వరకు హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే మొజ్తబా నుంచి ఈ వార్నింగ్ వచ్చింది.
Read Also: Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
Also Read
- UFO Files: ఏలియన్ల గుట్టు రట్టు.. చరిత్రలో తొలిసారిగా 'UFO' రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా!
- Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ హత్యకు గురైతే, ప్రళయమే.. ఉత్తరకొరియా సంచలన నిర్ణయం..
- US: ‘‘ఇది ఇండియా కాదు’’.. టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు
- Vladimir Putin: పుతిన్కు ప్రాణగండం? రష్యాలో సైనిక తిరుగుబాటుకు స్కెచ్!
ఇరాన్ తన అణు, క్షిపణి సామర్థ్యాలను జాతీయ సంపదగా పరిరక్షించుకుంటుందని ఖమేనీ పేర్కొన్నారు. అమెరికాపై తీవ్ర విమర్శలు చేస్తూ.. అమెరికాకు పర్షియన్ గల్ఫ్లో చివరిస్థానం సముద్రం అడుగుభాగం అంటూ వ్యాఖ్యానించారు. ‘‘దైవ సహాయంతో శక్తితో పర్షియన్ గల్ఫ్ ప్రాంతం ఉజ్వల భవిష్యత్తు అమెరికా లేని భవిష్యత్తుగా ఉంటుంది. అది ఇక్కడి ప్రజల పురోగతి, సౌఖ్యం, శ్రేయస్సుకు సేవ చేసేదిగా ఉంటుంది’’ అని ఖమేనీ తన ప్రకటనలో పేర్కొన్నారు.
పర్షియన్ గల్ప్, ఒమన్ గల్ఫ్ జలాల అవతలి వైపున ఉన్న ఇరాన్, మా పొరుగు దేశాలు ఒకే విధిని పంచుకుంటున్నాయని, వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి దురాశ, దురుద్దేశంతో వ్యవహరించే విదేశీయులకు ఈ ప్రాంతంలో ఎలాంటి స్థానం లేదని, కేవలం దానికి మిగిలేది సముద్రపు అడుగు భాగమే అని ఖమేనీ అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం