Modi-Meloni Selfie Goes Viral: వైరల్గా మారిన మోడీ-మెలోని కొత్త సెల్ఫీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi-Meloni Selfie Goes Viral: ఇటలీ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ రోమ్ చేరుకోగా, ఇటలీ ప్రధాని జార్జియా మెలో ప్రత్యేకంగా స్వాగతం పలికారు. మెలోని తన సోషల్ మీడియా ఖాతాలో మోడీతో కలిసి దిగిన ఓ కొత్త సెల్ఫీని పంచుకుంటూ “రోమ్కు స్వాగతం, నా మిత్రమా!” అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రధాని మోడీ చేపట్టిన ఐదు దేశాల ఐరోపా పర్యటనలో ఇటలీ చివరి మరియు అత్యంత కీలకమైన దశగా భావిస్తున్నారు. జార్జియా మెలోని ప్రత్యేక ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ పర్యటన, మోడీ ఇటలీలో చేపట్టిన తొలి అధికారిక ద్వైపాక్షిక పర్యటన కావడం విశేషం. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, క్లీన్ ఎనర్జీ, ప్రపంచ సహకారం వంటి కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి.
మోడీ-మెలోని ఫొటోలు లేదా వీడియోలు వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. 2023లో దుబాయ్లో జరిగిన COP28 సదస్సులో “గుడ్ ఫ్రెండ్స్ ఎట్ COP28” సెల్ఫీ, 2024లో ఇటలీలో జరిగిన G7 సమావేశంలో “హలో ఫ్రం టీమ్ మెలోని” వీడియో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు తాజా సెల్ఫీ మరోసారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇటలీ చేరుకున్న ప్రధాని మోడీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. వారణాసి ఘాట్లను ప్రతిబింబించే ఒక ప్రత్యేక చిత్రపటాన్ని ఆయనకు బహూకరించారు. మోడీ కూడా అక్కడి భారతీయులతో ఆప్యాయంగా మమేకమయ్యారు.
Also Read
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఈ పర్యటనలో ప్రధాని మోడీ.. ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టారెల్లాతో సమావేశం కానున్నారు. అలాగే జార్జియా మెలోనితో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు, ఇరు దేశాల ప్రముఖ సీఈవోలతో సమావేశమై పెట్టుబడులు, వ్యాపార అవకాశాలపై చర్చించనున్నారు. ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ (FAO) ప్రధాన కార్యాలయాన్ని కూడా ఆయన సందర్శించనున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారుల ప్రకారం, 2023 తర్వాత మోడీ-మెలోని మధ్య ఇది ఎనిమిదో సమావేశం. భారత్-ఇటలీ సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. 2025-29 సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక కింద రక్షణ, ఉగ్రవాద నిరోధం, ఆర్థిక భాగస్వామ్యం వంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం యూరోపియన్ యూనియన్లో ఇటలీ భారతదేశానికి నాలుగో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2025 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 14.25 బిలియన్ యూరోలకు చేరుకుంటుందని అంచనా. 2029 నాటికి దీన్ని 20 బిలియన్ యూరోలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రక్షణ రంగంలో కూడా ఇరు దేశాలు కలిసి సైనిక పరికరాల సహ-అభివృద్ధి, సహ-ఉత్పత్తి అవకాశాలను పరిశీలిస్తున్నాయి. అలాగే క్వాంటం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), గ్రీన్ హైడ్రోజన్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో సంయుక్త ప్రాజెక్టులకు రూపకల్పన జరుగుతోంది. ఇక, ఇటలీలో ప్రస్తుతం 2 లక్షలకుపైగా భారతీయులు నివసిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. వలస మరియు చలనశీలత ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య ప్రజల రాకపోకలు మరింత సులభతరం అయ్యాయి. మొత్తంగా, ప్రధాని మోడీ ఇటలీ పర్యటన భారత్-ఇటలీ సంబంధాలకు కొత్త ఊపునిస్తూ, వ్యూహాత్మక, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో మరింత సహకారానికి దారి తీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Welcome to Rome, my friend! 🇮🇹🇮🇳 pic.twitter.com/mUjFL4HIqY
— Giorgia Meloni (@GiorgiaMeloni) May 19, 2026
తాజావార్తలు
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..