Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
- ఇంటర్నెట్ను షేక్ చేస్తోన్న మెలోడీ వీడియో
- గంటల్లోనే 100 మిలియన్ వ్యూస్!
- అంతర్జాతీయ లెవెల్లో హైలెట్గా మోడీ-మెలోని కెమిస్ట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటనలో చివరి ఇటలీ టూర్ హైలెట్గా నిలిచింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని-ప్రధాని మోడీ మధ్య ఉన్న స్నేహం ఇంటర్నెట్ను బాగా ఆకట్టుకుంది. ఇక ఇద్దరి మధ్య జరిగిన ఓ సరదా సన్నివేశం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రధాని మోడీ.. మెలోనీకి ‘మెలోడీ’ టాఫీలు బహుమతిగా ఇచ్చిన వీడియో కొన్ని గంటల్లోనే 100 మిలియన్ వ్యూస్ దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది.

Also Read
- H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
- Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
- Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
- US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. రోమ్లో ఇటలీ ప్రధాని మెలోనీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, సాంకేతికత, సంస్కృతి వంటి అంశాలపై చర్చలు జరిపారు. అధికారిక సమావేశాల మధ్యలో చోటుచేసుకున్న ఓ చిన్న సరదా సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ప్రధాని మోడీ చిరునవ్వుతో మెలోనీకి ‘మెలోడీ’ టాఫీల ప్యాక్ను అందజేస్తూ కనిపించారు. మెలోనీ కూడా నవ్వుతూ ఆ గిఫ్ట్ను స్వీకరించారు. ఈ వీడియోలో ఇద్దరు నాయకుల మధ్య కనిపించిన స్నేహపూర్వక అనుబంధం నెటిజన్లను ఆకట్టుకుంది. కేవలం కొన్ని గంటల్లోనే 10 కోట్ల వ్యూస్ దాటింది. ప్రస్తుతం ఈ వీడియో సరికొత్త రికార్డుగా దిశగా వెళ్తోంది.
ప్రస్తుతం మోడీ-మెలోనిల మధ్య ఉన్న అద్భుతమైన కెమిస్ట్రీ అంతర్జాతీయ లెవెల్లో మరోసారి హాట్ టాపిక్గా మారింది. మంగళవారం రాత్రి ప్రధాని మోడీ రోమ్ నగరంలో ల్యాండ్ అయిన వెంటనే.. జార్జియా మెలోని ఆయనకు గ్రాండ్ డిన్నర్ హోస్ట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి రోమ్ నగరానికి గర్వకారణమైన ఐకానిక్ కొలోసియం మానిమెంట్ దగ్గర కాసేపు సరదాగా నడుస్తూ డిస్కషన్స్ జరిపారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీతో దిగిన ఒక బ్యూటిఫుల్ సెల్ఫీని మెలోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “వెల్కమ్ టు రోమ్, మై ఫ్రెండ్!” అని క్యాప్షన్ పెట్టారు. అంతే.. ఆ పోస్ట్ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఏకంగా 3.2 మిలియన్ అంటే 32 లక్షలకు పైగా వ్యూస్, లక్షన్నర కంటే ఎక్కువ లైక్స్తో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్లోకి దూసుకెళ్లింది.
ఈ టూర్లో వీరిద్దరి మధ్య సరికొత్త ‘కార్ డిప్లొమసీ’ కూడా కనిపించింది. ప్రధాని మోడీ, మెలోని ఇద్దరూ ఒకే కారులో పక్కపక్కన కూర్చుని ఉన్న ఫొటోను మోడీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. “రోమ్లో ల్యాండ్ అయిన తర్వాత ప్రధాని మెలోనితో కలిసి డిన్నర్ చేశాను.. ఆపై ఐకానిక్ కొలోసియం విజిట్ చేసే ఛాన్స్ దక్కింది. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలపై మేమిద్దరం డిస్కస్ చేశాం. ఇండియా-ఇటలీ ఫ్రెండ్షిప్ను నెక్స్ట్ లెవెల్కు ఎలా తీసుకెళ్లాలనే దానిపై బుధవారం జరగబోయే అఫీషియల్ బైలాటరల్ టాక్స్ కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను” అంటూ మోడీ పోస్ట్ పెట్టారు.
నిజానికి మోడీ- మెలోనిల ఫొటోలు ఇంటర్నెట్ను షేక్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2024 జూన్లో ఇటలీలో జరిగిన జీ7 (G7) సమ్మిట్ సమయంలో కూడా మెలోని ఒక సెల్ఫీ వీడియో పెడుతూ.. “హలో ఫ్రెండ్స్, ఫ్రమ్ #Melodi టీమ్” అంటూ వేవ్ చేశారు. దానికి మోడీ కూడా స్పందిస్తూ.. “లాంగ్ లివ్ ఇండియా-ఇటలీ ఫ్రెండ్షిప్” అని రిప్లై ఇచ్చారు. అంతకుముందు 2023లో దుబాయ్లో జరిగిన కాప్28 (COP28) సమ్మిట్లో కూడా వీరిద్దరి సెల్ఫీ గ్లోబల్ వైడ్గా ట్రెండ్ అయింది. 2023లో ఢిల్లీలో జరిగిన జీ20 సమ్మిట్ కోసం ఇండియా వచ్చినప్పుడు మెలోనికి మోడీ గుజరాత్కు చెందిన సాంప్రదాయ ‘పటాన్ పటోలా’ స్కార్ఫ్ను ప్రెసెంట్ చేశారు. ఇక మోడీ మూడోసారి పీఎంగా గెలిచినప్పుడు యూరప్ నుంచి ఫస్ట్ కంగ్రాట్స్ చెప్పిన లీడర్ కూడా మెలోనినే కావడం విశేషం.
Thank you for the gift pic.twitter.com/7ePxbJwPbA
— Giorgia Meloni (@GiorgiaMeloni) May 20, 2026
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్కు తెలియని సీక్రెట్ ఇదే..!
-
Billa Ranga Baasha: సుదీప్ మూవీకి భారీ ప్లాన్.. ‘బిల్లా రంగ బాషా’ ప్రమోషనల్ క్యాలెండర్ అవుట్
-
Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
-
Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్తో హారర్ మూవీ?
-
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!